అర్జున్ రెడ్డిలో శ్రియ‌

  • IndiaGlitz, [Tuesday,July 03 2018]

గత ఏడాది కొత్త దర్శకుడు సందీప్ రెడ్డి వంగ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం 'అర్జున్ రెడ్డి'. విజయ్ దేవరకొండను రాత్రికి రాత్రే స్టార్‌ను చేసేసిన చిత్రమిది. యూత్‌ఫుల్ ఎంటర్‌టైనర్‌గా రూపుదిద్దుకున్న ఈ చిత్రం కేవ‌లం టాలీవుడ్‌నే కాదు కోలీవుడ్, బాలీవుడ్‌ను కూడా కదిలించింది. అందుకే ఈ సినిమాని ఇప్పుడు తమిళంతో పాటు హిందీలో కూడా రీమేక్ చేస్తున్నారు.

తమిళంలో ఈ చిత్రాన్ని 'వర్మ' పేరుతో దర్శకుడు బాలా తెరకెక్కిస్తున్నారు. ఇందులో చియాన్ విక్రమ్ తనయుడు ధృవ్ హీరోగా నటిస్తున్నాడు. ధృవ్‌కు జోడిగా శ్రియా శర్మను ఎంపిక చేసినట్టు సమాచారం.

తెలుగులో 'జై చిరంజీవ', 'దూకుడు', 'రచ్చ' లాంటి చిత్రాల్లో బాల నటిగా నటించిన శ్రియా.. 'గాయకుడు' సినిమాతో హీరోయిన్‌గా ఎంట్రీ ఇచ్చి.. ఆ తర్వాత 'నిర్మల కాన్వెంట్' సినిమాలో కూడా నాయికగా నటించింది.

ఇప్పుడు తమిళంలో కూడా హీరోయిన్‌గా ఎంట్రీ ఇవ్వ‌బోతోంది. త్వ‌ర‌లోనే శ్రియ ఎంట్రీ పై క్లారిటీ రానుంది. ఇదిలా ఉంటే.. తెలుగు నటి ఈశ్వరీ రావు ఈ చిత్రంలో ఓ కీలక పాత్రలో నటిస్తున్నారు.

More News

భారీ బడ్జెట్ ఎంటర్‌టైనర్‌గా వెంకీ, చైతు మల్టీస్టారర్ మూవీ

సీనియ‌ర్ క‌థానాయ‌కుడు విక్టరీ వెంకటేష్, యువ క‌థానాయ‌కుడు నాగ చైతన్య  హీరోలుగా ఓ మల్టీస్టారర్ మూవీ తెరకెక్కబోతున్న విషయం తెలిసిందే.

ఈ నగరానికి ఏమైంది సక్సెస్ మీట్

గత శుక్రవారం ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ నగరానికి ఏమైంది సినిమా ఫస్ట్ షో నుండి పాజిటివ్ టాక్ తో ప్రదర్శింపడుతుంది.

అనుప‌మ ఎంట్రీ సీన్ అదిరందంటున్న ద‌ర్శ‌కుడు

'తొలిప్రేమ'.. సినిమాతో టాలీవుడ్‌కు పరిచయమైన దర్శకుడు ఎ.కరుణాకరన్. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్‌ను యూత్ ఐకాన్‌గా నిలబెడుతూ..

రీమేక్‌కు బ్రేక్ వేసిన ర‌వితేజ‌..

మాస్ మహారాజా రవితేజ, గోవా బ్యూటీ ఇలియానా జంటగా నటిస్తున్న చిత్రం 'అమర్ అక్బర్ ఆంటోనీ'. శ్రీను వైట్ల దర్శకత్వం వహిస్తున్నారు.

అగ‌ష్టు 15న విడుద‌లకానున్న‌ GA2 పిక్చ‌ర్స్ 'గీతగోవిందం'

అర్జున్ రెడ్డి చిత్రం తో స్టార్ హీరోగా ఎదిగిన విజ‌య్‌దేవ‌ర‌కొండ త‌న కెరీర్ స్టార్టింగ్ నుండి త‌న చిత్రాల్ని ప్ర‌మెట్ చేసుకునే విధానం కొత్త‌గా