AP Govt:ఏపీ ప్రభుత్వానికి హైకోర్టులో షాక్.. విశాఖ నుంచి పరిపాలన లేనట్లే..
Send us your feedback to audioarticles@vaarta.com
ఏపీ ప్రభుత్వానికి హైకోర్టులో చుక్కుదురైంది. విశాఖకు ప్రభుత్వ కార్యాలయాలను తరలించాలనుకున్న ప్రభుత్వ ప్రయత్నాలకు న్యాయస్థానం బ్రేక్ వేసింది. ముఖ్యమంత్రి క్యాంపు కార్యాలయం ఏర్పాటు పేరుతో ప్రభుత్వ కార్యాలయాలను విశాఖకు తరలించే యత్నాన్ని సవాలు చేస్తూ దాఖలైన పిటిషన్పై విచారణ జరిగింది. ఈ పిటిషన్ను త్రిసభ్య ధర్మాసనానికి బదిలీ చేస్తున్నట్లు న్యాయమూర్తి ప్రకటించారు. త్రిసభ్య ధర్మాసనం తీర్పు వచ్చేంతవరకు కార్యాలయాల తరలింపుపై స్టేటస్ కో విధించింది.
మంగళవారం జరిగిన విచారణలో ప్రభుత్వ న్యాయవాదులు సుమన్, మహేశ్వరరెడ్డి వాదనలు వినిపిస్తూ.. ప్రస్తుత వ్యాజ్యాలను త్రిసభ్య ధర్మాసనం ముందుకు పంపాలని కోరారు. సీఎం క్యాంపు కార్యాలయం వ్యవహారంపై దాఖలైన పిటిషన్ విచారణ ఆ ధర్మాసనం ముందు పెండింగ్లో ఉందని.. అందువల్ల ప్రస్తుత వ్యాజ్యాలను కూడా త్రిసభ్య ధర్మాసనం ముందుకు పంపాలని విజ్ఞప్తి చేశారు.
ఇక బుధవారం జరిగిన విచారణలో హైకోర్టు తీర్పునకు విరుద్ధంగా ప్రభుత్వ కార్యాలయాలను విశాఖకు తరలిస్తున్నారని పిటిషనర్ తరపు లాయర్లు వాదించారు. ఫర్నిచర్ సైతం కొనుగోలు చేశారని చెప్పారు. ఇరు పక్షాల వాదనలు విన్న న్యాయమూర్తి త్రిసభ్య ధర్మాసనం ముందు ఈ పిటిషన్ బదిలీ చేస్తున్నట్లు ఆదేశించారు. అలాగే త్రిసభ్య ధర్మాసనం తీర్పు ఇచ్చే వరకు కార్యాలయాల తరలింపుపై స్టేటస్ కో జారీ చేస్తున్నట్లు ఉత్తర్వులు ఇచ్చారు. దీంతో ప్రభుత్వ కార్యాలయాలు తరలించాలని భావించిన ప్రభుత్వానికి గట్టి షాక్ తగిలింది.
ఎందుకంటే మరో రెండు నెలల్లో రాష్ట్రంలో ఎన్నికలు రానున్నాయని.. త్రిసభ్య ధర్మాసనం తీర్పు ఎప్పుడు వస్తుందో తెలియదు. ఒకవేళ ప్రభుత్వానికి అనుకూలంగా జనవరి నెలాఖరు లోపు తీర్పు వచ్చినా.. ఎన్నికల సమయం కాబట్టి విశాఖకు తరలింపు ఉండపోవచ్చు. మొత్తానికి వైజాగ్ నుంచి పరిపాలన చేయాలనుకున్న సీఎం జగన్ ఆశలు ఆడియాశలయ్యాయి.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్సైట్ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout