సాయం చేయడానికి ఆస్థులు తనఖా పెట్టిన సోనూసూద్‌

  • IndiaGlitz, [Wednesday,December 09 2020]

కోవిడ్‌ ముందు కేవలం నటుడిగానే అందరికీ సుపరిచితుడైన సోనూసూద్‌.. కోవిడ్‌ తర్వాత హీరో అయ్యాడు. కొన్ని వందల మందికి తన పరిధిని మించి సాయం చేశాడు. ఇప్పటికీ ఎంతో మంది సాయం కోసం సోనూసూద్‌ను కలుస్తూనే ఉన్నారు. ఆయన కూడా కాదనకుండా తోచిన సాయం చేస్తూనే ఉన్నాడు. అసలు సోనూసూద్‌కు ఇంత డబ్బు ఎలా వచ్చింది? అని అందరూ అనుకున్నారు. కానీ ఓ షాకింగ్‌ నిజం తెలిసింది.

అదేంటంటే..సాయం చేయడానికి సోనూసూద్‌ ముంబై జూహూలోని ఎనిమిది ఆస్థులను తాకట్టు పెట్టి లోన్‌ తెచ్చాడట. సెప్టెంబర్‌ 15న లోన్‌ పత్రాల్లో సంతకం పెట్టాడని, నవంబర్‌ 24న రిజిస్ట్రేషన్‌ కూడా చేశారని అంటున్నారు. దాదాపు పది కోట్ల రూపాయలు అప్పు తెచ్చి.. ఇప్పుడు ఆ మొత్తానికి సోనూసూద్‌ వడ్డీకడుతున్నాడట. ఈ వార్తలపై సోనూ మాత్రం స్పందించలేదు.

సోనూసూద్ కోవిడ్ ఎఫెక్ట్‌లో వేలాది మంది వ‌ల‌స కార్మికుల‌ను వారి ఊర్ల‌కు చేర్చ‌డంలో కీల‌క పాత్ర పోషించాడు. అంతే కాకుండా ముంబైలో కొన్నివేల మందికి భోజన వసతిని కల్పించాడు. ఉద్యోగాలు అందించడంలో కీలక పాత్రను పోషించాడు. అప్పటి వరకు వెండితెర‌పై విల‌న్‌గా ఉన్న సోనూసూద్ ఈ చ‌ర్య‌ల‌తో నేష‌న‌ల్ హీరో అయ్యాడు. ఈయ‌న ప్రజ‌ల‌కు అందించిన సేవ‌ల‌కుగానూ ఐక్య‌రాజ్య‌స‌మితి అనుబంధ సంస్థ యునైటెడ్ నేష‌న్స్ డెవ‌ల‌ప్‌మెంట్ ప్రోగ్రామ్ సోనూసూద్‌కు ఎస్‌డీజీ స్పెష‌ల్ హ్యుమానిటేరియ‌న్ అవార్డును అందించింది.

More News

పొలిటిక్స్‌లోకి వస్తానంటున్న రాశీఖన్నా

ఉ్తతరాది ముద్దుగుమ్మ రాశీఖన్నా.. వరుస తెలుగు సినిమాలతో తెలుగు ప్రేక్షకుల మనసులకు దగ్గరైంది. హీరోయిన్‌గా రాశీఖన్నా కెరీర్‌ను స్టార్ట్‌ చేసి ఏడు వసంతాలను పూర్తి చేసుకుంది.

ఇంటర్నేషనల్‌ కంపెనీపై నాగ్‌ సెన్సేషనల్‌ ట్వీట్‌

టాలీవుడ్ అగ్ర కథానాయకుడు నాగార్జున, ఇంటర్నేషనల్ స్మార్ట్‌ మొబైల్‌ కంపెనీ యాపిల్‌పై సెన్సేషనల్‌ ట్వీట్‌ చేశాడు. "భారత్‌లో యాపిల్‌ స్టోర్స్‌ నుంచి యాపిల్‌ ప్రొడక్ట్స్ కొనేసమయంలో

డైరెక్టర్‌ శంకర్‌ను ఆకట్టుకున్న మూడు సినిమాలు

కోలీవుడ్ స్టార్‌ డైరెక్టర శంకర్‌.. సినీ అభిమానులకు పరిచయం అక్కర్లేని పేరు. కమల్‌హాసన్‌తో భారతీయుడు 2ను స్టార్ట్‌ చేసిన సంగతి తెలిసిందే. అయితే ఈ సినిమాకు ఏదో ఒక అడ్డంకి ఏర్పడుతూనే ఉంది.

చాలా గ్యాప్ తరవాత తెలుగులో రీ-ఎంట్రీ ఇస్తుండడం చాలా సంతోషంగా ఉంది!! - దర్శకుడు సుబ్బారావు గోసంగి

"అక్కడొకడున్నాడు, రాఘవరెడ్డి" చిత్రాలనంతరం ప్రముఖ నిర్మాణ సంస్థ 'లైట్ హౌస్ సినీ మ్యాజిక్' ప్రొడక్షన్ నంబర్-3తో తెలుగులో రీ-ఎంట్రీ ఇస్తున్నారు

14న హైదరాబాద్‌కు రజినీకాంత్...

తమిళ సూపర్‌స్టార్‌ రజినీకాంత్‌ రాజకీయ ఆరంగేట్రంపై ఇప్పటికే క్లారిటీ ఇచ్చిన విషయం తెలిసిందే.