అంతరిక్ష నేపథ్యం..రూ.25 కోట్లు

  • IndiaGlitz, [Saturday,January 20 2018]

ఘాజీ' సినిమాతో ఇండస్ట్రీ దృష్టిని తన వైపు తిప్పుకున్న న‌వ‌త‌రం దర్శకుడు సంకల్ప్ రెడ్డి. జలాంత‌ర్గామి యుద్ధం నేపథ్యంతో.. తక్కువ ఖర్చుతో ఈ సినిమాని తెరకెక్కించి.. నిర్మాతలకు పెద్ద విజయాన్ని అందించిన ఘ‌న‌త ఈ డైరెక్టర్‌ది. ఈసారి అంతరిక్ష నేపథ్యంతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు సంక‌ల్ప్‌. అంతేకాకుండా.. ఈ సినిమాలో మెగా హీరో వరుణ్ తేజ్‌ని కథానాయకుడిగా ఎంపిక చేసుకున్నారు సంకల్ప్ రెడ్డి.

అలాగే ఈ చిత్రానికి సంబంధించి అవసరమైన శిక్షణను కూడా తీసుకోమని వరుణ్ తేజ్‌కి ఆయ‌న‌ చెప్పినట్లు సమాచారం. అంతరిక్ష నేపథ్యంతో సినిమా అంటే బడ్జెట్ కూడా భారీగానే ఉంటుందని నిర్మాతలు భావించారు. కాని సంకల్ప్ రెడ్డి కేవలం రూ. 25కోట్లతో సినిమాని తెరకెక్కించేందుకు ప్లాన్ చేశార‌ని ఇన్‌సైడ్‌ సోర్స్ టాక్. ఇదే అంతరిక్ష నేపథ్యంతో 'జయం' రవి హీరోగా టిక్ టిక్ టిక్' పేరుతో రూపొందిన త‌మిళ‌ సినిమా.. ఈ నెల 26న విడుదలకి సిద్ధ‌మ‌వుతోంది. మ‌రి.. ఈ నేప‌థ్యంలో ఘాజీ' డైరెక్టర్ తన అప్ కమింగ్ ప్రాజెక్టుని ఎటువంటి ఆసక్తికరమైన అంశాలతో తెరకెక్కిస్తారోనని ఇండస్ట్రీ వర్గాలు ఆస‌క్తిగా ఎదురు చూస్తున్నాయి.

More News

ఆ వార్త‌ల‌ను ఖండించిన నాని

ఎవ‌డే సుబ్ర‌మ‌ణ్యంతో మొద‌లైన నాని విజ‌య‌యాత్ర ఎంసీఏ వ‌ర‌కు స‌క్సెస్‌ఫుల్‌గా ర‌న్ అయిన సంగ‌తి తెలిసిందే. ప్ర‌స్తుతం ఆయ‌న కృష్ణార్జున యుద్ధం అనే సినిమా చేస్తున్నారు. ఇందులో నాని రెండు పాత్ర‌ల్లో సంద‌డి చేస్తున్నారు. ఒక పాత్ర కృష్ణ కాగా.. మ‌రో పాత్ర అర్జున‌. ఈ రెండు పాత్ర‌ల ఫ‌స్ట్ లుక్స్‌ని సంక్రాంతి సంద‌ర్భంగా విడుద‌ల చేశారు. వ

విజయకృష్ణ పేరుతో ట్రస్ట్ ఆరంభించి అవసరార్ధులను ఆదుకొంటాను - సీనియర్ నరేష్

సీనియర్ నరేష్ పుట్టిన రోజు వేడుకలు శనివారం హైదరాబాద్ లోని నానాక్ రామ గూడలోని కృష్ణ నివాసంలో అభిమానులు మరియు 'మా' సభ్యుల నడుమ ఘనంగా జరిగాయి.

'ఆచారి అమెరికా యాత్ర' ఆడియో మరియు ట్రైలర్ విడుదల

విష్ణు మంచు హీరోగా నటించిన 'ఆచారి అమెరికా యాత్ర' చిత్రం రిపబ్లిక్ డే సందర్భంగా జనవరి 26న విడుదల కానున్నది.

సాయిధరమ్ తేజ్ - వినాయక్ 'ఇంటెలిజెంట్' రిలీజ్ డేట్

సుప్రీమ్ హీరో సాయిధరమ్ తేజ్ కథానాయకుడిగా సి.కె.ఎంటర్ టైన్ మెంట్స్ ప్రై.లిమిటెడ్ పతాకంపై సెన్సేషనల్ డైరెక్టర్ వి.వి.వినాయక్ దర్శకత్వంలో ప్రముఖ నిర్మాత సి.కళ్యాణ్ నిర్మిస్తున్న భారీ చిత్రం 'ఇంటెలిజెంట్'. ఈ చిత్రాన్ని ఫిబ్రవరి 9న విడుదల చేయడానికి సన్నాహాలు జరుగుతున్నాయి.

కల్యాణ్ రామ్ కి కూడా కలిసొస్తుందా?

'ఇజం' తరువాత చిన్న విరామం తీసుకుని..సోదరుడు ఎన్టీఆర్ హీరోగా జై లవ కుశ చిత్రాన్ని నిర్మించారు కథానాయకుడు కల్యాణ్ రామ్.