సుకుమార్‌కు ప్ర‌త్యేక‌మైన రోజు ఇది

  • IndiaGlitz, [Monday,May 07 2018]

'రంగస్థలం'తో సంచలన విజయం అందుకున్న ద‌ర్శ‌కుడు సుకుమార్. 1980ల నాటి గ్రామీణ వాతావరణాన్ని పునః సృష్టించి వెండితెరపై మ్యాజిక్ చేశారు.  అంతేగాకుండా, రామ్ చరణ్‌ని కొత్త కోణంలో చూపి అబ్బురపరిచారు. అలాంటి సుకుమార్‌ను తెలుగువారికి దర్శకుడిగా పరిచయం చేసిన‌ సినిమా 'ఆర్య'. 2004లో విడుదలైన ఈ సినిమాతో వన్ సైడ్ లవ్‌కి  అర్థం చెప్తూనే.. ప్రేమకి కొత్త భాష్యం చెప్పారు సుకుమార్.

అలాగే ఈ సినిమాతో అల్లు అర్జున్‌ని స్టార్ హీరోగా చేశారు ఈ టాలెంటెడ్ డైరెక్ట‌ర్‌. ఈ సినిమాకి సంబంధించిన కథ, కథనంతో పాటు పాటలు కూడా శ్రోతలను అలరించాయి. అలాగే తొలి చిత్రంతోనే బెస్ట్ డైరెక్టర్‌గా ఫిల్మ్ ఫేర్‌ను సొంతం చేసుకున్నారు సుకుమార్. దిల్ రాజు నిర్మాణంలో మే 7, 2004న‌ విడుదలైన ఈ సినిమా అప్పట్లో బ్లాక్ బస్టర్ హిట్‌గా నిలిచింది. ఆ తర్వాత 'జగడం', 'ఆర్య 2', '100% లవ్', '1 నేనొక్కడినే', 'నాన్నకు ప్రేమతో' లాంటి సినిమాలను తెరకెక్కించి బ్రిలియంట్ డైరెక్టర్ అనిపించుకున్నారు సుకుమార్‌.

ఇండస్ట్రీలో అడుగుపెట్టి 14 సంవత్సరాలైనా.. సుక్కు చేసినవి కేవలం 7 సినిమాలంటే.. ఈ లెక్కల మాస్టర్ ఒక సినిమా కోసం ఎంత టైమ్ కేటాయిస్తారో ఈయన ట్రాక్ రికార్డ్‌ చెప్ప‌క‌నే చెబుతోంది. అంతేకాదు.. తను నిర్మించిన 'కుమారి 21ఎఫ్'తో నిర్మాతగా కూడా బ్లాక్ బస్టర్ హిట్‌ను అందుకున్నారు సుకుమార్. నేటితో ద‌ర్శ‌కుడిగా 14 ఏళ్ళ కెరీర్‌ను పూర్తిచేసుకుంటున్న సుకుమార్‌.. మున్ముందు మ‌రిన్ని విజ‌యాలు అందుకోవాలని ఆశిద్దాం.

More News

విభిన్నమైన చిత్రాలని నిర్మించగల ప్రతిభ ని తయారు చేయడమే లక్ష్యం - నాగార్జున

'AISFM గ్రాండ్ ఫిలిం ఫెస్టివల్ 2018 ' లో భాగంగా అన్నపూర్ణ ఇంటర్నేషనల్ ఫిలిం స్కూల్ విద్యార్థులు నిర్మించిన 8  చిత్రాల ప్రదర్శన అన్నపూర్ణ ఇంటర్నేషనల్ స్కూల్ అఫ్ ఫిలిం అండ్ మీడియా (AISFM)

'నా నువ్వే' ఓ బ్యూటీఫుల్ మ్యూజికల్ ల‌వ్ స్టోరీ - నంద‌మూరి క‌ల్యాణ్ రామ్

నంద‌మూరి క‌ల్యాణ్ రామ్‌, మిల్కీ బ్యూటీ త‌మ‌న్నా హీరో హీరోయిన్లుగా న‌టించిన చిత్రం 'నా నువ్వే'.

కొత్త త‌ర‌హా మేన‌రిజ‌మ్స్‌తో నాని?

కింగ్ నాగార్జున, నేచురల్ స్టార్ నాని హీరోలుగా వైజయంతి మూవీస్ బ్యానర్‌పై ప్రముఖ నిర్మాత అశ్వనీదత్ ఓ మల్టీస్టారర్ మూవీ నిర్మిస్తున్న విషయం తెలిసిందే.

సైరాలో బ‌న్ని విల‌న్‌...

అల్లు అర్జున్ 'రేసుగుర్రం'తో విల‌న్‌గా ప‌రిచ‌య‌మైన బోజ్‌పురి న‌టుడు ర‌వికిష‌న్‌. త‌ర్వాత ఈ యాక్ట‌ర్ ప‌లు తెలుగు చిత్రాల్లో త‌న‌దైన విల‌క్ష‌ణ న‌ట‌న‌తో ప్రేక్ష‌కుల‌ను మెప్పించిన సంగ‌తి తెలిసిందే.

మ‌ల‌యాళంలో నాగ్‌...

కింగ్ నాగార్జున ఇప్పుడు మ‌ల‌యాళ సినిమాలో న‌టించ‌బోతున్నారు. మ‌ల‌యాళ ద‌ర్శ‌కుడు ప్రియ‌ద‌ర్శ‌న్‌తో నాగార్జున‌కు మంచి అనుబంధం ఉన్న సంగ‌తి తెలిసిందే.