మూడోసారి పాటపాడిన శృతి...

  • IndiaGlitz, [Tuesday,September 29 2015]

శృతిహాసన్ చాలా సినిమాల్లో పాట పాడిన సంగతి తెలిసిందే. మరిప్పుడు మూడోసారి మాత్రమే పాడటమేంటని అనుకుంటున్నారా? అజిత్, శృతిహాసన్ జంటగా రూపొందుతోన్న చిత్రం వేదాళం'. ఈ చిత్రాన్ని శౌర్యం', శంఖం' చిత్రాల ఫేమ్ శివ డైరెక్ట్ చేస్తున్నాడు. ఈ చిత్రానికి అనిరుధ్ మ్యూజిక్ అందిస్తున్నాడు. ఈ సినిమలో ఓ సాంగ్ ను శృతిహాసన్ పాడింది. గతంలో అనిరుధ్ సంగీత దర్శకత్వంలోనే రెండు సార్లు పాడిన శ్రుతిహాసన్ కి ఇది మూడోసారి పాడినట్టయింది. ఈ చిత్రంలో లక్ష్మీమీనన్ అజిత్ చెల్లెలుగా నటిస్తుంది. ఈ చిత్రాన్ని దీపావళి కానుకగా విడుదల చేయాలని నిర్మాతలు ప్లాన్ చేస్తున్నారు.

More News

చ‌ర‌ణ్ న్యూ మూవీలో హీరోయిన్ ఎవ‌రు..?

రామ్ చ‌ర‌ణ్ న‌టిస్తున్న తాజా చిత్రం బ్రూస్ లీ. ద‌స‌రా కానుక‌గా బ్రూస్ లీ చిత్రాన్ని అక్టోబ‌ర్ 16న ప్రేక్ష‌కుల ముందుకు తీసుకువ‌స్తున్నారు.

'సుబ్రమణ్యం ఫర్ సేల్' సక్సెస్ మీట్ , ప్లాటినమ్ డిస్క్ ఫంక్షన్

మెగాస్టార్‌ చిరంజీవి మేనల్లుడు సాయిధరమ్‌తేజ్‌, రెజీనా జంటగా శ్రీవెంకటేశ్వర క్రియేషన్స్‌ పతాకంపై హరీష్‌శంకర్‌.ఎస్‌ దర్శకత్వంలో హిట్‌ చిత్రాల నిర్మాత దిల్‌రాజు నిర్మించిన లవ్‌ అండ్‌ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌ 'సుబ్రమణ్యం ఫర్‌ సేల్‌'.

అమెరికాలో 1.4 మిలియ‌న్స్ క‌లెక్ష‌న్ల‌తో 25రోజుల సంబ‌రాలు జ‌రుపుకుంటున్న‌'భలే భలే మగాడివోయ్'

అల్లు అర‌వింద్ సమ‌ర్ప‌ణ‌లో, UV Creations మ‌రియు GA2 (A Division of GeethaArts)సంయుక్తంగా ప్రోడ‌క్ష‌న్ నెం. 1 గా రూపోందిన ప‌క్కా ఫ్యామిలీ అండ్ ల‌వ్ ఎంట‌ర్‌టైన‌ర్‌ "భ‌లే భ‌లే మ‌గాడివోయ్' చిత్రం సెప్టెంబ‌ర్ 4న విడుద‌ల‌వ‌ట‌మే కాక సూప‌ర్‌డూప‌ర్ హిట్ టాక్ మ‌రియు రికార్డు క‌లెక్ష‌న్లు సొంతం చేసుకుంటూ దూసుకుపోతుంది.

ప్రేమ్ రక్షిత్ మెగాఫోన్?

రానా హీరోగా ఓ సినిమాలో నటించబోతున్నారు. ఈ సినిమా స్వయానా సురేష్ ప్రొడక్షన్స్ పతాకంపై రూపొందనుంది.

నవంబర్ 5న విడుద‌ల కానున్న'బెంగాల్‌టైగ‌ర్'

మాస్ మహరాజ రవితేజ ఎన‌ర్జిటిక్ గా చేస్తున్న చిత్రం బెంగాల్‌టైగ‌ర్‌. సంపత్ నంది ద‌ర్శ‌కుడు. అందాల ముద్దుగుమ్మలు తమన్నా, రాశి ఖన్నా హీరోయిన్స్.