అత్త పాత్ర‌లో సిమ్రాన్‌..?

  • IndiaGlitz, [Sunday,August 23 2020]

చిరంజీవి, బాల‌య్య‌, వెంక‌టేశ్‌, నాగార్జున, మహేశ్‌, ప్ర‌భాస్‌(ఓ సాంగ్‌లో) వంటి అగ్ర క‌థానాయ‌కుల‌తో న‌టించిన హీరోయిన్ సిమ్రాన్ సెకండ్ ఇన్నింగ్స్‌ను త‌మిళంలో మొద‌లు పెట్టింది. కానీ.. ఆమెకు త‌గ్గ పాత్ర‌లు తెలుగులో మాత్రం రాలేదు. అయితే త్వ‌ర‌లోనే సిమ్రాన్ తెలుగు తెర‌పై త‌న సెకండ్ ఇన్నింగ్స్‌లో క‌నిపించ‌బోతున్నార‌నే వార్త‌లు సినీ ఇండ‌స్ట్రీలో వినిపిస్తున్నాయి. వివ‌రాల్లోకెళ్తే.. పూరీ జ‌గ‌న్నాథ్ త‌న‌యుడు ఆకాశ్ పూరి హీరోగా అనిల్ పాడూరి ద‌ర్శ‌క‌త్వంలో రూపొందుతోన్న చిత్రం ‘రొమాంటిక్’. ఇందులో ఢిల్లీకి చెందిన కేతికా శ‌ర్మ హీరోయిన్‌గా న‌టిస్తోంది. ఈ ‘రొమాంటిక్’ చిత్రంలో కేతికా శ‌ర్మ త‌ల్లి పాత్ర‌లో సిమ్రాన్ క‌నిపించనున్నార‌ట‌. హీరో త‌ల్లి పాత్ర‌లో ర‌మ్య‌కృష్ణ న‌టించ‌బోతున్నార‌ని టాక్‌.

ఆకాశ్‌పూరి హీరోగా రూపొందుతోన్న ‘రొమాంటిక్’ చిత్రానికి పూరీ జ‌గ‌న్నాథ్, చార్మి నిర్మాత‌లుగా వ్య‌వ‌హరిస్తున్నారు. క‌రోనా లేకుండా ఉండుంటే ఈ వేసవిలో విడుద‌ల కావాల్సిన ఈ చిత్రం తుది ద‌శ షెడ్యూల్‌లో ఆగింది. ప‌రిస్థితులు చ‌క్క‌బ‌డ‌గానే పెండింగ్ ఉన్న షూటింగ్‌ను పూర్తి చేస్తార‌ట‌. అప్పుడే సినిమా విడుద‌ల‌పై ఓ అవ‌గాహ‌న కుదురుతుంద‌ని వార్త‌లు వినిపిస్తున్నాయి. మెహ‌బూబాతో హీరోగా ప్ర‌య‌త్నం చేసిన ఆకాశ్ పూరీకి పెద్ద‌గా క‌లిసి రాలేద‌నే చెప్పాలి. మ‌రిప్పుడు రొమాంటిక్ ఎలాంటి స‌క్సెస్‌నిస్తుందో చూడాలి.

More News

సినీ, టీవీ షూటింగ్‌లకు కేంద్రం గ్రీన్ సిగ్నల్..

అన్‌లాక్ 3.0లో భాగంగా దేశ వ్యాప్తంగా సినిమా, టీవీ కార్యక్రమాల షూటింగ్‌కు కేంద్ర ప్రభుత్వం అనుమతించింది.

కిరాక్ ఆర్.పి ద‌ర్శ‌క‌త్వంలో నూత‌న‌ చిత్రం ప్రారంభం

జ‌బ‌ర్ధ‌స్థ్ కామెడీ షోతో తెలుగు ప్ర‌జ‌ల‌కి సుప‌రిచిత‌మైన క‌మీడియ‌న్ కిరాక్ ఆర్.పి ద‌ర్శ‌కునిగా మారారు.

చిరకాల మిత్రుడు పంపిన గిఫ్ట్‌తో ఫోటో తీసుకుని మురిసిపోతున్న మెగాస్టార్..

మెగాస్టార్ చిరంజీవి పుట్టినరోజు సందర్భంగా ఆయనకో స్పెషల్ గిఫ్ట్ వచ్చింది. అది తన చిరకాల మిత్రుడు పంపాడని..

గుడ్ న్యూస్ చెప్పిన ‘సీరం ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఇండియా’.. ఉచితంగా వ్యాక్సిన్..

భారతీయులందరికీ ‘సీరం ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఇండియా’ ప్రతినిధులు గుడ్ న్యూస్ చెప్పారు.

తెలంగాణలో రెండో రోజు 2 వేల మార్కును దాటేసిన కరోనా కేసులు..

తెలంగాణలో కరోనా ఉధృతి కొనసాగుతోంది. వరుసగా రెండో రోజు కూడా రాష్ట్రంలో కరోనా కేసులు రెండు వేల మార్కును దాటేశాయి.