మూడోసారి పాటపాడిన శృతి...

  • IndiaGlitz, [Tuesday,September 29 2015]

శృతిహాసన్ చాలా సినిమాల్లో పాట పాడిన సంగతి తెలిసిందే. మరిప్పుడు మూడోసారి మాత్రమే పాడటమేంటని అనుకుంటున్నారా? అజిత్, శృతిహాసన్ జంటగా రూపొందుతోన్న చిత్రం వేదాళం'. ఈ చిత్రాన్ని శౌర్యం', శంఖం' చిత్రాల ఫేమ్ శివ డైరెక్ట్ చేస్తున్నాడు. ఈ చిత్రానికి అనిరుధ్ మ్యూజిక్ అందిస్తున్నాడు. ఈ సినిమలో ఓ సాంగ్ ను శృతిహాసన్ పాడింది. గతంలో అనిరుధ్ సంగీత దర్శకత్వంలోనే రెండు సార్లు పాడిన శ్రుతిహాసన్ కి ఇది మూడోసారి పాడినట్టయింది. ఈ చిత్రంలో లక్ష్మీమీనన్ అజిత్ చెల్లెలుగా నటిస్తుంది. ఈ చిత్రాన్ని దీపావళి కానుకగా విడుదల చేయాలని నిర్మాతలు ప్లాన్ చేస్తున్నారు.