చేపల వేటకు వెళ్లిన వారికి షాక్... బీచ్‌లో కొట్టుకొచ్చిన బంగారం

  • IndiaGlitz, [Tuesday,December 15 2020]

చేపల వేటే వారికి జీవనాధారం.. వాటిని పట్టుకుని అమ్మితేనే రోజు గడుస్తుంది. ఎప్పటిలాగే మత్స్యకారులంతా ఆ రోజు కూడా చేపల వేటకు వెళ్లారు. తమ వలకు చేపలు చిక్కుతాయనే ఆశతో సముద్రం వైపు అడుగులేశారు. అక్కడికి వెళ్లాక షాక్ అయ్యారు. బీచ్‌లో బంగారం, వెండి కణికలు లభించాయి. దీంతో అసలు తాము ఎందుకోసం వచ్చామో కూడా మరచిపోయారు. అసలేం జరిగిందంటే...

వెనిజులాలోని గాకా బీచ్‌.. చేపల వేటకని వెళ్లిన మత్స్యకారులకు అత్యంత విలువైన బంగారం, వెండి ఆభరణాలు దొరికాయి. అవి సముద్రంలో నుంచి కొట్టుకొచ్చాయని తెలుసుకుని వారంతా ఆశ్చర్యపోయారు. పేదరికంలో కొట్టుమిట్టాడుతున్న అక్కడి ప్రజలకు ఇది వరంగా మారింది. దీంతో బీచ్‌కి వెళ్లిన మత్స్యకారులంతా బంగారం, వెండి కోసం ఎగబడ్డారు. దొరికిన వాటిని దొరికినట్లు తీసుకుని వెళ్లిపోయారు. కొందరైతే వాటిని భారీ ధరలకు అమ్మేసుకున్నారు. అనధికారిక లెక్కల ప్రకారం ప్రతి ఒక్కరికీ ఏదో ఒక వస్తువు లభించిందట.

కాగా.. తమకు దొరికిన వస్తువులను చాలా మంది అత్యధికంగా 1500 డాలర్లకు అమ్ముకున్నారని తెలుస్తోంది. ఈ విషయంపై స్పందించిన స్థానిక మత్స్యకారులు... తమ జీవితంలో ఇలాంటి ఘటనను ఎన్నడూ చూడలేదని, విషయం తెలియగానే ఆశ్చర్యపోయామని వెల్లడించారు. దీనికి సంబంధించిన ఫోటోలు ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి. కాగా.. 2019 సెప్టెంబరులో తొలిసారి ఈ విశేషాన్ని స్థానికులు గుర్తించారు. ఆ సమయంలో ఒక్కొక్కరూ దాదాపు రూ. లక్షన్నర చొప్పున సంపాదించారని సమాచారం.

More News

భర్తతో కలిసి ‘ఆచార్య’ సెట్స్‌కి కాజల్.. బొకేతో మెగాస్టార్ స్వాగతం

మెగాస్టార్ చిరంజీవి హీరోగా కొరటాల శివ దర్శకత్వంలో నటిస్తున్న సినిమా ఆచార్య. వీరిద్దరి కాంబోలో సినిమా అనగానే అంచనాలు ఆకాశాన్నంటాయి.

బిగ్‌బాస్ గ్రాండ్ ఫినాలేకు 3 ముద్దుగుమ్మలు.. లక్షల్లో రెమ్యునరేషన్..

పెద్దగా అంచనాలేమీ లేకుండా స్టార్ట్ అయినప్పటికీ.. ఇప్పుడు మంచి రేటింగ్స్‌తో బిగ్‌బాస్ రియాలిటీ షో దూసుకుపోతోంది.

‘స‌లార్’లో మ‌రో స్టార్ హీరో.. ఆడిష‌న్స్ షురూ అయ్యాయి

ప్ర‌భాస్ హీరోగా ప్ర‌శాంత్ నీల్ ద‌ర్శ‌క‌త్వంలో హోంబ‌లే ఫిలింస్ బ్యాన‌ర్‌లో విజ‌య్ క‌ర‌గందూర్ ‘సలార్’ అనే ప్యాన్ ఇండియా మూవీని నిర్మించనున్న సంగతి తెలిసిందే.

రజినీకాంత్ పార్టీ పేరు, గుర్తు ఖ‌రారు

త‌లైవా.. సూప‌ర్‌స్టార్ ర‌జినీకాంత్ డిసెంబ‌ర్ 31న త‌న రాజ‌కీయ పార్టీ పేరుని అనౌన్స్ చేసి జ‌న‌వ‌రిలో పార్టీని ప్రారంభిస్తాన‌ని ఇప్ప‌టికే అనౌన్స్ చేసిన సంగ‌తి తెలిసిందే.

రాజ‌మౌళి ఏంటి ఇలా చేశాడు.. టెన్ష‌న్‌లో మెగా ఫ్యాన్స్‌?

మెగాఫ్యాన్స్ నిరాశ‌లో ఉన్నారా! అంటే అవున‌నే ఆన్స‌ర్ వ‌స్తుంది. ఇంత‌కీ మెగా ఫ్యాన్స్ టెన్ష‌న్‌కు కార‌ణం ఎవ‌రు?