close
Choose your channels

Bigg Boss 7 Telugu : శివాజీ vs శోభా.. పో అంటే నువ్వే పో అని, ఈవారం నామినేషన్స్‌లో 9 మంది

Wednesday, September 13, 2023 • తెలుగు Comments
Listen to article
--:-- / --:--
1x
This is a beta feature and we would love to hear your feedback?
Send us your feedback to audioarticles@vaarta.com

14 మందితో ప్రారంభమైన బిగ్‌బాస్ 7 రెండో వారంలోకి ప్రవేశించింది. ఫస్ట్ వీక్ కిరణ్ రాథోడ్ ఎలిమినేట్ అయ్యింది. తెలుగు రాదనే కారణంతో పాటు సరిగా ఎంటర్‌టైన్ చేయలేదనే సాకుతో ప్రేక్షకులు ఆమెను బయటికి పంపించేశారు. అయితే ఈ వారం నామినేషన్స్ చాలా వాడి వేడిగా సాగాయి. సోమవారం నాటి ఎపిసోడ్‌లో కేవలం సగం వరకు నామినేషన్స్ మాత్రమే చూపించారు. శివాజీ, పల్లవి ప్రశాంత్‌లను ఇంటి సభ్యులంతా టార్గెట్ చేశారు. ఇవాళ్టీ ఎపిసోడ్‌లో రతిక, తేజ, అమర్‌దీప్, షకీలా, గౌతమ్, శోభా శెట్టి, ప్రిన్స్ యావర్‌లు నామినేట్ అయ్యారు. అయితే ఈ వ్యవహారం మొత్తం గొడవలు గొడవలుగా సాగింది.

పవర్ అస్త్రను సంపాదించిన సందీప్‌కు ఆఫర్ ఇస్తూ వీఐపీ రూంలో వుండమన్నాడు బిగ్‌బాస్. అయితే డీలక్స్, స్టాండర్డ్ రూమ్స్‌లో ఎవరెవరు వుండాలనేది నీ ఇష్టమని నిర్ణయాన్ని సందీప్‌కే వదిలివేశాడు బిగ్‌బాస్. దీంతో డీలక్స్ రూంని షకీలా, శివాజీ , దామిని, అమర్‌దీప్‌కి.. స్టాండర్డ్ రూంని రతిక, ప్రిన్స్, ప్రశాంత్, గౌతమ్, శోభాశెట్టి, ప్రియాంకలకు కేటాయించారు. పాపం టేస్టీ తేజ ఒక్కడే మిగిలిపోవడంతో అతనికి సోఫానే దిక్కయ్యింది. శుభశ్రీకి డీలక్స్ రూం ఎందుకిచ్చారు అంటూ శోభాశెట్టి, సందీప్‌తో గొడవకు దిగింది.

మరోవైపు.. ఆట సందీప్ పవర్ అస్త్రను సంపాదించడంతో పర్మినెంట్‌గా హౌస్ మెంబర్ అయిపోయాడు. మిగిలినవాళ్లు అది గెలుచుకోవాలంటే గేమ్ ఆడాల్సి వుంటుందన్న బిగ్‌బాస్ ‘‘మాయ అస్త్ర’’ పేరుతో టాస్క్ పెట్టాడు. ఇంటి సభ్యులను రెండు జట్టులుగా విభజించి.. రణధీర, మహాబలి అని పేర్లు పెట్టాడు. రణధీర టీమ్‌లో అమర్‌దీప్, ప్రియాంక, ప్రిన్స్ యావర్, శోభాశెట్టి, శివాజీ, షకీలా వుండగా.. మహాబలి టీమ్‌లో టేస్టీ తేజ, దామిని, శుభశ్రీ, రతిక, పల్లవి ప్రశాంత్, గౌతమ్ కృష్ణ వున్నారు. రెండు జట్ల మధ్య ‘‘పుల్ రాజా పుల్’’ అంటూ ఫస్ట్ ఛాలెంజ్ జరిగింది. ఇందులో రెండు వైపుల నుంచి నలుగురు సభ్యులు వచ్చి మధ్యలో వున్న లాగ్‌ను తమవైపు లాగాలి. ఇందులో గెలిచిన టీమ్‌కి మాయాస్త్రానికి సంబంధించిన కీ దొరుకుతుంది. ఈ గేమ్‌లో రణధీర టీమ్ విజయం సాధించింది. అయితే తమ సైడ్ వున్న కర్ర విరిగిపోవడంతో తమకు నిలబడటం సాధ్యం కాలేదని.. అందుకే ఓడిపోయామని మహాబలి టీమ్ సంచాలకుడిగా చెప్పే ప్రయత్నం చేసింది. కానీ సందీప్ ఈ విషయాన్ని పట్టించుకోకపోగా.. మాయాస్త్రానికి చెందిన కీని రణధీర టీమ్‌కి అందించాడు.

ఇక ఇవాళ్టీ ఎపిసోడ్‌లో శివాజీ, శోభాశెట్టి ఎపిసోడ్ హైలెట్‌గా నిలిచింది. శోభను శివాజీ నామినేట్ చేశాడు. మాట్లాడితే కంటెంట్.. కంటెంట్ అంటున్నారు అంటూ ఫైర్ అయ్యింది. రీజన్ లేకపోయినా కావాలని నామినేట్ చేస్తున్నారని శివాజీపై మండిపడింది. నేను వాదించడం మొదలుపెడితే తట్టుకోలేవు.. వదిలేయ్ అంటూ శివాజీ అనగా.. నాకు కూడా మాటలు వచ్చు అని శోభా ధీటుగా బదులిచ్చింది. బయట వున్నట్లు హౌస్‌లో వుండొద్దు.. అది చేశాను ఇది చేశాను అని చెప్పుకోవద్దు అంటూ సెటైర్లు వేసింది. ఇద్దరూ పో.. అంటే పో అనుకున్నారు.

Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.   

Comments

Welcome to IndiaGlitz comments! Please keep conversations courteous and relevant to the topic. To ensure productive and respectful discussions, you may see comments from our Community Managers, marked with an "IndiaGlitz Staff" label. For more details, refer to our community guidelines.
settings
Login to post comment
Cancel
Comment