నిఖిల్‌తో మ‌రో కొత్త హీరోయిన్‌

  • IndiaGlitz, [Sunday,October 22 2017]

స్వామిరారా, కార్తికేయ‌, సూర్య వ‌ర్సెస్ సూర్య‌, ఎక్క‌డికి పోతావు చిన్న‌వాడా వంటి డిఫ‌రెంట్ స‌బ్జెక్ట్స్‌తో స‌క్సెస్ సాధిస్తున్న యువ క‌థానాయ‌కుడు నిఖిల్ హీరోగా ఓ కొత్త చిత్రం శ‌ర‌వేగంగా చిత్రీక‌ర‌ణ‌ను జ‌రుపుకుంటోన్న సంగ‌తి తెలిసిందే. ప్ర‌ముఖ నిర్మాణ సంస్థ ఎ.కె.ఎంట‌ర్‌టైన్మెంట్ బ్యాన‌ర్‌పై నూత‌న ద‌ర్శ‌కుడు శర‌ణ్ కోపిశెట్టి డైరెక్ష‌న్‌లో రామ‌బ్ర‌హ్మం సుంక‌ర ఈ సినిమాను నిర్మిస్తున్నారు. పాత్ర‌లో కొత్త‌ద‌నం కోసం తాప‌త్ర‌య‌ప‌డే హీరో నిఖిల్ ఈ సినిమాలో పాత్ర కోసం బ‌రువు పెరిగి మ‌జిల్స్‌తో ఆకట్టుకుంటున్నాడు.

ఈ సినిమాలో ఇద్ద‌రు హీరోయిన్స్‌లో నిఖిల్‌తో జ‌త క‌డుతున్నారు. అందులో సంయుక్త హెగ్డే ఓ హీరోయిన్‌గా అల్రెడి ఎంపికైంది. తాజాగా నిఖిల్ స‌ర‌స‌న మ‌రో కొత్త హీరోయిన్ న‌టించ‌నుంది. ఆమె పేరే సిమ్రాన్ ప‌రింజ‌. హిందీలో సీరియ‌ల్స్‌లో బాల‌న‌టిగా మెప్పించి ప‌లు అవార్డులు ద‌క్కించుకున్న సిమ్రాన్ ఇప్పుడు నిఖిల్‌తో హీరోయిన్‌గా టాలీవుడ్ ద్వారా ప‌రిచ‌యం అవుతుంది. రీసెంట్‌గా ఉత్త‌రాఖండ్‌లోని అంద‌మైన లోకేష‌న్స్‌లో ఓ సాంగ్ స‌హా కీల‌క స‌న్నివేశాల‌ను చిత్రీక‌రించారు. ప్ర‌ముఖ యువ‌ ద‌ర్శ‌కుడు చందు మొండేటి ఈ చిత్రానికి డైలాగ్స్, మ‌రో ప్ర‌ముఖ యువ ద‌ర్శ‌కుడు సుధీర్ వ‌ర్మ ఈ చిత్రానికి స్క్రీన్‌ప్లే అందిస్తున్నారు.

More News

'లాలిజో..లాలిజో' ట్రైలర్‌ ఆవిష్కరణ

సంభీత్‌, నేహారత్నాకరన్ హీరో హీరోయిన్లుగా జై శ్రీ సంతోషిమాత ప్రొడక్షన్‌ పతాకంపై మోహన్‌ శ్రీ వత్సస దర్శకత్వంలో షంఖు, కిరణ్‌లు నిర్మిస్తోన్న 'లాలిజో లాలిజో' చిత్ర ట్రైలర్‌ ఆవిష్కరణ హైదరాబాద్‌లో జరిగింది.

మెహ‌రీన్‌దే హ‌వా

2016 ఫిబ్రవరిలో వచ్చిన కృష్ణగాడి వీరప్రేమగాథ చిత్రంతో టాలీవుడ్కి పరిచయమైంది ఉత్తరాది భామ మెహరీన్. నాని హీరోగా నటించిన ఆ సినిమా సక్సెస్ కావడంతో.. ఈ ముద్దుగుమ్మకి ఆఫర్లు క్యూ కట్టాయి.

సంఘ‌మిత్ర గా లోఫ‌ర్ భామ ఫిక్స‌య్యింది

రూ.150 కోట్లకి పైగా బ‌డ్జెట్‌తో ఓ చారిత్రాత్మ‌క చిత్రాన్ని రూపొందించ‌డానికి ప్ర‌ముఖ త‌మిళ ద‌ర్శ‌కుడు, కుష్బూ భ‌ర్త సుంద‌ర్.సి స‌న్నాహాలు చేసుకుంటున్న సంగ‌తి తెలిసిందే.

కె.వి.రెడ్డిగా క్రిష్ ?

మహానటి సావిత్రి జీవితం ఆధారంగా మహానటి సినిమా రూపొందుతున్న సంగతి తెలిసిందే. టైటిల్ రోల్ లో కేరళకుట్టి కీర్తి సురేష్ నటిస్తోంది. ఇటీవలే ఆకాశ వీధిలో అందాల జాబిలి పేరుతో కీర్తి పుట్టిన రోజున ఫస్ట్లుక్ పోస్టర్ని విడుదల చేసింది చిత్ర బృందం

వెంకటేష్ తో యువ కథానాయకుడు..

ఈ ఏడాది ఆరంభంలో గురు చిత్రంతో సందడి చేశారు సీనియర్ కథానాయకుడు వెంకటేష్. తదుపరి చిత్రానికి బాగానే గ్యాప్ తీసుకున్న ఆయన ఎట్టకేలకు ఓ మూవీకి ఓకే చెప్పారు.