సామాజిక న్యాయం మాతోనే సాధ్యం : బీజేపీ - జనసేన

ఆంధ్ర ప్రదేశ్ కు బీజేపీ అవసరం చాలా ఉందన్నారు జనసేన అధినేత పవన్ కళ్యాణ్. విజయవాడ లో బీజేపీ జనసేన సమావేశం అనంతరం మీడియాతో మాట్లాడిన ఆయన... మనస్ఫూర్తిగా బీజేపీ తో పొత్తు తో ముందుకు సాగుతామని అన్నారు. అవినీతి రహిత పాలన అందిస్తామని స్పష్టం చేశారు పవన్. రాష్ట్ర ప్రజలు తృతీయ ప్రత్యామ్నాయం కోరుకుంటున్నారు అన్న పవన్... బీజేపీ జనసేన కలిసి ఆ లోటును భర్తీ చేస్తాం అన్నారు. రాష్ట్రంలో వారసత్వ పాలనకు అంతం పలుకుతాం అన్నారు. ప్రస్తుతం ఏపీలో పాలెగాళ్ల ప్రభుత్వం నడుస్తోందన్న పవన్.. 2024లో బీజేపి జనసేన కలిసి ప్రభుత్వం ఏర్పాటు చేయబోతుంది అని ధీమా వ్యక్తంచేశారు.

ఈ సందర్భంగా మాట్లాడిన బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు కన్నా ల క్ష్మీనారాయణ.... మోడీ నాయకత్వంలో పనిచేసేందుకు పవన్ కళ్యాణ్ అంగీకరించడం సంతోషంగా ఉందన్నారు. బీజేపీతో కలిసి పని చేసేందుకు ముందుకు రావడం రాష్ట్ర ప్రజలకు శుభ పరిణామం అన్నారు కన్నా. సీఎం జగన్ మోహన్ రెడ్డి నియంతృత్వ పోకడలతో రాష్ట్రాన్ని పాలిస్తున్నారు అని... చెక్ పెడతామని హెచ్చరించారు. సామాజిక న్యాయం బీజేపీ జనసేన తోనే సాధ్యమని... వచ్చే ఎన్నికల్లో ఏపీలో అధికారంలోకి వస్తామని ఆశాభావం వ్యక్తం చేశారు.

More News

అప్పుడు మద్దతిచ్చి .. ఇప్పుడు తరలిస్తామంటే చూస్తూ ఊరుకొం : పవన్

సీఎం జగన్ మోహన్ రెడ్డి పై విరుచుకు పడ్డారు జనసేనా అధినేత పవన్ కళ్యాణ్. అమరావతిని తరలించేందుకు వైసీపీ సర్కార్ ప్రయత్నిస్తోందని.... కానీ అది సాధ్యం కాదని స్పష్టం చేశారు.

నాన్ బాహుబలి 2 రికార్డ్స్ క్రియేట్ చేసిన అల్లు అర్జున్ అల వైకుంఠపురంలో !!!

అల్లు అర్జున్ – త్రివిక్రమ్ కలయికలో వచ్చిన హ్యాట్రిక్ మూవీ అల వైకుంఠపురం లో సంక్రాంతి కానుకగా విడుదలై సూపర్ హిట్ టాక్ ను సొంతం చేసుకుంది. అల్లు అర్జున్ యాక్టింగ్, డాన్స్,

ర‌ష్మిక ఇంటిపై ఐటీ సోదాలు

ప్ర‌స్తుతం అగ్ర క‌థానాయిక‌గా టాలీవుడ్‌లో రాణిస్తున్న క‌న్న‌డ క‌థానాయ‌కి ర‌ష్మిక మంద‌న్న‌. ఈ సంక్రాంతికి స‌రిలేరు నీకెవ్వ‌రుతో మ‌రో సూప‌ర్‌హిట్ చిత్రాన్నిన త‌న ఖాతాలో వేసుకుంది.

‘యజమాని ఆజ్ఞాపిస్తేనే బీజేపీ చుట్టూ ప్యాకేజీ స్టార్’

టీడీపీ అధినేత చంద్రబాబు, జనసేన అధినేత పవన్ కల్యాణ్‌పై వైసీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, ఎంపీ విజయసాయిరెడ్డి మరోసారి పరోక్షంగా తీవ్ర వ్యాఖ్యలు చేశారు.

జనసేన కీలక ప్రకటన.. ఎల్లుండి ఏం జరగబోతోంది!?

తూర్పుగోదావరి జిల్లా కాకినాడలో వైసీపీ కార్యకర్తలు, నేతల దాడిలో గాయపడిన కార్యకర్తలను జనసేన అధినేత పవన్ కల్యాణ్ పరామర్శించారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడిన ఆయన..