మరో యంగ్ డైరెక్టర్ తో శర్వానంద్..

  • IndiaGlitz, [Friday,February 05 2016]
ర‌న్ రాజా ర‌న్, మ‌ళ్లీ మ‌ళ్లీ ఇదిరాని రోజు, ఎక్స్ ప్రెస్ రాజా...చిత్రాల‌తో వ‌రుస విజ‌యాలు సాధించి హ్యాట్రిక్ సాధించాడు యంగ్ హీరో శ‌ర్వానంద్. యంగ్ డైరెక్ట‌ర్స్ తో సినిమాలు చేస్తూ...స‌క్సెస్ సాధిస్తున్న హీరో శ‌ర్వానంద్ తాజాగా మ‌రో యంగ్ డైరెక్ట‌ర్ పి.మ‌హేష్ తో మూవీ చేయ‌డానికి గ్రీన్ సిగ్న‌ల్ ఇచ్చిన‌ట్టు స‌మాచారం. పి.మ‌హేష్ సందీప్ కిష‌న్ తో రారా కృష్ణ‌య్య సినిమాని తెర‌కెక్కించారు. పి.మ‌హేష్ శ‌ర్వానంద్ ని దృష్టిలో పెట్టుకుని ఓ డిఫ‌రెంట్ స్టోరి రెడీ చేసారు. ప్ర‌స్తుతం ప్రీ ప్రొడ‌క్ష‌న్ వ‌ర్క్ జ‌రుగుతుంది. త్వ‌ర‌లో ఈ చిత్రం షూటింగ్ ప్రారంభించ‌నున్నారు. ఈ చిత్రాన్ని తెలుగుదేశం పార్టీ ఎం.పి కేశినేని నాని నిర్మించ‌నున్నార‌ని స‌మాచారం.