'షూట్-అవుట్ ఎట్ ఆలేరు' ట్రైలర్ విడుదల చేసిన 'జీ 5', గోల్డ్ బాక్స్ ఎంటర్‌టైన్‌మెంట్స్

  • IndiaGlitz, [Wednesday,December 09 2020]

తెలుగు వీక్షకులకు అత్యుత్తమ కంటెంట్ అందిస్తున్న ప్రముఖ ఓటీటీ వేదిక 'జీ 5'. తాజాగా మరో ఇంటెన్స్ అండ్ యాక్షన్ డ్రామాను ప్రజల ముందుకు తీసుకొస్తోంది. 'జీ 5' కోసం ప్రముఖ కాస్ట్యూమ్ డిజైనర్, మెగాస్టార్ చిరంజీవి కుమార్తె సుష్మితా కొణిదెల, ఆమె భర్త విష్ణుప్రసాద్ నిర్మించిన వెబ్ సిరీస్ 'షూట్-అవుట్ ఎట్ ఆలేరు'. మంగళవారం సాయంత్రం వెబ్ సిరీస్ ట్రైలర్ విడుదల చేశారు.

పోలీసులను నడిరోడ్డు మీద తుపాకీతో కాల్చి చంపుతున్న ఘటనలు వార్తల్లో ముఖ్యాంశం అవుతుంది. 2007 నుండి 2010 వరకు ప్రతి ఏడాది మక్కా మసీదు బాంబు బ్లాస్ట్ యానివర్సరీ రోజున హిందూ పోలీసులను చంపిన అక్తరే, ప్రస్తుత మరణాలకు కారణమా? అని మీడియా సందేహం వ్యక్తం చేస్తుంది. ఐదేళ్ల క్రితం ఎన్కౌంటర్ లో మరణించిన అక్తర్ మరణాలకు కారణం అంటే పోలీసులు నమ్ముతున్నారా? మరణించిన అక్తర్ మళ్లీ ఎలా బతికొచ్చాడు? తమపై సాగిస్తున్న హత్యాకాండకు పోలీసులు ఎలా ముగింపు పలికారు? వంటి విషయాలు వెబ్ సిరీస్ చూస్తే తెలుస్తాయని ట్రైలర్ ద్వారా అర్థమవుతోంది.

'లూజర్' నుండి 'చదరంగం', 'గాడ్ (గాడ్స్ ఆఫ్ ధర్మపురి)' వరకు... ఒరిజినల్ వెబ్ సిరీస్ నుండి డైరెక్ట్-టు-ఒటిటి ఫీచర్ ఫిలిమ్స్ వరకూ... కామెడీ, మెసేజ్ ఓరియెంటెడ్ ఎంటర్టైన్మెంట్, పొలిటికల్ డ్రామా, స్పోర్ట్స్ డ్రామా, గ్యాంగ్ స్టర్ డ్రామా - డిఫరెంట్ జానర్ కంటెంట్ 'జీ 5' ప్లాట్‌ఫామ్ వీక్షకులకు అందించింది. 'షూట్-అవుట్ ఎట్ ఆలేరు'తో మరోసారి వీక్షకుల మనసు గెలుచుకునేలా ఉంది.

'సైరా నరసింహారెడ్డి' సహా పలు చిత్రాలకు కాస్ట్యూమ్ డిజైనర్‌గా పని చేసిన సుష్మితా కొణిదెల, ఆమె భర్త విష్ణుప్రసాద్ 'గోల్డ్ బాక్స్ ఎంటర్‌టైన్‌మెంట్స్' నిర్మాణ సంస్థను నెలకొల్పి... తొలి ప్రయత్నంగా నిర్మించిన వెబ్ సిరీస్ 'షూట్-అవుట్ ఎట్ ఆలేరు'. 'జీ 5' అసోసియేష‌న్‌తో ఈ వెబ్ సిరీస్ నిర్మిస్తున్న సంగతి తెలిసిందే. క్రిస్మస్ సందర్భంగా డిసెంబర్ 25న ఈ వెబ్ సిరీస్ 'జీ 5'లో ఎక్స్‌క్లూజివ్‌గా స్ట్రీమింగ్ కానుంది. ఇందులో ప్రకాష్ రాజ్, శ్రీకాంత్, నందిని రాయ్ తదితరులు ప్రధాన పాత్రధారులు. దీనికి ఆనంద్ రంగా దర్శకత్వం వహించారు. మొత్తం 8 ఎపిసోడ్స్ ఉంటాయని 'జీ 5' వర్గాలు వెల్లడించాయి.

More News

ప్రత్యేక విమానంలో ఉదయ్‌పూర్ వెళ్లిన పవన్..

పవర్ స్టార్ పవన్ కల్యాణ్ నేటి మధ్యాహ్నం రాజస్థాన్‌కు బయల్దేరి వెళ్లారు. మెగా డాటర్ నిహారిక వివాహం మరికొన్ని గంటల్లో ప్రారంభం కానుంది.

అరియానా విశ్వరూపం.. టూమచ్

షో స్టార్టింగే.. రూలర్ అయిన అరియానా.. ఒక్కొక్క వస్తువును తీసుకొచ్చి వాటితో తమ అనుబంధాన్ని పంచుకోవాలని చెప్పింది.

తనయుడితో తొలిసారి..

తెలుగు సినీ రంగంలో హీరోగా శ్రీకాంత్‌కు ప్రత్యేకమైన గుర్తింపు ఉంది. అయితే అంత కంటే ముందే అంటే కెరీర్‌ ప్రారంభంలో శ్రీకాంత్‌ విలన్‌గా కూడా నటించి మెప్పించిన సంగతి తెలిసిందే.

కేసీఆర్, కేటీఆర్, హరీష్‌ కంటే బురదలో పందులు నయం: బీజేపీ ఎంపీ

దళారీలకు సీఎం కేసీఆర్ చీఫ్ బ్రోకర్‌గా వ్యవహరిస్తున్నారంటూ బీజేపీ ఎంపీ ధర్మపురి అరవింద్ సంచలన వ్యాఖ్యలు చేశారు.

గుడ్ న్యూస్.. రూ.250 కే కరోనా టీకా..

కరోనా టీకా ఎప్పుడొస్తుందో అనే ప్రశ్న కంటే.. ఆ టీకా ధర ఎంత ఉంటుందోనన్న భయమే సామాన్య ప్రజానీకాన్ని పట్టి పీడిస్తోంది. సీరం ఇన్‌స్టిట్యూట్..