'స్పైడర్‌' మొదటి రోజు కలెక్షన్‌

  • IndiaGlitz, [Thursday,September 28 2017]

సూపర్‌స్టార్‌ మహేష్‌, ఎ.ఆర్‌.మురుగదాస్‌ కాంబినేషన్‌లో ఠాగూర్‌ మధు సమర్పణలో ఎన్‌.వి.ఆర్‌. సినిమా ఎల్‌ఎల్‌పి, రిలయన్స్‌ ఎంటర్‌టైన్‌మెంట్‌ పతాకాలపై ఎన్‌.వి.ప్రసాద్‌ నిర్మించిన భారీ యాక్షన్‌ ఎంటర్‌టైనర్‌ 'స్పైడర్‌'. సెప్టెంబర్‌ 27న ప్రపంచ వ్యాప్తంగా విడుదలైన ఈ చిత్రం మొదటి రోజు 51 కోట్ల రూపాయలు కలెక్ట్‌ చేసి సంచలనం సృష్టించింది.

ఈ సందర్భంగా నిర్మాతలు ఎన్‌.వి.ప్రసాద్‌, ఠాగూర్‌ మధు మాట్లాడుతూ ''భారీ బడ్జెట్‌తో సూపర్‌స్టార్‌ మహేష్‌, మురుగదాస్‌ కాంబినేషన్‌లో నిర్మించిన 'స్పైడర్‌' చిత్రానికి ప్రపంచ వ్యాప్తంగా భారీ ఓపెనింగ్స్‌ వచ్చాయి. ఓవర్సీస్‌ ప్రీమియర్స్‌లోనే 1 మిలియన్‌ డాలర్లకుపైగా కలెక్ట్‌ చేసి సంచలనం సృష్టించింది. అంతేకాకుండా ప్రపంచ వ్యాప్తంగా 'స్పైడర్‌' మొదటిరోజు 51 కోట్లు కలెక్ట్‌ చేయడం మాకెంతో సంతోషాన్ని కలిగిస్తోంది. ఇంతటి భారీ విజయాన్ని మాకు అందించిన ప్రేక్షకులకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. అలాగే ఇంత భారీ సినిమా చేసే అవకాశం ఇచ్చిన సూపర్‌స్టార్‌ మహేష్‌, మురుగదాస్‌గార్లకు మా కృతజ్ఞతలు'' అన్నారు.

More News

మొద‌టి షెడ్యూల్ చిత్రీక‌ర‌ణ పూర్తి చేసుకున్న వింగ్స్ మూవీ మేక‌ర్స్ చిత్రం

కార్తీక్‌రాజు, మిస్తి చక్రవర్తి హీరో హీరోయిన్లుగా వింగ్స్ మూవీ మేక‌ర్స్ బేన‌ర్‌పై ఇటీవ‌ల కొత్త చిత్రం ప్రారంభ‌మైన సంగ‌తి తెలిసిందే. ఎం.పూర్ణానంద్‌ దర్శకుడు. ప్రతిమ.జి నిర్మాత. ఈ సినిమా శ‌ర‌వేగంగా చిత్రీక‌ర‌ణ జ‌రుపుకుంటోంది.

నేను కిడ్నాప్ అయ్యాను అక్టోబర్ 6 విడుదల

మధురం మూవీ క్రియేషన్స్ పతాకంపై, కిడ్నాప్ డ్రామా నేపథ్యంలో  దగ్గుబాటి  వరుణ్ సమర్పణలో  మాధవి అద్దంకి నిర్మిస్తున్న చిత్రం 'నేను కిడ్నాప్ అయ్యాను'. ఈ చిత్రం సెన్సార్ కార్యక్రమాలు పూర్తిచేసుకుని   క్లీన్ 'యూ' సర్టిఫికెట్ సంపాదించుకుంది .

సూపర్ స్టార్ మహేష్ 'స్పైడర్'కి సూపర్ స్టార్ రజనీకాంత్ ప్రశంసలు

సూపర్ స్టార్ మహేష్, ఎ.ఆర్.మురుగదాస్ కాంబినేషన్ లో ఠాగూర్మధు సమర్పణలో ఎన్.వి.ఆర్. సినిమా ఎల్ ఎల్ పి, రిలయన్స్ ఎంటర్ టైన్ మెంట్ పతాకాలపై ఎన్.ప్రసాద్ నిర్మించిన భారీ యాక్షన్ ఎంటర్ టైనర్ 'స్పైడర్'.

రెగ్యులర్ షూటింగ్ లో సాయిధరమ్ తేజ్- వి.వి.వినాయక్ చిత్రం

సుప్రీమ్ హీరో సాయిధరమ్తేజ్ కథానాయకుడిగా సి.కె.ఎంటర్టైన్మెంట్స్ ప్రై. లిమిటెడ్ పతాకంపై సెన్సేషనల్ డైరెక్టర్ వి.వి.వినాయక్ దర్శకత్వంలో ప్రముఖ నిర్మాత సి.కళ్యాణ్ నిర్మిస్తున్న భారీ చిత్రం రెగ్యులర్ సెప్టెంబర్ 22న హైదరాబాద్లో ప్రారంభమైంది.

రాక్ స్టార్ దేవిశ్రీ ప్రసాద్ కి బ్రేక్ నిచ్చిన 'ఆనందం'కి 16 ఏళ్లు

ప్రస్తుతం తెలుగులో నెం.1 మ్యూజిక్ డైరెక్టర్ గా దూసుకుపోతున్నాడు యువ సంగీత సంచలనం దేవిశ్రీ ప్రసాద్. 1999లో విడుదలైన దేవి చిత్రంతో సంగీత దర్శకుడిగా పరిచయమైన దేవిశ్రీకి ...