'ఎదురీత' సెన్సార్ పూర్తి... త్వరలో విడుదలకు సన్నాహాలు

  • IndiaGlitz, [Wednesday,April 28 2021]

'సై', 'దూకుడు', 'శ్రీమంతుడు', 'బిందాస్', 'మగధీర', 'ఏక్ నిరంజన్' తదితర చిత్రాల్లో నటించిన శ్రవణ్ రాఘవేంద్ర హీరోగా పరిచయమవుతున్న సినిమా 'ఎదురీత'. శ్రీ భాగ్యలక్ష్మి ఎంట‌ర్‌టైన్‌మెంట్స్ ప‌తాకంపై బోగారి లక్ష్మీనారాయణ, బోగారి ఈశ్వర్ చరణ్ నిర్మించారు. బాలమురుగన్ దర్శకత్వం వహించారు. ఇందులో లియోనా లిషోయ్ హీరోయిన్. ఈ సినిమా సెన్సార్ పూర్తయింది. త్వరలో విడుదలకు సన్నాహాలు చేస్తున్నారు.

ఈ సందర్భంగా నిర్మాత బోగారి ఈశ్వర్ చరణ్ మాట్లాడుతూ ఓ 40 ఏళ్ల మధ్యతరగతి తండ్రికి కుమారుడిపై ప్ర్రేమ ఎన్ని సమస్యలు తీసుకువచ్చింది? అనేది సినిమా కథాంశం. ప్రతి తండ్రి, ప్రతి కుమారుడి హృదయాన్ని హత్తుకునేలా సినిమాలో భావోద్వేగాలు ఉంటాయి. సినిమా సెన్సార్ పూర్తి అయ్యింది. త్వరలో పాటలు విడుదల చేసి, చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తాం అని చెప్పారు.

సంపత్ రాజ్, జియా శర్మ, శాన్వీ మేఘన, నోయెల్ సేన్, 30 ఇయర్స్ పృథ్వీ, 'రంగస్థలం' మహేష్, కాశి విశ్వనాథ్, రవిప్రకాష్, భద్రమ్, 'మాస్టర్' చరణ్ రామ్ తదితరులు నటించిన ఈ చిత్రానికి

ఛాయాగ్రహణం: విజయ్ ఆర్పుదరాజ్ (రత్నవేలు దగ్గర కుమారి21ఎఫ్, బ్రహ్మోత్సవం, లింగ చిత్రాలకు సహాయకుడిగా పనిచేశారు), పాటల రచయితలు: డా. చల్లా భాగ్యలక్ష్మి, శ్రేష్ఠ, రోల్ రిడా, విశ్వ, స్వామి, ఎడిటర్: నగూరన్ రామచంద్రన్, మ్యూజిక్ డైరెక్టర్: అరల్ కొరెల్లి , పోస్టర్ డిజైన్: అనిల్ భాను, పీఆర్: నాయిడు సురేంద్ర కుమార్ - ఫణి కందుకూరి (బియాండ్ మీడియా), దర్శకుడు: బాలమురుగన్ (దర్శకుడు విజయ్ మిల్టన్ దగ్గర 'గోలి సోడా', 'కడుగు', తెలుగులో 'టెన్'గా విడుదలైన విక్రమ్, సమంత సినిమాకు దర్శకత్వ శాఖలో పని చేశారు), నిర్మాత : బోగారి లక్ష్మీనారాయణ, బోగారి ఈశ్వర్ చరణ్.

More News

టీటీడీ తాత్కాలిక ఈవోగా అదనపు ఈవో ధర్మారెడ్డి

టీటీడీ అదనపు ఈవో ధర్మారెడ్డిని తాత్కాలికంగా.. ఈవో కార్యకలాపాలు చూడాలంటూ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది.

సేమ్ టు సేమ్ పెంపుడు కుక్కలతో సమంత, అనసూయ..

కుక్కలంటే అక్కినేని వారి కోడలు, స్టార్ హీరోయిన్ సమంతకు ఎంత ఇష్టమో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు.

మెగాస్టార్‌ని ఢీకొట్టబోతున్న స్టైలిష్ స్టార్?

కరోనా సెకండ్ వేవ్ కారణంగా ఎవరూ థియేటర్లకు వెళ్లే పరిస్థితి లేదు. దీంతో ఇప్పుడు రిలీజ్ అవ్వాల్సిన సినిమాలన్నీ వెనక్కి వెళ్లిపోతున్నాయి.

కరోనా టీకా కోసం రిజిస్ట్రేషన్ చేసుకోండిలా..

కరోనా మహమ్మారి రోజురోజుకూ విజృంభిస్తున్న తరుణంలో ఈ మహమ్మారికి చెక్ పెట్టే కార్యక్రమం మరో రెండు రోజుల్లో ప్రారంభం కానుంది.

అల్లు అర్జున్‌కు కరోనా పాజిటివ్

కరోనా మహమ్మారి దేశ వ్యాప్తంగా విజృంభణ కొనసాగిస్తోంది. రోజుకు రెండున్నర లక్షలకు పైగా కేసులు నమోదవుతూ ఆందోళనకు గురి చేస్తోంది.