‘షకీలా’ ట్రైలర్ విడుదల...

  • IndiaGlitz, [Wednesday,December 16 2020]

ఇంద్రజిత్ లంకేష్ దర్శకత్వంలో రిచా చద్దా.. పంకజ్ తివారి ప్రధాన పాత్రల్లో రూపొందిన బయోపిక్ ‘షకీలా’ ట్రైలర్ నేడు విడుదలైంది. 1990 చివరిలో.. అలాగే 2000 సంవత్సరం ప్రథమార్థంలో పరిశ్రమను కదిలించిన షకీలా నిజ జీవిత కథ ఆధారంగా ఈ చిత్రం రూపొందింది. ప్రేక్షకులకు తెలిసిన రీల్ వ్యక్తిత్వానికి భిన్నమైన నిజ జీవిత కథను ఈ చిత్రం తెలియజేయనుంది. ఆ సమయంలో సూపర్ స్టార్లకు ప్రధానమైన పురుష ఆధిపత్య పరిశ్రమకు గట్టి పోటీనిచ్చింది. 16 ఏళ్ల వయసులో ఇండస్ట్రీకి వచ్చిన ఆమె.. అనతి కాలంలోనే దాదాపు 250 చిత్రాల్లో నటించింది. ఈ చిత్రాన్ని 1000కి పైగా స్క్రీన్లలో చిత్ర నిర్మాతలు విడుదల చేయనున్నారు.

సిల్క్‌స్మిత ఆత్మహత్య సీన్‌తో ట్రైలర్ ప్రారంభమైంది. సిల్క్‌స్మిత మరణం తరువాత షకీలా ఇండస్ట్రీలో ఎలా ఫేమస్ అయ్యింది.. ఆమె ఎదుర్కొన్న పరిస్థితులు.. అవమానాలు.. అన్నింటి ఆధారంగా ఈ సినిమా తెరకెక్కినట్టు ట్రైలర్‌ను బట్టి తెలుస్తోంది. దీని గురించి దర్శకుడు ఇంద్రజిత్ లంకేష్ మాట్లాడుతూ.. ఒక ఐకానిక్ వేలో షకీలాను చూపించడానికి కారణం.. ఆమె ప్రేమ, నిబద్ధతే కారణమన్నారు. ఆమె కథ నథింగ్‌తో మొదలై.. సక్సెస్‌తో ముగియలేదు.. తిరిగి నథింగ్‌గానే మిగిలిపోయిందని తెలిపారు. ఈ సినిమాను నిర్మాతలు భారీగా విడుదల చేసేందుకు ప్లాన్ చేయడంతో ఈ సినిమా పెద్ద ఎత్తున జనానికి చేరుతుందనే నమ్మకం కలిగిందని ఇంద్రజిత్ లంకేష్ వెల్లడించారు.

More News

మెగా ఫ్యామిలీలో త్వరలో మరో పెళ్లి..

మెగా డాటర్ నిహారిక వివాహ వేడుకల ఇటీవలే ముగిసింది. మెగా ఫ్యామిలీ మొత్తం ఆ పెళ్లిలో చేసిన సందడి అంతా ఇంతా కాదు.

రజినీ అభిమానుల్లో ఉన్న ఆనందం.. సాయంత్రానికి ఆవిరి..

సూపర్‌స్టార్‌ రజనీకాంత్‌ రాజకీయ పార్టీ పెడుతున్న విషయం కన్ఫర్మ్ అయిన దగ్గర నుంచి ఊహాగానాలకు కొదువ లేకుండా పోతోంది.

అమెజాన్ అనో.. ఫ్లిప్‌కార్ట్ అనో క్లిక్ చేశారో.. అంతే సంగతులు..

మీ మొబైల్‌కి ఒక మెసేజ్ వస్తుంది. పండుగ సందర్భంగా బ్రాండెడ్ వస్తులపై ఫ్లాట్ 45-60 పర్సెంట్ డిస్కౌంట్ అని..

క్రెడిట్ అంతా వరుణ్‌కే.. నిహారికను అమ్మలాగే చూస్తా: సాయితేజ్

మెగా డాటర్ నిహారిక పెళ్లి విషయమై ఓ ఇంటర్వ్యూలో సాయితేజ్ స్పందించాడు. ముందుగా ఆమె పెళ్లి పనుల గురించి మాట్లాడుతూ..

హగ్ చేసుకున్న అఖిల్, అభి.. సందడిగా సాగిన షో..

‘ట్రెండ్ మారినా.. ఫ్రెండ్ మారడే..’ సాంగ్‌తో షో స్టార్ట్ అయింది. ఆ వెంటనే గీతా మాధురి, హరి తేజ, శ్రీముఖి, అలీ రెజాను చూపించారు.