'సొగ్గాడే చిన్ని నాయనా' థియేటర్ ట్రైలర్ రివ్యూ

  • IndiaGlitz, [Saturday,December 12 2015]

టాలీవుడ్ కింగ్ నాగార్జున న‌టిస్తున్న తాజా చిత్రం సొగ్గాడే చిన్ని నాయ‌నా. ఈ చిత్రంలో నాగ్ స‌ర‌స‌న ర‌మ్య‌క్రిష్ణ‌, లావ‌ణ్య త్రిపాఠి న‌టిస్తున్నారు. నూత‌న ద‌ర్శ‌కుడు క‌ళ్యాణ్ క్రిష్ణ ఈ చిత్రాన్ని తెర‌కెక్కిస్తున్నారు. అన్న‌పూర్ణ స్టూడియోస్ బ్యాన‌ర్ పై నాగార్జున ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. చాలా రోజులు త‌ర్వాత నాగార్జున ఈ చిత్రంలో ద్విపాత్రాభిన‌యం చేయ‌డం విశేషం. సంక్రాంతి కానుక‌గా ఈ చిత్రాన్ని రిలీజ్ చేయ‌డానికి నాగ్ ప్లాన్ చేస్తున్నారు. ఈ సంద‌ర్భంగా నాగ్... సొగ్గాడే చిన్ని నాయ‌నా థియేట‌రిక‌ల్ ట్రైల‌ర్ ను ట్విట్ట‌ర్ ద్వారా రిలీజ్ చేసారు.

సొగ్గాడే చిన్ని నాయ‌నే...అనే పాత పాట‌తో ఈ ట్రైల‌ర్ స్టార్ట్ అవుతుంది. ర‌మ్య‌క్రిష్ణ నాగ్ తో...నీలా అవ్వ‌కూడ‌ద‌నే జాగ్ర‌త్త‌గా పెంచానంటుంది. మ‌రో వైపు లావ‌ణ్య త్రిపాఠితో పిట్ట పిట‌పిట‌లాడిపోతుంది అంటే..దాని అర్ధం కోసం గూగుల్ లో వెతుకుతుంటాడు మ‌రో నాగ్. అది చూసిన నాగ్ నా కొడుకుగా ఎలా పుట్టావ్ రా అంటాడు. ఇంత‌లో...శివుడు గుడి...స‌ర్ ఫ్ర‌జ్ చేస్తూ... స్నేక్...ఫైన‌ల్ గా నా ఫ్యామిలీ జోళికి వ‌స్తే...వాసివాడి త‌స్సాదీయ్యా అంటూ ఫైట్ చేస్తున్నాడు నాగ్. ఇదంతా చూస్తుంటే...ఈ సంక్రాంతికి సొగ్గాడుగా నాగ్ అద‌ర‌గొట్ట‌డం...బాక్సాఫీస్ ను షేక్ చేయ‌డం ఖాయం అనిపిస్తుంది. ఆల్ ద బెస్ట్ టు నాగ్ టీమ్.

More News

సుశాంత్‌, జి.నాగేశ్వరరెడ్డిల 'ఆటాడుకుందాం..రా' టాకీ పూర్తి

కాళిదాసు, కరెంట్‌, అడ్డా వంటి సూపర్‌హిట్‌ చిత్రాల హీరో సుశాంత్‌ కథానాయకుడిగా అన్నపూర్ణ స్టూడియోస్‌ సమర్పణలో శ్రీనాగ్‌ కార్పోరేషన్‌, శ్రీ జి ఫిలింస్‌ పతాకాలపై జి.నాగేశ్వరరెడ్డి దర్శకత్వంలో చింతలపూడి శ్రీనివాసరావు, ఎ.నాగసుశీల నిర్మిస్తున్న యాక్షన్‌ ఎంటర్‌టైనర్‌ 'ఆటాడుకుందాం.. రా'(జస్ట్‌ చిల్‌).

ఈ విజయానికి కారకులైన ప్రక్షకులకు ధన్యవాదాలు 'అనగనగా ఒక చిత్రవ్‌ు' టీం

పద్మాలయ శాఖమూరి మల్లిఖార్జునరావు తనయుడు శివ హీరోగా మేఘశ్రీ హీరోయిన్‌గా జె ప్రొడక్షన్స్ పతాకంపై గోవర్షిణి ఫిలింస్ సమర్పణలో సూపర్‌హిట్ అయిన

అది క‌న్ ఫ‌ర్మ్ కాలేదంటున్న అఖిల్..

అక్కినేని అఖిల్...న‌టించిన తొలి చిత్రం అఖిల్ అంచ‌నాల‌ను అందుకోవ‌డంలో ఫెయిల్ అయిన విష‌యం తెలిసిందే.

వీరు పోట్ల నెక్ట్స్ ప్రాజెక్ట్ ఫిక్స్..

ర‌చ‌యిత‌గా కెరీర్ స్టార్ట్ చేసి..డైరెక్ట‌ర్ అయిన వాళ్ల‌లో వీరు పోట్ల‌ ఒక‌రు. బిందాస్ సినిమాతో డైరెక్ట‌ర్ అయిన వీరు పోట్ల‌...ఆత‌ర్వాత నాగార్జున‌తో ర‌గ‌డ, మంచు విష్ణుతో దూసుకెళ్తా చిత్రాన్ని తెర‌కెక్కించాడు.

రానాని చూసి స్పూర్తి పొందానంటున్న బాలీవుడ్ హీరో..

రానాని చూసి స్పూర్తి పొందానంటున్న బాలీవుడ్ హీరో..ఎవరో కాదు హ్రుతిక్ రోషన్. అవును ఇది నిజంగా నిజం. ఇంతకీ విషయం ఏమిటంటే.. వరద భీభత్సవం వలన ఇబ్బంది పడుతున్న చెన్నై ప్రజానికాన్ని ఆదుకునేందుకు రానా ముందుకు వచ్చిన విషయం తెలిసిందే.