భారీ రేంజ్ లో 'సైజ్ జీరో' ప్రమోషన్స్

  • IndiaGlitz, [Friday,November 13 2015]

సూపర్ హిట్ చిత్రాలను నిర్మించిన ప్రముఖ నిర్మాణ సంస్థ రూపొందించిన చిత్రం సైజ్ జీరో'. అనుష్క, ఆర్య, సోనాల్ చౌహాన్ ప్రధానతారాగణం. బాహుబలి', రుద్రమదేవి' చిత్రాల తర్వాత టాలీవుడ్ స్టార్ హీరోయిన్ అనుష్క నటించిన చిత్రం సైజ్ జీరో' కావడంతో సినిమాపై భారీ అంచనాలు ఏర్పడ్డాయి. ఈ చిత్రం కోసం అనుష్క 20 కిలోలు బరువు పెరిగింది. ఇలాంటి అనుష్క కమిట్ మెంట్ ఈ ఫీల్ గుడ్ కామెడి ఎంటర్ టైనర్ కు మరింత ప్లస్ అయింది. సినిమా విడుదల కోసం ప్రేక్షకులు, ట్రేడ్ వర్గాలు ఎదురుచూస్తున్నాయి.

సినిమా నవంబర్ 27న ప్రపంచ వ్యాప్తంగా గ్రాండ్ లెవల్ లో విడుదలవుతుంది. సినిమా విడుదలే కాకుండా సినిమా ప్రమోషన్స్ కూడా విన్నూతంగా, భారీగా ఉండేలా పివిపి సంస్థ ప్లాన్ చేసింది. సౌత్ సెంట్రల్ నుండి తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, తమిళనాడు సహా పలు నగరాలకు వెళ్ళే రైళ్ళ వెలుపల, బయట సైజ్ జీరో సినిమా సంబంధిత పోస్టర్స్, డిజైన్స్ ఉండేలా విన్నూత రీతిలో ప్లాన్ చేశారు. దీంతో ట్రెయిన్స్ లో ప్రయాణించే ప్రయాణీకులే కాదు, చూసే వారికి కూడా సైజ్ జీరో' గురించి అటెన్షన్ ఏర్పడేలా ప్లాన్ చేశారు.

ప్రముఖ సంగీత దర్శకుడు కీరవాణి సంగీతం అందించిన ఈ సినిమా ఆడియో నవంబర్ 1న విడుదలై సూపర్ సక్సెస్ అయింది. సినిమా ప్రారంభం నుండి ఫస్ట్ లుక్, టీజర్, ట్రైలర్స్ తో సినిమాపై ఏర్పడిన అంచనాలు మరింత పెరిగాయి. తెలుగు, తమిళంలో థియేట్రికల్ ట్రైలర్ ఇప్పటికే రెండు మిలియన్స్ వ్యూస్ ను పొందిందంటే సినిమా విడుదల కోసం ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారనే విషయం అవగతమవుతుంది.

ఒక మంచి ప్రొడక్ట్ కు మంచి ప్రమోషన్స్ అవసరమనే విషయం తెలిసిందే. ఈ విషయం బాగా తెలిసిన పివిపి సంస్థ ఓ క్రియేటివ్ ఏజెన్సీతో కలిసి ఈ ట్రెయిన్ పబ్లిసిటీని ప్లాన్ చేశారు. ఇలాంటి విన్నూత ఆలోచనతోనే బ్లాక్ బస్టర్ మూవీ బలుపు సినిమా ప్రమోషన్స్ చేశారు. అలాంటి ఐడియాతోనే విన్నూతంగా సైజ్ జీరో పబ్లిసిటీ చేస్తున్నారు. తెలుగు, తమిళ భాషల్లో నవంబర్ 27న ఈ సినిమాను గ్రాండ్ లెవల్ లో విడుదల చేస్తున్నారు.

More News

'సుప్రీమ్ ' ఫస్ట్ షెడ్యూల్ పూర్తి

‘పిల్లా నువ్వులేని జీవితం’,‘సుబ్రమణ్యం ఫర్ సేల్’చిత్రాల తర్వాత సుప్రీంహీరో సాయిధరమ్ తేజ్ హీరోగా శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ పై ప్రారంభమైన ‘సుప్రీమ్’ చిత్రం ప్రస్తుతం చిత్రీకరణ దశలోనే ఉంది.

నిఖిల్ ' శంకరాభరణం ' సెన్సార్ పూర్తి డిసెంబర్ 4న విడుదల

స్వామి రారా, కార్తికేయ,సూర్య వర్సెస్ సూర్య. ఇలా వరుసగా వైవిధ్యభరితమైన చిత్రాలు చేస్తూ,ముందుకు దూసుకెళుతున్న నిఖిల్ నటించిన తాజా చిత్రం ''శంకరాభరణం''.

కొట్టుకునేంత స్టుపిడ్ ఫ్యామిలీ కాదు మాది - అఖిల్ సక్సెస్ మీట్ లో నాగ్

అక్కినేని వంశం నుంచి తెలుగు తెరకు పరిచయమైన మూడోతరం యువ కధానాయకుడు అఖిల్.సెన్సేషనల్ డైరెక్టర్ వినాయక్ దర్శకత్వంలో అఖిల్,సయేషా జంటగా నటించారు.

'ప‌టాస్' రీమేక్ అప్‌డేట్‌

తెలుగులో ఘ‌న‌విజ‌యం సాధించిన క‌ళ్యాణ్ రామ్ 'ప‌టాస్' మూవీ.. త‌మిళంలో రీమేక్‌గా రూపొంద‌నున్న సంగ‌తి తెలిసిందే. లారెన్స్ రాఘ‌వ క‌థానాయ‌కుడుగా న‌టిస్తున్న ఈ చిత్రంలో నిక్కీ గ‌ల్‌రాణి హీరోయిన్‌గా న‌టిస్తోంది.

డ‌బుల్ ధ‌మాకా ఇవ్వ‌నున్న న‌య‌న‌తార‌

వ‌రుస‌గా మూడు నెల‌ల్లో మూడు సూప‌ర్ హిట్ సినిమాల‌ను త‌న ఖాతాలో వేసుకుంది కేర‌ళ‌కుట్టి న‌య‌న‌తార‌.