సిసింద్రీకి ఇరవై ఏళ్లు...

  • IndiaGlitz, [Monday,September 14 2015]

నాగార్జున వార‌సుడు అఖిల్ సిసింద్రీ గా సెన్సేష‌న్ క్రియేట్ చేసిన విష‌యం తెలిసిందే.అయితే... అఖిల్ సిసింద్రీగా సంవ‌త్స‌రం వ‌య‌సు కూడా లేకండానే తెర‌పై క‌నిపించి సెన్సేష‌న్ క్రియేట్ చేయ‌డం విశేషం. గ్రేట్ ఇండియా ఎంట‌ర్ టైన్మెంట్ బ్యాన‌ర్ పై నాగార్జున సిసింద్రీ చిత్రాన్ని నిర్మించారు. శివ నాగేశ్వ‌ర‌రావు ఈ చిత్రాన్ని తెర‌కెక్కించారు. ఈ చిత్రంలో సిసింద్రీ అఖిల్ తో పాటు కింగ్ నాగార్జున కూడా న‌టించారు. సిసింద్రీగా అటు అభిమానుల‌ను, ఇటు ఇండ‌స్ట్రీని ఎంత‌గానో ఆక‌ట్టుకున్నాడు అఖిల్.

సిసింద్రీ రిలీజ్ అయిన నేటికి అన‌గా సెప్టెంబ‌ర్ 14కి స‌రిగ్గా 20 ఏళ్లు. అఖిల్...సిసింద్రీగా అల‌రించిన 20 ఏళ్లుకు హీరోగా అరంగేట్రం చేస్తుండ‌డం విశేషం. నాడు సిసింద్రీ అఖిల్ పై ముహుర్త‌పు స‌న్నివేశానికి తాత అక్కినేని క్లాప్ ఇవ్వ‌గా...నేడు అఖిల్ చిత్రానికి అమ్మ అమ‌ల క్లాప్ ఇవ్వ‌డం విశేషం. తాత జ‌యంతి రోజున అఖిల్ తొలి చిత్రం అఖిల్ ఆడియో ఆవిష్క‌ర‌ణోత్స‌వం జ‌ర‌గనుంది. అక్టోబ‌ర్ 22న తొలిసారి హీరోగా ప్రేక్ష‌కుల ముందుకు రానున్నాడు అఖిల్.

More News

శ్రీమంతుడుని అభినందించిన చంద్ర‌బాబు

మ‌హేష్ న‌టించిన శ్రీమంతుడు చిత్రం ఎంత‌టి సంచ‌ల‌నం స్రుష్టించిందో తెలిసిందే. ఈ చిత్రాన్ని చూసిన ప‌లువురు సినీ, రాజ‌కీయ నాయ‌కులు మ‌హేష్ అభినందించారు.

నితిన్ తో మూవీ ప్లాన్ చేస్తున్న గౌత‌మ్ మీన‌న్..?

నితిన్ తో గౌత‌మ్ మీన‌న్ నిర్మించిన కొరియర్ బాయ్ క‌ళ్యాణ్ ఈ నెల 17న రిలీజ్ కానుంది. ప్రేమ సాయి ఈ చిత్రానికి ద‌ర్శ‌కుడు.

తేజ కామెంట్స్ పై మ‌హేష్ స్పంద‌న‌..?

మ‌హేష్ శ్రీమంతుడు సినిమాలో పోషించిన పాత్ర‌ను రీల్ లైఫ్ లోనే కాదు...రియ‌ల్ లైఫ్ లో కూడా పోషించారు.

'హోరా హోరీ' 15నిమిషాలు తగ్గింపు

డి.సురేష్ బాబు సమర్పణలో రంజిత్ మూవీస్ బ్యానర్ పై రూపొందిన చిత్రం ‘హోరా హోరీ’. దిలీప్, దక్ష హీరో హీరోయిన్లుగా ఈ చిత్రం రూపొందింది.

టాకీపార్ట్ పూర్తి చేసుకున్న 'గరమ్'

సాయికుమార్ తనయుడు ఆది, ‘హార్ట్ ఎటాక్’ ఫేమ్ ఆదాశర్మ హీరో హీరోయిన్లుగా ‘గరమ్’ చిత్రం రూపొందుతోన్న సంగతి విదితమే. ప్రస్తుతం సినిమా టాకీపార్ట్ ను పూర్తి చేసుకుంది.