వైభవంగా సిరివెన్నెల కుమారుడి వివాహం..

  • IndiaGlitz, [Sunday,November 01 2020]

సుప్రసిద్ధ గీత రచయిత సిరివెన్నెల సీతారామశాస్త్రి కనిష్ట పుత్రుడు, నటుడు రాజా చెంబోలు ( రాజా భవాని శంకర శర్మ) వివాహం వైభవంగా జరిగింది. హైదరాబాద్‌లోని హోటల్ దస్‌పల్లాలో ఆదివారం ఉదయం 10:55 గంటలకు వెంకటలక్ష్మి హిమబిందుతో జరిగింది. ఈ వివాహ వేడుకకు ప్రముఖ దర్శకులు త్రివిక్రమ్, కృష్ణవంశీ, క్రిష్, గుణ్ణం గంగరాజు, వంశీ పైడపల్లి, ప్రముఖ నిర్మాతలు అల్లు అరవింద్, వెంకట్ అక్కినేని, రచయిత బుర్ర సాయిమాధవ్ తదితరులు విచ్చేసి నూతన వధూవరులను ఆశీర్వదించారు.

కాగా.. తండ్రిలా రచయితగా కాకుండా రాజా నటనపై తన దృష్టి పెట్టాడు. అంతరిక్షం, హ్యాపీ వెడ్డింగ్, ఎవడు, నా పేరు సూర్య నా ఇల్లు ఇండియా, మిస్టర్ మజ్ను, ఫిదా, రణరంగం, ఏబీసీడీ, భానుమతి రామకృష్ణ వంటి చిత్రాల్లో నటించి మంచి నటుడిగా గుర్తింపు తెచ్చుకున్నాడు. ఫిదా సినిమా రాజాకు కెరీర్ పరంగా మంచి టర్నింగ్ పాయింట్ అనే చెప్పాలి. భానుమతి రామకృష్ణ కూడా రాజాకు మంచి పేరు తెచ్చిపెట్టింది. ప్రస్తుతం రాజా వెబ్ సిరీస్‌లలో నటిస్తున్నాడు.

More News

ఏపీలో మరో కొత్త పార్టీ..

ఏపీలో మరో కొత్త పార్టీ ఏర్పాటుకు సన్నాహాలు జరుగుతున్నాయి. తెలుగు రాష్ట్ర రాజకీయాల్లో కులం అనేది ప్రధాన పాత్ర పోషిస్తుందనడంలో ఎలాంటి సందేహమూ లేదు.

తెలుగు రాష్ట్రాల్లో తొలి అడుగు.. అక్కడ థియేటర్లు ఓపెన్..

కరోనా మహమ్మారి కారణంగా మార్చిలో సినిమా థియేటర్లు మూతపడిన విషయం తెలిసిందే.

రజినీ సర్.. మీ ఆరోగ్యం, ఆనందం కంటే ఏదీ ముఖ్యం కాదు: కుష్బూ

ప్రముఖ కథానాయకుడు రజినీకాంత్ ఆరోగ్యంపై ప్రముఖ నటి, బీజేపీ నాయకురాలు కుష్బూ స్పందించారు.

కిర్రాక్ ఫ్యాన్.. శ్రీకృష్ణుడిగా మహేష్ లుక్ అదుర్స్..

సూపర్ స్టార్ మహేష్ బాబుకు ఫ్యాన్ ఫాలోయింగ్‌ చాలా పెద్దది.

అమ్మ రాజశేఖర్, అవినాష్‌లను వాయించేసిన నోయెల్..

కులు మనాలి నుంచి హోస్ట్ నాగార్జున హెలికాఫ్టర్‌లో బయల్దేరుతున్న సీన్‌‌ను చూపించారు. మెగా పవర్ స్టార్ ‘రంగస్థలం’ సాంగ్‌తో షోను స్టార్ చేశారు.