షాకింగ్.. ఓ మహిళను కోట్లకు అధిపతిని చేసిన నత్త

  • IndiaGlitz, [Saturday,March 27 2021]

అదృష్టం ఎప్పుడు.. ఎలా.. ఎవరిని.. ఏ రూపంలో వరిస్తుందో చెప్పలేం. ఒక నత్త.. మహిళ కుటుంబాన్ని కోట్లకు అధిపతిని చేయబోతోందంటే ఎవరైనా నమ్మగలరా? కానీ ఇది నిజం. తాను తినేందుకు కొని తెచ్చిన నత్తల్లో ఒక నత్త తనకు ఇంతటి అదృష్టాన్ని తెచ్చిపెడుతుందని సదరు మహిళ కూడా ఊహించలేదు. ఈ ఘటన థాయ్‌లాండ్‌లో చోటు చేసుకుంది. కూర చేయడం కోసం తీసుకువచ్చిన నత్త కొడ్చకార్న్ తాంతివిట్కుల్ అనే మహిళ తల రాతను మార్చేసింది. కేవలం 160 రూపాయల ఖర్చుతో ప్రస్తుతం ఆమె కోటీశ్వరాలు కాబోతుంది. అసలు విషయంలోకి వెళితే...

థాయ్‌లాండ్‌కు చెందిన కొడ్చకార్న్ తాంతివిట్కుల్ డిన్నర్ కోసం స్థానిక చేపల మార్కెట్‌ నుంచి నత్తలను 163 రూపాయలతో కొనుగోలు చేసి ఇంటికి తీసుకొచ్చింది. వెంటనే వాటిని శుభ్రం చేస్తుండగా.. ఒక నత్త కడుపులో ఆమెకు ఏదో ఒక పదార్థం కనిపించింది. అది ఆరెంజ్‌ కలర్‌లో ఉన్న రాయి. ఆ రాయి ఏంటో తెలియక కొడ్చకార్న్ దానిని తన తల్లికి చూపించింది. తల్లి చెప్పిన విషయాన్ని విని కొడ్చకార్న్ నిర్ఘాంతపోయింది. వెంటనే తేరుకుని ఆనందంతో ఉప్పొంగిపోయింది. ఆమెకు లభించిన రాయి ముత్యం కావడం విశేషం.

ముత్యం అయితే కోట్లలో విలువ ఎందుకు చేస్తుంది అనుకుంటున్నారా? అదొక మెలో అనే జాతికి చెందిన అరుదైన ముత్యం. 1.5 సెంటీమీటర్ల వ్యాసార్థం.. ఆరు గ్రాముల బరువు ఉంది. దాని ధర క్వాలిటీని బట్టి ఉంటుందట. కొడ్చకార్న్‌కు దొరికిన ముత్యం విలువ కోట్ల రూపాయల్లో ఉంటుందట. తనకు దొరికిన ముత్యం విషయమై కొడ్చకార్న్‌ మాట్లాడుతూ.. ‘‘నత్తలు శుభ్రం చేస్తుండగా దొరికిన వస్తువును అమ్మకు చూపించాను. అది మెలో ముత్యం.. కోట్ల రూపాయల ఖరీదు చేస్తుందని అమ్మ తెలిపింది. ప్రస్తుతం దీన్ని కొనే వారి కోసం చూస్తున్నాను. వచ్చే డబ్బుతో క్యాన్సర్‌తో బాధపడుతున్న మా అమ్మకు వైద్యం చేయించాలి’’ అని తెలిపింది.

More News

ఎమోషనల్ వీడియోతో చెర్రీకి బర్త్‌డే విషెస్ చెప్పిన మెగాస్టార్

మెగా పవర్‌ స్టార్‌ రామ్‌చరణ్‌ బర్త్‌డే సందర్భంగా అటు ‘ఆర్ఆర్ఆర్’ ఇటు ‘ఆచార్య’ ఇచ్చిన సర్‌ప్రైజ్‌లు అభిమానులను ఎంతగానో ఆకట్టుకున్నాయి.

సచిన్‌ టెండూల్కర్‌కు కరోనా పాజిటివ్

కరోనా మహమ్మారికి సంబంధించిన సెకండ్ వేవ్ బీభత్సంగా ఉంది. ఒక్కసారిగా కేసుల సంఖ్య దారుణంగా పెరిగిపోతోంది.

దేశంలో విజృంభించిన మహమ్మారి.. 60 వేలకు చేరువలో కేసులు

కొన్ని నెలలుగా కరోనా కేసులు చాలా వరకూ తగ్గిపోయాయి. దాదాపు ఈ ఏడాది ఆరంభం నుంచి కరోనా కేసులు పెద్దగా నమోదవడం లేదు.

‘ఆచార్య’తో కలిసి సిద్ద... సర్‌ప్రైజ్ అదిరిపోయిందిగా..

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ పుట్టినరోజు నేడు. ఈ సందర్భంగా ‘ఆచార్య’ చిత్ర యూనిట్ అభిమానులకు సర్‌ప్రైజ్‌ గిఫ్ట్‌ను అందజేసింది.

‘రంగ్ దే’ తొలిరోజు వసూళ్లివే...

నితిన్‌, కీర్తీ సురేశ్‌ జంటగా నటించిన చిత్రం ‘రంగ్‌ దే’. సితార ఎంటర్‌టైన్‌మెంట్స్‌ పతాకంపై వెంకీ అట్లూరి ఈ సినిమాను రూపొందించారు.