2008 అహ్మాదాబాద్ పేలుళ్ల కేసు: 38 మందికి మరణశిక్ష... న్యాయస్థానం సంచలన తీర్పు

  • IndiaGlitz, [Friday,February 18 2022]

పద్నాలుగేళ్ల నాటి అహ్మదాబాద్‌ వరుస బాంబు పేలుళ్ల కేసులో ప్రత్యేక న్యాయస్థానం శుక్రవారం సంచలన తీర్పు వెల్లడించింది. ఈ కేసులో ఇప్పటికే 49 మందిని దోషులుగా తేల్చిన కోర్టు ఈరోజు వారికి శిక్షలు ఖరారు చేసింది. దోషుల్లో 38 మందికి మరణ శిక్ష విధిస్తున్నట్లు న్యాయస్థానం సంచలన తీర్పు వెలువరించింది. మిగిలిన 11 మంది దోషులకు జీవిత ఖైదు విధించింది.

2008 జులై 26న అహ్మదాబాద్‌ నగరంలో ఉగ్రవాదులు వరుస బాంబు పేలుళ్లతో మారణహోమం సృష్టించడంతో యావత్ దేశం ఉలిక్కిపడింది. 70 నిమిషాల వ్యవధిలో 21 బాంబు పేలుళ్లు చోటుచేసుకున్నాయి. ఈ ఘటనలో 56 మంది ప్రాణాలు కోల్పోగా.. 200 మందికి పైగా గాయపడ్డారు. ఈ కేసులో దర్యాప్తు చేపట్టిన పోలీసులు దేశంలోని పలు ప్రాంతాల నుంచి 78 మందిని అదుపులోకి తీసుకున్నారు. వీరికి నిషేధిత ఉగ్ర సంస్థ ఇండియన్‌ ముజాహిదీన్‌(ఐఎం)తో సంబంధాలున్నాయని తేలింది. 2009 డిసెంబరులో విచారణ ప్రారంభం కాగా ఒక నిందితుడు అప్రూవర్‌గా మారడంతో మిగిలిన 77 మందిపై కోర్టులో విచారణ కొనసాగింది. 13 ఏళ్ల పాటు జరిగిన విచారణలో 1,100 మంది సాక్ష్యులను న్యాయస్థానం విచారించింది.

గతేడాది సెప్టెంబరులో విచారణ ముగియగా వీరిలో 49 మందిని దోషులుగా నిర్ధారిస్తూ ఈ నెల 8న ప్రత్యేక న్యాయస్థానం తీర్పు వెలువరించింది. సరైన సాక్ష్యాధారాలు లేని కారణంగా మిగిలిన వారిని నిర్దోషులుగా తేల్చింది. తాజాగా దోషులకు నేడు న్యాయస్థానం శిక్ష ఖరారు చేసింది.

More News

కూరగాయలు, పువ్వులతో కేసీఆర్ చిత్రం.. తెలంగాణ సీఎంకు కడియంలో వినూత్నంగా బర్త్ డే విషెస్

తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ పుట్టినరోజు వేడుకలు ఘనంగా జరిగాయి. అయితే చంద్రశేఖర్ రావుకు ఏపీలోనూ అభిమానులున్న సంగతి తెలిసిందే.

కిరణ్ అబ్బవరం 'సెబాస్టియన్ పిసి524'లో 'హేలి...' సాంగ్ విడుదల

టాలెంట్‌ ఉన్నోళ్లకు టాలీవుడ్‌ ఎప్పుడూ వెల్కమ్‌ చెబుతుంది. కథానాయకుడిగా పరిచయమైన 'రాజావారు రాణిగారు' సినిమాతో కంటెంట్‌ ఉన్న కుర్రాడని కిరణ్‌ అబ్బవరం పేరు తెచ్చుకున్నారు.

టాలీవుడ్‌కు బిగ్‌ రిలీఫ్.. రేపటి నుంచి థియేటర్‌లలో 100 శాతం ఆక్యూపెన్సీ

తెలుగు చిత్ర పరిశ్రమ- ఏపీ ప్రభుత్వానికి మధ్య నలుగుతున్న సమస్యలకు ఓ పరిష్కారం లభించేలా కనిపిస్తోంది. ఇప్పటికే మెగాస్టార్ చిరంజీవి బృందం, మంచు విష్ణులు ఏపీ సీఎం వైఎస్ జగన్‌తో భేటీ అయ్యారు.

నాపైనా, నా ఫ్యామిలీపైనా ట్రోలింగ్.. ఓ ఇద్దరు హీరోల పనే ఇది, శిక్ష తప్పదు : మోహన్ బాబు సంచలన వ్యాఖ్యలు

తనపైనా, తన కుటుంబంపైనా సోషల్ మీడియాలో ట్రోల్ చేస్తున్న వారికి కలెక్షన్ కింగ్ డాక్టర్ మోహన్ బాబు వార్నింగ్ ఇచ్చారు. టాలీవుడ్‌కి చెందిన ఓ ఇద్దరు హీరోలు దీని వెనుక వున్నారని..

అమితాబ్ బాడీగార్డ్‌‌గా విధులు.. కానిస్టేబుల్ ఆస్తులు చూసి షాకైన అధికారులు

ప్రముఖులు, సెలబ్రెటీల పేర్లు చెప్పి.. లేదా వాళ్లతో ఫోటోలు దిగి కేటుగాళ్లు పలువురిని మోసం చేసిన ఉదంతాలు ఎన్నో. అయితే ఈ కేసులో మాత్రం ఏకంగా సెలబ్రెటీ దగ్గర పనిచేసిన మాజీ అంగరక్షకుడు కోట్లు వెనకేశాడు.