'షకీలా రాసిన మొట్టమొదటి కుటుంబ కథాచిత్రం` ఒక  ప్యూర్ ఫ్యామిలీ ఎంటర్ టైనర్ - న‌టి ష‌కీల

  • IndiaGlitz, [Sunday,February 02 2020]

ష‌కీల ప్రధానపాత్రధారిణిగా విక్రాంత్, పల్లవి ఘోష్ జంటగా 24 క్రాఫ్ట్స్ బ్యానర్ పై సీవీ రెడ్డి సమర్పణలో సి.హెచ్ వెంకట్ రెడ్డి నిర్మాత‌గా సాయిరాం దాసరి దర్శకత్వ పర్యవేక్షణలో సతీష్ వి.ఎన్ దర్శకత్వం వహించిన చిత్రం 'షకీలా రాసిన మొట్టమొదటి కుటుంబ కథాచిత్రం'. ఈ సినిమా ఫస్ట్ గ్లిమ్స్ ఆవిష్కరణ ఆదివారం ఫిల్మ్ చాంబర్లో జరిగింది. ఈ కార్య‌క్ర‌మంలో..

న‌టి షకీల మాట్లాడుతూ - ''నేను నిర్మించిన 'లేడీస్ నాట్ అలౌడ్' సినిమా పది నెలలుగా సెన్సార్ అవడం లేదు. ఎంతో వల్గారిటీతో వచ్చిన సినిమాలు రిలీజ్ అయ్యాయి. కానీ మా సినిమాకే సెన్సార్ వాళ్లు ఎందుకు అభ్యంతరాలు చెపుతున్నారో అర్థం కావడం లేదు. ప్రస్తుతం ట్రిబ్యునల్ లో ఉంది. షకీలా అంటే వల్గారిటీ సినిమాలేనా.. ఫ్యామిలీ సినిమాలు చేయదా అనే విమర్శలున్నాయి. అన్ని రకాల సినిమాలు చేయగలనని నిరూపించడం కోసం కుటుంబ కథాచిత్రంగా ఈ సినిమా చేస్తున్నాను. షకీలా నిర్మాత అంటేనే సెన్సార్ ఇవ్వడం లేదు.. ఇది నేను రాసిన కథ అంటే ఇంకా ఎన్ని ఇబ్బందులు పెడతారో. కానీ ఇది ప్యూర్ ఫ్యామిలీ ఎంటర్ టైనర్స '' అన్నారు.

దర్శకుడు సతీష్ వి.ఎన్ మాట్లాడుతూ - ' కొత్తగా ప్రయత్నించాం. అన్ని వర్గాలకు నచ్చే మంచి ఫ్యామిలీ ఎంటర్టైనర్. ఏప్రిల్ లో విడుదలకు ప్లాన్ చేస్తున్నాం' అని అన్నాడు. హీరో విక్రాంత్ మాట్లాడుతూ 'గత చిత్రం 'లేడీస్ నాట్ అలౌడ్'కి సహనిర్మాతగా పనిచేశాను. ఆ సినిమా విడుదలకు చాలా ఇబ్బందులు పడుతున్నాం. ఈ చిత్ర షూటింగ్ పూర్తయింది. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ జరుగుతోంది. సాయిరాం దాసరి కొత్తగా ప్రయత్నించాడు. కచ్చితంగా ఆకట్టుకుంటుందని నమ్ముతున్నాం' అన్నారు

డిఓపి తరున్ కరామ్‌తోత్ మాట్లాడుతూ - సాయిరాంతో నాలుగు సినిమాలకు పని చేశా. ఈ చిత్రానికి మంచి డైలాగులు అందించడమే కాదు బాగా తెరకెక్కించారు. అందరినీ ఆకట్టుకుంది'అని అన్నారు.

ఈ కార్యక్రమంలో సంగీత దర్శకుడు మిత్ర, నటుడు హర్ష తదితరులు పాల్గొన్నారు.

More News

టిక్‌టాక్: నోట్లో ఇరుక్కున్న మౌత్ ఆర్గాన్.. కక్కలేక..!

సరదా కోసం చేసే పనులు ఒక్కోసారి ప్రాణసంకటమవుతాయి. ఇలాంటి ఘటనలు ఎన్నెన్నో మనం చూసే ఉంటాం.

బాలయ్య పవర్‌ఫుల్ కాదు.. అంత సీన్లేదు.. !?

టాలీవుడ్ ప్రముఖ నటుడు, హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణకు ఇటీవల సొంత నియోజకవర్గంలో చుక్కెదురైన సంగతి తెలిసిందే.

‘దిశ’ నిందితుడి భార్యతో ఆర్జీవీ భేటీ.. కీలక వ్యాఖ్యలు

టాలీవుడ్‌లో సంచలనాలకు కేరాఫ్ అడ్రస్‌గా పేరుగాంచిన దర్శకుడు రామ్ గోపాల్ వర్మ ఇటీవల ఓ ఎమోషనల్ స్క్రిప్టును ఎంచుకున్నానని ట్విట్టర్ వేదికగా ప్రకటించిన సంగతి తెలిసిందే.

'22' టీజ‌ర్ చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంది. సినిమా డెఫినెట్‌గా పెద్ద హిట్ అవుతుంది - కింగ్ నాగార్జున

డాషింగ్‌ డైరెక్టర్‌ పూరి జగన్నాథ్‌, సెన్సేషనల్‌ డైరెక్టర్‌ వి.వి.వినాయక్‌, సూపర్‌ సక్సెస్‌ఫుల్‌ డైరెక్టర్‌ మారుతి వద్ద దర్శకత్వ శాఖలో

కురుమలై లో విక్టరీ వెంకటేష్ 'నారప్ప' యాక్షన్ సీక్వెన్సెస్

'ఎఫ్‌2', 'వెంకీమామ' వంటి వరుస బ్లాక్‌బస్టర్‌ హిట్స్‌తో దూసుకెళ్తోన్న విక్టరీ వెంకటేష్‌ 74వ చిత్రం 'నారప్ప' షూటింగ్‌ అనంత‌పురం జిల్లా ఉర‌వ‌కొండలోని పాల్తూరు గ్రామంలో ప్రారంభమైంది.