చైతు హీరోయిన్ తో శర్వానంద్....

  • IndiaGlitz, [Tuesday,June 28 2016]

ర‌న్ రాజా ర‌న్, మ‌ళ్లీ మ‌ళ్లీ ఇదిరాని రోజు, ఎక్స్ ప్రెస్ రాజా...చిత్రాల‌తో హ్యాట్రిక్ సాధించిన శ‌ర్వానంద్ తాజాగా రెండు చిత్రాల్లో న‌టిస్తున్నారు. ఒక‌టి శ‌ర్వానంద్ 25వ చిత్రం. ఈ చిత్రాన్ని బి.వి.ఎస్.ఎన్ ప్ర‌సాద్ నిర్మిస్తున్నారు. ఇక రెండో చిత్రం వేగేశ్న స‌తీష్ ద‌ర్శ‌క‌త్వంలో దిల్ రాజు నిర్మిస్తున్న శ‌త‌మానం భ‌వ‌తి. ఈ చిత్రంలో శ‌ర్వానంద్ స‌ర‌స‌న చైతు తో క‌లిసి న‌టించిన అనుప‌మ ప‌ర‌మేశ్వ‌ర‌న్ న‌టిస్తున్న‌ట్టు స‌మాచారం. ఇటీవ‌ల అ ఆ చిత్రంతో టాలీవుడ్ లో ఎంట్రీ ఇచ్చిన అనుప‌మ ప‌ర‌మేశ్వ‌ర‌న్ మంచి గుర్తింపు ఏర్ప‌రుచుకుంది. త్వ‌ర‌లో చైతు ప్రేమ‌మ్ చిత్రంతో మ‌రోసారి ప్రేక్ష‌కుల ముందుకు రానుంది. శ‌త‌మానం భ‌వ‌తి చిత్రాన్ని ఆగ‌ష్టులో ప్రారంభించి సంక్రాంతి కానుక‌గా రిలీజ్ చేయ‌డానికి ప్లాన్ చేస్తున్నారు.