టీడీపీకి ఊహించని షాక్.. ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు రాజీనామా ఆమోదం..

  • IndiaGlitz, [Tuesday,January 23 2024]

ఎన్నికల వేళ టీడీపీకి ఊహించని షాక్ తగిలింది. విశాఖ ఉత్తర నియోజకవర్గ ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు రాజీనామాను స్పీకర్ తమ్మినేని సీతారం ఆమోదించారు. ఈ మేరకు అసెంబ్లీ కార్యదర్శి నోటిఫికేషన్‌ జారీ చేశారు. విశాఖ స్టీల్‌ప్లాంట్‌ ప్రైవేటీకరణ నిర్ణయానికి వ్యతిరేకంగా 2021 ఫిబ్రవరి 12న తన ఎమ్మెల్యే పదవికి గంటా రాజీనామా చేశారు. అప్పటి నుంచి ఈ రాజీనామా అంశం పెండింగ్‌లో ఉంది. పలు మార్లు స్పీకర్‌ను కలిసి తన రాజీనామాను ఆమోదించాలని కోరారు. దాదాపు మూడు సంవత్సరాల తర్వాత అది కూడా ఎన్నికల నోటిఫికేషన్ వచ్చే తరుణంలో రాజీనామా ఆమోదించడం చర్చనీయాంశంగా మారింది.

అయితే ఎన్నికల వేళ రాజీనామా ఆమోదించడం వెనక కారణాన్ని టీడీపీ నేతలతో పాటు రాజకీయ విశ్లేషకులు వెల్లడిస్తున్నారు. త్వరలోనే ఏపీకి సంబంధించిన రాజ్యసభ ఎన్నికల నోటిఫికేషన్ విడుదల కానుంది. దీంతో ఆయన రాజీనామాను ఆమోదిస్తే ఈ ఎన్నికల్లో ఓటు వేయడానికి వీలు ఉండదు. దీంతో అధికారికంగా టీడీపీకి ఓ ఎమ్మె్ల్యే బలం తగ్గుతుంది. ఏపీలో మూడు రాజ్యసభ స్థానాల కోసం ఎన్నికలు జరగనున్నాయి. ప్రస్తుతం ఉన్న ఎమ్మెల్యేల బలాల ప్రకారం ఈ మూడు స్థానాలు అధికార వైసీపీకే దక్కుతాయి.

అయితే ప్రస్తుతం ఎమ్మెల్యేల అభ్యర్థులపై సీఎం జగన్ కసరత్తు చేస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే నాలుగు విడతల్లో అభ్యర్థులను ప్రకటించారు. దీంతో టికెట్ రాని ఎమ్మెల్యేలతో పాటు స్థానచలనమైన ఎమ్మెల్యేలు తీవ్ర అసంతృప్తితో ఉన్నారు. వీరిలో కొంతమంది టీడీపీ వైపు చూస్తున్నారు. రాజ్యసభ ఎన్నికల్లో వీరు టీడీపీ అభ్యర్థికి ఓటు వేస్తే ఓ స్థానం కోల్పోవాల్సి వస్తుంది. అందుకే టీడీపీ ఎమ్మెల్యేల బలాన్ని తగ్గించే క్రమంలోనే గంటా రాజీనామాను ఆమోదించారని రాజకీయ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి.

మరో నెల రోజుల్లో ఎన్నికలు జరగనున్న సమయంలో ఇప్పుడు రాజీనామా ఆమోదించినా ఎటువంటి నష్టం ఉండదు. కేవలం రాజ్యసభ ఎన్నికల దృష్టితోనే రాజీనామా ఆమోదించారని టీడీపీ నేతలు చెబుతున్నారు. మరోవైపు గతేడాది జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీడీపీకి ఓటు వేశారనే ఆరోపణలు ఎదుర్కొంటున్న నలుగురు ఎమ్మెల్యేలపై అనర్హతా వేటు వేయాలని స్పీకర్‌కు వైసీపీ నేతలు ఫిర్యాదు చేశారు. అలాగే టీడీపీ నుంచి వైసీపీలో చేరిన నలుగురు ఎమ్మెల్యేలపైనా అనర్హతా వేటు వేయాలని టీడీపీ నేతలు కూడా ఫిర్యాదు చేశారు. ఇరు పార్టీల ఫిర్యాదులపై స్పీకర్ ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. మరి వీరిపై స్పీకర్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో వేచి చూడాలి.

More News

తెలంగాణ ప్రజలకు శుభవార్త.. ఉచిత విద్యుత్‌కు సర్కార్ గ్రీన్ సిగ్నల్..

కాంగ్రెస్ ప్రభుత్వం తెలంగాణ ప్రజలకు మరో శుభవార్త అందించింది. కాంగ్రెస్ ఆరు గ్యారంటీ హామీల్లో భాగంగా ఇప్పటికే రెండు హామీలను అమలు చేస్తున్న సంగతి తెలసిందే.

మంత్రి రోజా ఘోరంగా మోసం చేశారు.. వైసీపీ కౌన్సిలర్ తీవ్ర ఆరోపణలు..

ఏపీ మంత్రి రోజాపై వైసీపీకి చెందిన పుత్తూరు 17వ వార్డ్ కౌన్సిలర్ భువనేశ్వరి సంచలన ఆరోపణలు చేశారు. పుత్తూరు మున్సిపల్‌ ఛైర్మన్ పదవి కోసం రూ.70 లక్షలు డిమాండ్ చేశారని ఆరోపించారు.

ఫిబ్రవరి 1నే బడ్జెట్‌ ఎందుకు ప్రవేశపెడతారు..? దీని వెనక కారణాలేంటి..?

ఏ దేశమైనా ఆర్థికంగా ముందుకు నడవాలంటే బడ్జెట్ చాలా ముఖ్యం. ప్రతి ఏటా బడ్జెట్ ప్రవేశపెట్టడం తప్పనిసరి. అలాగే మన దేశంలో కూడా బడ్జెట్‌పై సామాన్యుల నుంచి ప్రముఖులు వరకు ఉత్కంఠగా ఎదురుచూస్తూ ఉంటారు.

TSPSC చైర్మన్‌గా మాజీ డీజీపీ మహేందర్ రెడ్డి..? గవర్నర్ ఆమోదమే తరువాయి..

కాంగ్రెస్ ప్రభుత్వం తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్(TSPSC) ప్రక్షాళనకు సిద్ధమైన సంగతి తెలిసిందే. ఇప్పటికే చైర్మన్‌ పదవితో పాటు కమిషన్ సభ్యుల నియామకం కోసం దరఖాస్తులను ఆహ్వానించింది.

YS Jagan: చంద్రబాబుకు అండగా బినామీ స్టార్ క్యాంపెయినర్లు.. సీఎం జగన్ విమర్శలు..

టీడీపీ అధినేత చంద్రబాబును జాకీ పెట్టి లేపేందుకు ఇతర పార్టీల నేతలు పనిచేస్తున్నారని సీఎం జగన్ విమర్శించారు. అనంతపురం జిల్లా ఉరవకొండలో నాలుగో విడత వైఎస్ఆర్ ఆసరా పంపిణీ కార్యక్రమంలో