భీమ్లా నాయక్ ఎఫెక్ట్: శర్వానంద్ ‘‘ఆడవాళ్లు మీకు జోహార్లు’’ వాయిదా.. గనికి కూడా తప్పదా..?

  • IndiaGlitz, [Sunday,February 20 2022]

శర్వానంద్‌, రష్మిక జంటగా తిరుమల కిషోర్‌ తెరకెక్కిస్తున్న చిత్రం ‘ఆడవాళ్లు మీకు జోహార్లు’ విడుదల వాయిదాపడింది. ఇప్పటికే చిత్రీకరణ పూర్తి చేసుకున్న ఈ సినిమాను ఫిబ్రవరి 25న ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలని మేకర్స్ భావించారు. కానీ, అనివార్య కారణాల వల్ల రిలీజ్‌ను మార్చి 4వ తేదీకి వాయిదా వేశారు. ఈ సినిమాలో ఖుష్బూ, రాధిక శరత్‌ కుమార్‌, ఊర్వశి వంటి సీనియర్ హీరోయిన్లు కీలక పాత్రలు పోషిస్తున్నారు. శ్రీలక్ష్మీ వెంకటేశ్వర సినిమాస్ పతాకంపై సుధాకర్‌ చెరుకూరి నిర్మిస్తున్న ఈ సినిమాకు దేవిశ్రీ ప్రసాద్‌ స్వరాలందిస్తున్నారు.

మంచి కథతో తెరకెక్కుతోన్న కుటుంబ కథా చిత్రమిది. ఇందులో మహిళలకు ఎంతో ప్రాధాన్యముందని.. శర్వా, రష్మికల జంట ఆకట్టుకుంటుందని చిత్ర యూనిట్ అభిప్రాయపడింది. ఒక్క పాట మినహా చిత్రీకరణ మొత్తం ఇప్పటికే పూర్తయిందని... ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నట్లు మేకర్స్ శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. అయితే ఫిబ్రవరి 25న పవర్‌స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన భీమ్లా నాయక్ రిలీజ్ కానుండటంతోనే ఆడవాళ్లు మీకు జోహార్లు వాయిదాపడినట్లుగా గుసగుసలు వినిపిస్తున్నాయి.

మరోవైపు మెగాప్రిన్స్ వరుణ్ తేజ్ హీరోగా కిర‌ణ్ కొర్ర‌పాటి దర్శకత్వంలో ‘గని’ సినిమా కూడా ఫిబ్రవరి 25న రిలీజ్ చేస్తామని నిర్మాతలు ప్రకటించారు. అయితే ఈ సినిమాకు కూడా భీమ్లా నాయక్ ఎఫెక్ట్ పడే అవకాశం పడుతుందేనని గుసగుసలు వినిపిస్తున్నాయి. బాక్సింగ్ నేపథ్యంలో స్పోర్ట్స్ డ్రామాగా తెరకెక్కుతున్న ఈ మూవీలో వరుణ్ తేజ్ బాక్సర్‌గా కనిపించనున్నారు. సయీ మంజ్రేకర్ హీరోయిన్‌గా న‌టిస్తోంది. అల్లు అరవింద్ సమర్పకుడిగా.. అల్లు బాబీ కంపెనీ, రినైస్సన్స్ పిక్చర్స్ పతాకాల‌పై ‘‘గని’’ని సిద్ధు ముద్ద, అల్లు బాబీలు సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఇప్పటికే ఈ మూవీ నుండి విడుదల అయిన ప్రచార చిత్రాలు, వీడియోలు, పాటలు ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నాయి. గతేడాది ప్రేక్షకుల ముందుకు రావాల్సిన గని.. కోవిడ్, లాక్‌డౌన్ తదితర కారణాలతో వాయిదా పడుతూ వచ్చింది.

More News

బూతులు తిట్టి, దాడి చేశారు.. వారిపై చర్యలు తీసుకోండి: పోలీసులకు రైటర్ చిన్ని కృష్ణ ఫిర్యాదు

ప్రముఖ సినీ రచయిత చిన్ని కృష్ణ పోలీసులను ఆశ్రయించడం టాలీవుడ్‌లో కలకలం రేపుతోంది.

నటి నివేతా పేతురాజ్‌ ఇంటి వద్దనే లేజర్‌ - స్కిన్సీ

ఇంటి వద్దనే లేజర్‌ హెయిర్‌ తగ్గింపు  కోసం స్కిన్సీ యొక్క  తాజా ప్రచారం ద్వారా పార్లర్‌కు వెళ్లే ప్రతి అమ్మాయి కష్టాలను వెల్లడిస్తున్న టాలీవుడ్‌ నటి నివేతా పేతురాజ్‌

భీమ్లా నాయక్‌ ప్రీ రిలీజ్ ఈవెంట్.. పవన్ కోసం చీఫ్ గెస్ట్‌గా కేటీఆర్

పవర్‌స్టార్ పవన్‌కళ్యాణ్ హీరోగా నటించిన ‘‘భీమ్లా నాయక్’’ రిలీజ్ డేట్ దగ్గరపడుతుండటంతో చిత్రయూనిట్ ప్రమోషన్ కార్యక్రమాలను వేగవంతం చేసింది.

"వర్జిన్ స్టోరి" యూత్ కు బాగా నచ్చుతోంది - నిర్మాత లగడపాటి శ్రీధర్

నిర్మాత లగడపాటి శిరీష శ్రీధర్ తనయుడు విక్రమ్ సహిదేవ్ హీరోగా నటిస్తున్న సినిమా "వర్జిన్ స్టోరి".

కమిట్మెంట్ ఇస్తేనే ఆఫర్స్ అన్నారు.. కానీ : క్యాస్టింగ్ కౌచ్‌పై ఎస్తర్ వ్యాఖ్యలు

సినిమాల్లో అవకాశాల పేరిట యువతులను లోబరచుకునే ‘‘క్యాస్టింగ్ కౌచ్’’ మరోసారి  తెరపైకి వచ్చింది.