Rashmika:సౌందర్య బయోపిక్‌లో నటించాలని ఉంది.. రష్మిక వ్యాఖ్యలు వైరల్..

  • IndiaGlitz, [Monday,January 29 2024]

రష్మిక మందన్న.. నేషనల్ క్రష్‌గా ఫుల్ పాపులారింటీ దక్కించుకున్నారు. 'పుష్ప' సినిమాతో బాలీవుడ్‌లో స్టార్‌ హీరోయిన్‌గా స్థిరపడ్డారు. ఇక ఇటీవల వచ్చిన 'యానిమల్' సినిమాతో ఫుల్ క్రేజ్ సంపాందించుకున్నారు. దీంతో వరుస సినిమాలతో దూసుకుపోతున్నారు. దాదాపు అరడజను సినిమాలు ఈ అమ్మడు చేతిలో ఉన్నారు. తాజాగా ఓ ఇంటర్వ్యూలో బయోపిక్ చిత్రం చేయాల్సి వస్తే ఎవరి పాత్రలో నటిస్తారనే ప్రశ్న రష్మికకు ఎదురైంది. ఇందుకు ఆమె సమాధానమిస్తూ నేను ఇండస్ట్రీకి రాకముందు మా నాన్న నేను కొంచెం సౌందర్య గారిలా ఉన్నాను అనేవారు. ఒకవేళ నేను అలాగే ఉన్నాను అనిపిస్తే సౌందర్య గారి బయోపిక్‌లో నటించాలని ఉంది. ఆమె జర్నీ అంటే నాకు చాలా ఇష్టం అని చెప్పకొచ్చారు. ప్రస్తుతం ఈ వీడియో వైరల్ అవుతోంది.

దీంతో మరోసారి సౌందర్య బయోపిక్ చర్చగా మారింది. గతంలోనే సౌందర్య జీవితాన్ని బయోపిక్‌గా తెరకెక్కిస్తామనే పలు వార్తలు వచ్చాయి. అయితే అవి వార్తలగానే మారాయి కానీ ఇప్పటివరకు కార్యరూపం దాల్చలేదు. ఇప్పుడు ఏకంగా స్టార్‌ హీరోయిన్ అయిన రష్మిక సౌందర్య బయోపిక్‌లో నటించడానికి రెడీగా ఉన్నానని స్టేట్‌మెంట్ ఇచ్చారు. మరి ఎవరు ఆమె బయోపిక్ తెరకెక్కి్స్తారో చూడాలి. ఒకవేళ సౌందర్య బయోపిక్ తీస్తే మాత్రం ఇండియన్ మూవీ ఇండస్ట్రీలో మైలురాయి చిత్రంగా నిలిచిపోతుంది అనడంలో సందేహం లేదు.

మహానటి సావిత్రి తర్వాత హీరోయిన్‌గా అంత పేరు దక్కి్ంచుకున్నారు సౌందర్య. అయితే ఇద్దరు తక్కువ వయసులోనే అర్థాంతరంగా చనిపోయారు. 1992 నుంచి 2003 వరకు దాదాపు 11 సంవత్సరాలు తెలుగు, తమిళ్, కన్నడ పరిశ్రమల్లో స్టార్ హీరోయిన్‌గా ఓ వెలుగు వెలిగారు. తన నటన, వ్యక్తిత్వంతో ఎంతో మంది అభిమానులను పొందారు. ఏ పాత్రైనా అలవోకగా పోషించేవారు. కెరీర్ పీక్ స్టేజ్‌లో ఉండగానే రాజకీయాల్లోకి రావాలనే నిర్ణయం ప్రేక్షకులకు దూరం చేసింది. 2004లో ఓ పార్టీ తరపున ప్రచారం చేసేందుకు హెలికాఫ్టర్‌లో వెళ్తుండగా.. సాంకేతిక సమస్యలు తలెత్తి ఆమె తిరిగిరాని లోకాలకు వెళ్లిపోయారు. దీంతో చిత్ర పరిశ్రమ, అభిమానులకు తీరని లోటు ఏర్పడింది.

సౌందర్య మరణించి 20 సంవత్సరాలు అవుతున్నా తన నటన ద్వారా కళ్ల ముందే కదిలాడుతూనే ఉన్నారు. ఇప్పుడు ఆమె బయోపిక్ వస్తే.. అందులో రష్మిక లాంటి హీరోయిన్ నటిస్తే ఓ మైలురాయి చిత్రంగా నిలుస్తుందనడంలో సందేహం లేదు. సౌందర్య పాత్రలో రష్మిక కరెక్ట్‌గా సెట్ అవుతారని అభిమానులు కూడా కామెంట్స్ చేస్తున్నారు. మరి ఈ చిత్రం వెండితెర పైకి వస్తుందో లేదో తెలియాలంటే వేచి చూడాలి.

More News

Chandrababu: ఎన్నికల వేళ సుప్రీంకోర్టులో చంద్రబాబుకు భారీ ఊరట

టీడీపీ అధినేత చంద్రబాబుకు సుప్రీంకోర్టులో బిగ్ రిలీఫ్ లభించింది. ఇన్నర్ రింగ్ రోడ్డు కేసులో ముందస్తు బెయిల్ రద్దు చేయాలన్న ప్రభుత్వం పిటిషన్‌ను న్యాయస్థానం కొట్టివేసింది.

Venkatesh, Rana: వెంకటేశ్, రానాలకు షాక్.. పోలీస్ కేసుకు కోర్టు ఆదేశం

స్టార్ హీరో విక్టరీ వెంకటేశ్‌(Venkatesh)ఆయన సోదరుడు దగ్గుబాటి సురేశ్‌ బాబుకు నాంపల్లి కోర్టులో గట్టి షాక్ తగిలింది. ఇద్దరితో పాటు రానా(Rana), అభిరామ్‌లపై పోలీసు కేసు నమోదు చేయాలని

Sharmila:షర్మిలతో వివేకా కూతురు సునీత భేటీ.. కాంగ్రెస్‌లో చేరే అవకాశం..!

ఏపీ రాజకీయాల్లో రోజుకొక కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. మొన్నటి వరకు తెలంగాణ రాజకీయాలకే పరిమితమైన షర్మిల..

Venu Father: సీనియర్ నటుడు వేణు ఇంట్లో విషాదం.. ఆయన తండ్రి కన్నుమూత

సీనియర్ నటుడు వేణు తొట్టెంపూడి(Venu Thottempudi) కుటుంబలో విషాదం నెలకొంది. ఆయన తండ్రి ప్రొఫెసర్ తొట్టెంపూడి వెంకటసుబ్బారావు ఇవాళ ఉదయం కన్నుమూశారు.

Galla Jayadev: రాజకీయాలకు టీడీపీ ఎంపీ గల్లా జయదేవ్ గుడ్ బై.. ఎందుకంటే..?

రాజకీయాల నుంచి తప్పుకుంటున్నట్లు గుంటూరు టీడీపీ ఎంపీ గల్లా జయదేవ్ సంచలన ప్రకటన చేశారు. ప్రస్తుత రాజకీయాల్లో ఇమడలేకపోతున్నానని ప్రకటించారు.