విజయ్ సేతుపతి-జయరామ్ హీరోలుగా నటించిన 'రేడియో మాధవ్' ఫస్ట్ లుక్ విడుదల చేసిన హీరో శ్రీవిష్ణు

  • IndiaGlitz, [Wednesday,October 07 2020]

విజయ్ సేతుపతి, జయరామ్ హీరోలుగా నటించిన మలయాళ సినిమా 'మార్కొని మతాయ్'. సనల్ కలతిల్ దర్శకత్వం వహించారు. ఫ్యామిలీ ఎంటర్టైనర్ గా రూపొందిన ఈ సినిమా అక్కడ మంచి విజయం సాధించింది. అతి తక్కువ సమయంలో తమిళంలో కథానాయకుడిగా, నటుడిగా మంచి పేరు తెచ్చుకున్న విజయ్ సేతుపతి మలయాళంలో నటించిన తొలి చిత్రమిది. తెలుగు ప్రేక్షకుల ముందుకు 'రేడియో మాధవ్'గా ఈ సినిమాను తీసుకొస్తున్నారు లక్ష్మీ చెన్నకేశవ ఫిలిమ్స్ అధినేత, నిర్మాత కృష్ణస్వామి. ఈ సినిమా తెలుగు వెర్షన్ ఫస్ట్ లుక్ ను బుధవారం హీరో శ్రీవిష్ణు విడుదల చేశారు.

అనంతరం ఆయన మాట్లాడుతూ విజయ్ సేతుపతిగారు నటించిన 'రేడియో మాధవ్' తెలుగులో అనువాదం అవుతున్నందుకు చాలా సంతోషంగా ఉంది. దర్శక, నిర్మాతలకు ఆల్ ది బెస్ట్. ఈ సినిమా తప్పకుండా సక్సెస్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అని అన్నారు.

నిర్మాత కృష్ణస్వామి మాట్లాడుతూ “ మా సినిమా ఫస్ట్ లుక్ విడుదల చేసిన శ్రీవిష్ణుగారికి చాలా చాలా స్పెషల్ థాంక్స్. మా సంస్థ రెండో చిత్రమిది. ఇంతకు ముందు దుల్కర్ సల్మాన్, సాయి పల్లవి నటించిన 'హే పిల్లగాడ' విడుదల చేశా. ఇప్పుడు 'రేడియో మాధవ్' తీసుకొస్తున్నాను. ఈ సినిమాలో విజయ్ సేతుపతి హీరోగా కనిపిస్తారు. తన నిజ జీవిత పాత్రలో ఆయన నటించారు. భాగమతి, అల వైకుంఠపురం చిత్రాలలో విలన్ గా తండ్రిగా నటించిన జయరామ్ ఈ చిత్రంలో మిలటరీ నుంచి బయటకి వచ్చి బ్యాంకు సెక్యూరిటీ గార్డ్ గా పనిచేస్తూ ఉండే పాత్ర పోషించాడు. ఎఫ్.ఎం. రేడియో స్టేషన్ బ్యాక్ డ్రాప్ లో నడిచే ప్రేమకథ ఈ 'రేడియో మాధవ్' సినిమా అని అన్నారు.

సహ నిర్మాత చలం మాట్లాడుతూ కేరళ పచ్చటి అందాల మధ్య ఉన్న చంగనసేరి అనే చిన్న పట్టణంలో నడిచే చక్కటి సినిమా 'రేడియో మాధవ్'. ఇందులో పాటలు చాల బాగుంటాయి. థియేటర్లలో పరిస్థితిని బట్టి విడుదలపై నిర్ణయం తీసుకుంటాం అని చెప్పారు.

చిత్ర నిర్వాహకుడు శ్రీనివాస మూర్తి మాట్లాడుతూ రేడియో మాధవ్' ఒక ఫీల్ గుడ్ సినిమా. హీరో హీరోయిన్లు ఎప్పుడు కలుస్తారా? అని ప్రేక్షకులు ఎదురు చూసేలా ఉంటుంది అని అన్నారు.

తెలుగులో మాటలు, పాటలు రాసిన భాష్య శ్రీ మాట్లాడుతూ తెలుగులో వెంకటేష్ గారు నటించిన 'రాజా', 'సంక్రాంతి' తరహా మ్యూజికల్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ సినిమా ఇది. మలయాళంలో పెద్ద విజయం సాధించింది. తెలుగులోనూ మంచి విజయం సాధిస్తుందని ఆశిస్తున్నాను. ఎంజాయ్ చేస్తూ చేసిన డబ్బింగ్ సినిమా ఇది అని అన్నారు.

విజయ్ సేతుపతి, జయరామ్, ఆత్మీయ రాజన్, పూర్ణ, నరేన్, అజూ వర్గీస్ తదితరులు సినిమాలో నటించారు. ఈ చిత్రానికి సమర్పణ: గుండేపూడి శీను, మాటలు & పాటలు : భాష్య శ్రీ, ఎడిటింగ్‌: షామీర్ ముహమ్మెద్, కెమెరా: సజన్ కలతిల్, సంగీతం: ఏం. జయచంద్రన్, పీఆర్వో: సురేంద్ర కుమార్ నాయుడు-ఫణి కందుకూరి (Beyond Media), ఎగ్జిక్యూటివ్‌ నిర్మాత: ఎన్. శ్రీనివాస మూర్తి, సహ- నిర్మాత: డి.వి . చలం, నిర్మాత: డి.వి . కృష్ణస్వామి, కధ-దర్శకత్వం: సనల్ కలతిల్

More News

రామ్ చరణ్ హోస్ట్‌గా డ్యాన్స్ టాలెంట్ షో.. ప్రత్యేకత ఏంటంటే..

రామ్ చరణ్ భార్యగా మాత్రమే కాకుండా అపోలో లైఫ్ వైస్ చైర్ పర్సన్‌, ‘బీ పాజిటివ్’ మ్యాగజైన్ చీఫ్ ఎడిటర్‌‌‌గా ఉపాసన ఒక సొంత ఇమేజ్‌ను సంపాదించుకున్నారు.

40 ఏళ్ల క్రితం టైటిల్‌తో క‌మ‌ల్ హాస‌న్‌..!

యూనివ‌ర్స‌ల్ స్టార్ క‌మ‌ల్‌హాస‌న్ హీరోగా `ఖైదీ`తో సెన్సేష‌న‌ల్ హిట్ కొట్టిన లొకేష్ క‌న‌రాజ్ ఓ చిత్రాన్ని డైరెక్ట్ చేస్తున్న సంగ‌తి తెలిసిందే.

డ్రగ్స్‌ కేసులో రియా చక్రవర్తికి బెయిల్‌..

ముంబై: డ్రగ్స్‌ కేసులో నటుడు సుశాంత్ చక్రవర్తి ప్రియురాలు రియా చక్రవర్తికి బెయిల్‌ లభించింది. గత నెల 9 నుంచి ముంబై బైకుల్లా జైలులో రియా ఉంది.

‘క్రాక్‌’ మొదలెట్టేశారు...!

మాస్ మ‌హారాజా ర‌వితేజ‌ లేటెస్ట్ చిత్రం` క్రాక్‌`. ఈ ఏడాది వేస‌విలో ఈ సినిమా విడుద‌ల కావాల్సిన ఈ సినిమా క‌రోనా వైర‌స్ కార‌ణంగా తుది ద‌శ చిత్రీక‌ర‌ణ ద‌శ‌లో ఆగింది.

బ‌రిలోకి దిగుతున్న య‌ష్‌

క‌న్న‌డ రాకింగ్ స్టార్ య‌ష్ హీరోగా ప్ర‌శాంత్ నీల్ ద‌ర్శ‌క‌త్వంలో రూపొందుతోన్న చిత్రం ‘కేజీయఫ్ చాప్టర్ 2’.