సలార్‌లో శృతిహాసన్‌ క్యారెక్టర్‌కు పవన్ కుమార్తె పేరు.. పోస్టర్ రిలీజ్ చేసిన యూనిట్

  • IndiaGlitz, [Friday,January 28 2022]

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్, స్టార్ హీరోయిన్ శృతిహాసన్ జంటగా నటిస్తున్న తొలి సినిమా 'సలార్'. 'కె.జి.యఫ్' ఫేమ్ ప్రశాంత్ నీల్ దర్శకత్వం వహిస్తున్నారు. హోంబలే ఫిలిమ్స్ పతాకంపై విజయ్ కిర‌గందూర్‌ నిర్మిస్తున్నారు. ఈ రోజు శృతి హాసన్ పుట్టినరోజును పురస్కరించుకుని.. సలార్‌లో ఆమె లుక్ విడుదల చేశారు. అంతేకాదు క్యారెక్టర్ పేరు కూడా రివీల్ చేశారు మేకర్స్.

'సలార్'లో శృతిహాసన్ పేరు ‘‘ఆద్య’’ . పవర్ స్టార్ పవన్ కల్యాణ్ - రేణూ దేశాయ్ కుమార్తె పేరు కూడా ఆద్య అనే సంగతి తెలిసిందే. ఇందులో శృతిహాసన్‌ జర్నలిస్ట్‌గా నటిస్తున్నట్లు సమాచారం. 'సలార్'లో జగపతిబాబు కీలక పాత్రలో నటిస్తున్నారు.

మరోవైపు నటసింహ నందమూరి బాలకృష్ణ కథానాయకుడిగా గోపీచంద్ మలినేని దర్శకత్వంలో రూపొందుతున్న NBK107 సినిమాలో కూడా శృతి హీరోయిన్‌గా ఎంపికైన సంగతి తెలిసిందే. 'బలుపు', 'క్రాక్' తర్వాత గోపీచంద్ మలినేని దర్శకత్వంలో శృతి నటిస్తోన్న మూడో చిత్రమిది. అలాగే చిరంజీవి - బాబీ ప్రాజెక్టులోను హీరోయిన్‌గా శృతిహాసన్ పేరే వినిపిస్తోంది. సినిమాలతో పాటు ఓటీటీపై కూడా దృష్టి పెట్టినట్టు వెల్లడించింది శృతిహాసన్. త్వరలోనే తను నటించిన బెస్ట్ సెల్లర్ అనే వెబ్ సిరీస్ స్ట్రీమింగ్ కు రాబోతోందని ప్రకటించింది. ఈ వెబ్ సిరీస్ లో లీడ్ క్యారెక్టర్ పోషించింది శృతి.

More News

అవినీతిపై యుద్ధం .. సామాజిక కోణంలో శ్రీవిష్ణు ‘‘భళా తందనాన’’ , ఆకట్టుకుంటున్న టీజర్‌

హిట్టు ఫ్లాఫ్‌తో సంబంధం లేకుండా కొత్తదనం వున్న సినిమాలతో ప్రేక్షకులను అలరిస్తూ వుంటారు యువ కథానాయకుడు శ్రీవిష్ణు.

సమంత-నాగచైతన్య విడాకులపై నేనేం మాట్లాడలేదు.. అదంతా అవాస్తవం: నాగార్జున ట్వీట్

సమంత-నాగచైతన్యల విడాకులకు సంబంధించి తాను ఎలాంటి వ్యాఖ్యలు చేయలేదని అగ్ర కథానాయకుడు నాగార్జున స్పష్టం చేశారు.

69 ఏళ్ల తర్వాత పుట్టింటికి ఎయిరిండియా.. టాటా గ్రూప్‌కు అప్పగించిన కేంద్రం

ఇప్పటి వరకు ప్రభుత్వరంగంలో సేవలందించిన దిగ్గజ విమానయాన సంస్థ ఎయిరిండియా 69 ఏళ్ల తర్వాత పుట్టింటికి చేరుకుంది.

ఏపీలో కొత్త జిల్లాలు.. ఇకపై రాయలసీమకూ సముద్రతీరం, ఎలాగంటే..?

ఆంధ్రప్రదేశ్‌లో కొత్త జిల్లాల ఏర్పాటుపై జగన్ సర్కార్ దూకుడుగా వెళ్తున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే గెజిట్ నోటిఫికేషన్ సైతం విడుదల చేసింది.

జగన్ పిలవగానే.. మోకాళ్లపై కూర్చొని మాట్లాడిన ఐఏఎస్ అధికారి, ఫోటో వైరల్

బ్యూరోక్రాట్లు ముఖ్యమంత్రులు, మంత్రుల వద్ద మితిమీరిన వినయం ప్రదర్శిస్తున్నారు.