అడివి సాయికిరణ్, సంకల్ప్‌ రెడ్డి దర్శకత్వంలో శ్రీ చాముండీ చిత్ర సినిమాలు

  • IndiaGlitz, [Thursday,September 28 2017]

మిస్టర్‌ పెళ్లాం', శ్రీకారం' వంటి విజయవంతమైన చిత్రాలు నిర్మించిన ప్రముఖ నిర్మాణ సంస్థ శ్రీ చాముండీ చిత్ర చాలా విరామం తర్వాత మళ్లీ సినిమాలు నిర్మించనుంది. ఈ సంస్థ అధినేత గవర పార్థసారధి రెండు సినిమాలు నిర్మిస్తున్నారు. ఒకటి అడివి సాయికిరణ్‌ దర్శకత్వంలో మరొకటి సంకల్ప్‌రెడ్డి దర్శకత్వంలో

అడివి శేష్‌ హీరోగా...
వినాయకుడు', విలేజ్‌లో వినాయకుడు', కేరింత' వంటి చిత్రాల ద్వారా దర్శకుడు అడివి సాయికిరణ్‌ తనకంటూ మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. ఆయన దర్శకత్వంలో అడివి శేష్‌ హీరోగా గవర పార్థసారధి నిర్మిస్తోన్న చిత్రం మొదటి షెడ్యూల్‌ పూర్తయింది. రెండో షెడ్యూల్‌ త్వరలో ఆరంభం కానుంది. మంచి యూత్ ఫుల్ ఎంటర్ టైనర్ గా ఈ చిత్రం రూపొందుతోంది. ప్రముఖ సాంకేతిక నిపుణులు ఈ చిత్రానికి పని చేస్తున్నారు.

సంకల్ప్‌ రెడ్డి సినిమా త్వరలో ప్రారంభం
ఇండియన్‌ ఫస్ట్‌ సబ్‌మెరైన్‌ మూవీ ఘాజి' ద్వారా జాతీయ స్థాయిలో దర్శకుడిగా గుర్తింపు తెచ్చుకున్నారు సంకల్ప్‌ రెడ్డి. ఆయన దర్శకత్వంలో ఓ సెన్సేషనల్‌ మూవీ నిర్మించడానికి గవర పార్థసారధి సన్నాహాలు చేస్తున్నారు. త్వరలో ఈ చిత్రం ప్రారంభం కానుంది. ప్రస్తుతం ప్రీ-ప్రొడక్షన్ వర్క్ జరుగుతోంది. ఓ ప్రముఖ యువకథానాయకుడు ఈ చిత్రంలో నటించనున్నారు.

More News

ఆమెని కూడా మెచ్చుకున్న థ‌మ‌న్‌

యువ సంగీత ద‌ర్శ‌కుడు థ‌మ‌న్‌.. ఇప్పుడు చేతి నిండా సినిమాల‌తో ఫుల్ బిజీగా ఉన్న సంగ‌తి తెలిసిందే. నాగార్జున న‌టించిన రాజుగారి గ‌ది2, హిందీ చిత్రం గోల్ మాల్ ఎగైన్‌, సాయిధ‌ర‌మ్ జ‌వాన్‌తో పాటు రేపు విడుద‌ల కానున్న శ‌ర్వానంద్ మ‌హానుభావుడు చిత్రాల‌కు థ‌మ‌న్‌నే సంగీత ద‌ర్శ‌కుడు.

ఎన్టీఆర్‌, త్రివిక్ర‌మ్ సినిమా అప్పుడేనా?

ఎన్టీఆర్ త్రిపాత్రాభిన‌యం చేసిన జైల‌వ‌కుశ ఇటీవ‌లే ప్రేక్ష‌కుల ముందుకొచ్చింది. టాక్ ఎలా ఉన్నా.. ఓపెనింగ్స్ బాగా వ‌చ్చాయి. మ‌రికొద్ది రోజుల్లో  సినిమా బ్రేక్ ఈవెన్ అవుతుందా లేదా అన్న‌ది స్ప‌ష్ట‌మౌతుంది.

'స్పైడర్‌' మొదటి రోజు కలెక్షన్‌

సూపర్‌స్టార్‌ మహేష్‌, ఎ.ఆర్‌.మురుగదాస్‌ కాంబినేషన్‌లో ఠాగూర్‌ మధు సమర్పణలో ఎన్‌.వి.ఆర్‌. సినిమా ఎల్‌ఎల్‌పి, రిలయన్స్‌ ఎంటర్‌టైన్‌మెంట్‌ పతాకాలపై ఎన్‌.వి.ప్రసాద్‌ నిర్మించిన భారీ యాక్షన్‌ ఎంటర్‌టైనర్‌ 'స్పైడర్‌'. సెప్టెంబర్‌ 27న ప్రపంచ వ్యాప్తంగా విడుదలైన ఈ చిత్రం మొదటి రోజు 51 కోట్ల రూపాయలు కలెక్ట్‌ చేసి సంచలనం సృష్టించింది.

మొద‌టి షెడ్యూల్ చిత్రీక‌ర‌ణ పూర్తి చేసుకున్న వింగ్స్ మూవీ మేక‌ర్స్ చిత్రం

కార్తీక్‌రాజు, మిస్తి చక్రవర్తి హీరో హీరోయిన్లుగా వింగ్స్ మూవీ మేక‌ర్స్ బేన‌ర్‌పై ఇటీవ‌ల కొత్త చిత్రం ప్రారంభ‌మైన సంగ‌తి తెలిసిందే. ఎం.పూర్ణానంద్‌ దర్శకుడు. ప్రతిమ.జి నిర్మాత. ఈ సినిమా శ‌ర‌వేగంగా చిత్రీక‌ర‌ణ జ‌రుపుకుంటోంది.

నేను కిడ్నాప్ అయ్యాను అక్టోబర్ 6 విడుదల

మధురం మూవీ క్రియేషన్స్ పతాకంపై, కిడ్నాప్ డ్రామా నేపథ్యంలో  దగ్గుబాటి  వరుణ్ సమర్పణలో  మాధవి అద్దంకి నిర్మిస్తున్న చిత్రం 'నేను కిడ్నాప్ అయ్యాను'. ఈ చిత్రం సెన్సార్ కార్యక్రమాలు పూర్తిచేసుకుని   క్లీన్ 'యూ' సర్టిఫికెట్ సంపాదించుకుంది .