దేవ‌నార్ స్కూల్‌లో పుట్టిన‌రోజుని సెల‌బ్రేట్ చేసుకున్న హీరోయిన్ శివానీ రాజ‌శేఖ‌ర్

  • IndiaGlitz, [Monday,July 02 2018]

నా పుట్టిన‌రోజు సంద‌ర్భంగా నా సంతృప్తి కోసం నేను, నా త‌ల్లిదండ్రులు క‌లిసి మ‌న భూమి కోసం తెలంగాణ ప్ర‌భుత్వం చేప‌ట్టిన హ‌రిత హారం కార్య‌క్ర‌మంలో పాల్గొన‌డం ఆనందంగా ఉంది. మ‌న భూమిని మ‌న‌మే కాపాడుకోవాలి. అందుక‌నే చెట్ల‌ని నాటాలి' అని అన్నారు హీరోయిన్‌ శివానీ రాజ‌శేఖ‌ర్‌. ఈమె పుట్టిన‌రోజు జూలై1.

ఈ సంద‌ర్భంగా శివానీ రాజ‌శేఖ‌ర్‌, రాజ‌శేఖ‌ర్‌, జీవిత దంపతులు మేడ్చ‌ల్ రింగురోడ్డు వ‌ద్ద హ‌రిత హారం కార్య‌క్ర‌మంలో పాల్గొన్నారు. అలాగే దేవ‌నార్ అంధుల పాఠ‌శాల‌కు వెళ్లి అక్క‌డి పిల్ల‌ల‌ను క‌లిసి ముచ్చ‌టించారు. అక్క‌డే కేక్ క‌ట్ చేసి త‌న పుట్టిన‌రోజుని సెల‌బ్రేట్ చేసుకున్నారు.

ఈ సంద‌ర్భంగా... శివానీ రాజ‌శేఖ‌ర్ మాట్లాడుతూ - '' ఈ పుట్టిన‌రోజును ఇలా కొత్త‌గా సెల‌బ్రేట్ చేసుకోవ‌డం చాలా ఆనందంగా ఉంది. ఇక‌పై ప్ర‌తి పుట్టిన‌రోజును ఇలాగే మీ మ‌ధ్య‌లోనే సెల‌బ్రేట్ చేసుకుంటాను. ఇక్క‌డి పిల్ల‌ల తెలివి తేట‌ల్ని చూస్తుంటే ఆశ‌ర్యంగా, ఆనందంగా ఉంది. మా అందరి కంటే మీరే చాలా గ్రేట్‌'' అన్నారు. 

జీవితా రాజ‌శేఖ‌ర్ మాట్లాడుతూ - '' ఇక్క‌డున్న పిల్ల‌లు సాధించిన విజయాలు చూస్తేంటే మేం ఇంకా ఎంతో సాధించాల‌ని అనుకోవాలి. దేవుళ్ల‌తో స‌మాన‌మైన పిల్ల‌లు మీరు. మీరింకా ఎంతో ఉన్న‌తి సాధించాల‌ని కోరుకుంటున్నాం. ఇక్క‌డ క‌డుతున్న స్కూల్‌కి మా చేత‌నైన స‌హాయం చేస్తాం'' అన్నారు. 

More News

సత్యదేవ్ - నందితాశ్వేత కాంబినేషన్ లో 'బ్లఫ్ మాస్టర్'

ఆశ, అత్యాశ‌ల నేపథ్యంలో రూపొందిన  'చ‌తురంగ వేట్టై' చిత్రానికి  త‌మిళ  ప్రేక్ష‌కులు బ్ర‌హ్మ‌ర‌థం ప‌ట్టారు. ఇప్పుడీ చిత్రం తెలుగులో రీమేక్ అయ్యింది .

డైరెక్టర్ రాజ్ కుమార్ హిరాణితో తరుణ్ భాస్కర్

డైరెక్టర్ తరుణ్ భాస్కర్ బాలీవుడ్ డైరెక్టర్ రాజ్ కుమార్ హిరాణిని ముంబాయిలో కలిశారు. ఈ నగరానికి ఏమైంది చిత్ర స్పెషల్ షోలో వీరిద్దరూ కలవడం జరిగింది.

'నిన్నుకోరి'కి రివర్స్‌గా చైతు, సామ్ చిత్రం

ఆన్‌స్క్రీన్  మ్యాజిక్ చేసే జంటల్లో నాగచైతన్య, సమంత జోడీ ఒక‌టి. 'ఏ మాయ చేసావే'తో తొలిసారి ప్రేక్షకులను అలరించిన ఈ జంట.. తర్వాత 'మనం', 'ఆటోనగర్ సూర్య' చిత్రాలతో సక్సెస్‌ఫుల్ జోడీగా పేరు తెచ్చుకుంది.

ఫ్యాక్ష‌న్ లీడ‌ర్ పాత్ర‌లో జ‌గ్గూ భాయ్‌

యాత్ర పేరుతో మ‌హి .వి.రాఘ‌వ్ దివంగ‌త మాజీ ముఖ్య‌మంత్రి వై.ఎస్‌.రాజ‌శేఖ‌ర్ రెడ్డి జీవిత చ‌రిత్ర‌ను సినిమా రూపంలో తెర‌కెక్కిస్తోన్న సంగ‌తి తెలిసిందే.

'విశ్వామిత్ర' విల‌న్‌గా..

'గీతాంజలి' లాంటి కామెడీ హారర్‌తో తెలుగు ఇండస్ట్రీ దృష్టిని ఆక‌ర్షించిన‌ దర్శకుడు రాజ్ కిరణ్. ప్ర‌స్తుతం ఈ దర్శకుడు..   'విశ్వామిత్ర' అనే చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు.