నటుడు రాజేంద్ర ప్రసాద్‌ని కలిసిన సోము వీర్రాజు..

  • IndiaGlitz, [Tuesday,December 08 2020]

ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు సోము వీర్రాజు సోమవారం సినీ నటుడు డాక్టర్ రాజేంద్రప్రసాద్‌ను కలిశారు. సోమవారం ఆయన నివాసంలో మర్యాదపూర్వకంగా భేటీ అయ్యారు. ఈ సందర్భంగా నట కిరీటి రాజేంద్ర ప్రసాద్‌ సోము వీర్రాజును శాలువాతో సత్కరించారు. సినీ నటి హేమ కూడా ఈ భేటీలో పాల్గొన్నారు. సోము వీర్రాజు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగా ఎన్నికైన తరువాత ఇప్పటికే మెగాస్టార్ చిరంజీవి, అనంతరం జనసేన అధినేత పవన్ కల్యాణ్‌లను మర్యాదపూర్వకంగా కలుసుకున్న విషయం తెలిసిందే.

ఈ మధ్య బీజేపీ నేతలు తమ పార్టీలో సినీ గ్లామర్‌ను పెంచుకునే దిశగా అడుగులు వేస్తున్నారు. ఇప్పటికే దక్షిణాదిలో ప్రముఖ నటి కుష్బూను తమ పార్టీలో చేర్చుకున్నారు. ఇక తెలంగాణలో సైతం విజయశాంతి సోమవారం ఆ పార్టీ తీర్థం పుచ్చుకున్నారు. ఇక ఏపీ విషయానికి వస్తే జనసేనాని పవన్ సైతం ఆ పార్టీకి బహిరంగ మద్దతును ప్రకటించారు. ఈ క్రమంలోనే మెగాస్టార్‌ను కూడా తమ పార్టీలో చేర్చుకోవాలని బీజేపీ నేతలు భావిస్తున్నట్టు తెలుస్తోంది.

ప్రస్తుతానికి తెలంగాణలో బీజేపీ బలపడుతోంది. ఈ క్రమంలోనే సెలబ్రిటీలు కూడా ఆ దిశగా అడుగులు వేస్తున్నట్టు తెలుస్తోంది. నటి హేమ గతంలో వైసీపీలో చేరాలని భావించారు. కానీ ఆ తర్వాత సైలెంట్ అయిపోయారు. జీహెచ్ఎంసీ ఎన్నికల ఫలితాల అనంతరం తెలంగాణలో సీన్ మారిపోయింది. ఈ క్రమంలోనే హేమ బీజేపీ వైపు అడుగులు వేస్తున్నట్టు టాక్ నడుస్తోంది. బీజేపీ కూడా సెలబ్రిటీలు తమ పార్టీలో ఉంటే తద్వారా వారి అభిమానులకు గాలం వేయవచ్చని ఆ పార్టీనేతలు భావిస్తున్నట్టు తెలుస్తోంది. ఇక మున్ముందు పరిస్థితులు ఎలా ఉంటాయో వేచి చూడాలి.

More News

ఏలూరు ఘటన: రిపోర్టులన్నీ నార్మలే.. కానీ ఏం జరుగుతోంది?

ఏలూరులో అంతుచిక్కని వ్యాధి సోకి దాదాపు 300 మందికి పైగా అస్వస్థతకు గురయ్యారు. ఒకరు మృతి చెందారు.

కొత్త సినిమాను షురూ చేసిన నితిన్‌

ఈ ఏడాది ఫిబ్రవరిలో వచ్చిన భీష్మతో సూపర్‌ హిట్‌ కొట్టిన నితిన్ అంతకు ముందు దాదాపు ఏడాదికి పైగానే గ్యాప్‌ తీసుకున్న సంగతి తెలిసిందే.

ప్లాన్‌ మార్చుకున్న 'సర్కారు వారిపాట'

సూపర్‌స్టార్‌ మహేశ్‌, పరుశురామ్‌ కాంబినేషన్‌లో రూపొందతున్న చిత్రం 'సర్కారు వారి పాట'.

రష్మికను రీప్లేస్‌ చేయనున్న రాశీఖన్నా..

ప్రస్తుతం దక్షిణాదిన తెలుగు, తమిళ, కన్నడ చిత్రాలతో బిజీగా ఉన్న హీరోయిన్ రష్మిక మందన్న..

అన్నయ్య ఆశీర్వాదం తీసుకున్న సూపర్‌స్టార్‌

సూపర్‌స్టార్‌ రజినీకాంత్ తమిళనాడు రాజకీయాల్లోకి రావడం పక్కా అయ్యింది.