త‌మ‌న్నా స‌క్సెస్ చూసి బాధ‌ప‌డుతున్న శృతిహాస‌న్..

  • IndiaGlitz, [Monday,March 28 2016]

నాగార్జున - కార్తీ - త‌మ‌న్నా క‌ల‌సి న‌టించిన చిత్రం ఊపిరి. ఈ సినిమా త‌మిళ్ లో తోళా అనే టైటిల్ తో రిలీజైంది. ఈ సినిమా ఇటు తెలుగు - అటు త‌మిళ్ లో ఘ‌న విజ‌యం సాధించింది. త‌మ‌న్నా కెరీర్ లో మ‌రో హిట్ మూవీగా నిలిచింది. త‌మ‌న్నా మాట‌ల్లో చెప్పాలంటే...నా లైఫ్ ఛేంజింగ్ ఫిల్మ్ ఊపిరి అంటోంది. ఇదంతా బాగానే ఉంది కానీ...త‌మ‌న్నా స‌క్సెస్ చూసి శృతిహాస‌న్ ఎందుకు బాధ‌ప‌డుతుంది అనుకుంటున్నారా..? ఊపిరి చిత్రంలో హీరోయిన్ గా ఫ‌స్ట్ శృతిహాస‌న్నే సెలెక్ట్ చేసారు. శృతిహాస‌న్ అడ్వాన్స్ కూడా తీసుకుంది. అయితే రేపు షూటింగ్ అన‌గా శృతిహాస‌న్ డేట్స్ ప్రాబ్ల‌మ్ వ‌ల‌న నేను ఈ సినిమా చేయ‌డం లేద‌ని చెప్పింద‌ట‌.

అంతే...క‌థ విని ఈ సినిమాలో న‌టించ‌డానికి అంగీక‌రించింది. అడ్వాన్స్ కూడా తీసుకుంది. రేపు షూటింగ్ అన‌గా ఈరోజు ఇలా చెప్ప‌డం ఏమిట‌ని శృతిహాస‌న్ పై ఊపిరి ద‌ర్శ‌క‌నిర్మాత‌ల‌కు కోపం వ‌చ్చింది. ఎంత‌లా కోపం వ‌చ్చిందంటే...శృతిహాస‌న్ పై కేసు పెట్టేంత వ‌ర‌కు వ‌చ్చింది. ఆత‌ర్వాత శృతిహాస‌న్ ప్లేస్ లో త‌మ‌న్నా వ‌చ్చింది. తెలుగులో ఊపిరి - త‌మిళ్ లో తోళా విజ‌యం సాధించ‌డంతో త‌మ‌న్నా స‌క్సెస్ చూసి..ఇంత మంచి సినిమా మిస్ అయ్యాన‌ని శృతిహాస‌న్ బాధ‌ప‌డుతుంద‌ని ఇటు టాలీవుడ్ అటు కోలీవుడ్లో టాక్. పాపం...శృతి.