రాజమండ్రికి మనోజ్...

  • IndiaGlitz, [Sunday,November 29 2015]

బేబి త్రిష సమర్పణలో సురక్ష్‌ ఎంటర్‌టైన్‌మెంట్స్‌ ఇండియా ప్రై.లి.బ్యానర్‌పై దశరథ్‌ దర్శకత్వంలో శివకుమార్‌ మల్కాపురం నిర్మిస్తున్న‌చిత్రం శౌర్య‌'. మంచు మ‌నోజ్‌, రెజీనా నాయ‌క‌నాయిక‌లు. ప్ర‌స్తుతం సినిమా చివ‌రి షెడ్యూల్ చిత్రీక‌ర‌ణ‌లో ఉంది. డిసెంబ‌ర్ ఫ‌స్ట్ వీక్‌లో సినిమా చిత్రీక‌ర‌ణ‌ను పూర్తి చేసి డిసెంబ‌ర్ 31కి ఫ‌స్ట్ కాపీ రెడీ చేయాల‌ని ద‌ర్శ‌కుడు ద‌శ‌ర‌థ్ అనుకుంటున్నాడు. ల‌వ్ థ్రిలర్ మూవీ. జ‌న‌వ‌రిలో సినిమా విడుద‌ల‌కు ప్లాన్స్ జ‌రుగుతున్నాయట‌.ఈ చిత్రంలోమ‌నోజ్‌ సాఫ్ట్‌వేర్ ఇంజ‌నీర్ పాత్ర‌లో క‌నిపిస్తాను. మాస్ సినిమాలు చేసే మ‌నోజ్‌, క్లాస్ సినిమాలు చేసే ద‌శ‌ర‌థ్ క‌లిసి చేస్తున్న డిఫ‌రెంట్ థ్రిల్ల‌ర్ ఇది. ఫాస్ట్ పేస్‌లో సాగుతుంది. .ప్ర‌స్తుతం సినిమా నాలుగురోజుల షెడ్యూల్ కోసం రాజ‌మండ్రిలో చిత్రీక‌ర‌ణ‌ను జ‌రుపబోతున్నార‌ట‌..