లక్ష్మీపార్వతిపై లైంగిక వేధింపుల ఫిర్యాదు...
- IndiaGlitz, [Friday,April 05 2019]
దివంగత ముఖ్యమంత్రి, ఆంధ్రుల అన్నగారు ఎన్టీఆర్ రెండో భార్య లక్ష్మీపార్వతి తనను మానసికంగా, లైంగికంగా వేధిస్తున్నారని గుంటూరు జిల్లా వినుకొండకు చెందిన కోటి అలియాస్ ఆనందపాల్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. కాగా ఈ వ్యవహారంపై గత 24 గంటలుగా టీవీ చానెల్స్, సోషల్ మీడియాలో పెద్ద హడావుడి జరుగుతోంది. ఈ వార్త విన్న పలువురు ఇది నిజమా అంటూ షాక్ తిన్నారు. ఫిర్యాదు స్వీకరించిన పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. కాగా కోటి ఫిర్యాదులో పేర్కొన్న విషయాలు యథావిథిగా కింద చెప్పినట్లుగా ఉన్నాయి.
కోటి ఫిర్యాదు ఇదీ...
నాకు ఎన్టీఆర్ ద్రోహం చేశారు. మిస్ యూ.. లవ్ యూ. ఐలవ్యూ కోటి! నన్ను అర్థం చేసుకో! ప్లీజ్ప్లీజ్. వాట్సాప్లో శృంగార దృశ్యాల క్లిప్లు.. పంపించి తనను మానసిక, లైంగిక వేధింపులకు గురి చేస్తోందని ఈ సందేశాలే పక్కా ఆధారాలతో పోలీసులకు ఫిర్యాదు అందింది. గత కొన్ని రోజులుగా లక్ష్మీ పార్వతి తనతో చేసిన వాట్సాప్ చాటింగ్ను.. ముఖ్యంగా మిమ్మల్ని తల్లిగా భావిస్తున్నానన్నా వినలేదని కోటి ఫిర్యాదులో పేర్కొన్నాడు.
సాక్ష్యాలివీ...!
ఏంటి కోటీ.. నా మీద అలిగావా. వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్రెడ్డితో మాట్లాడి నిన్ను రాజకీయాల్లోకి తీసుకొస్తాను. అంతేకాదు అన్ని విధాలు చూసుకుంటాను. పాలిటిక్స్లో పెద్ద వాడిని చేద్దామనుకున్నా. కానీ నువ్వెందుకు ఇలా నన్ను తప్పుగా అర్థం చేసుకుంటున్నావు. (పోర్న్ వీడియోస్ గురించి) నేను ప్రేమతో పంపిస్తే వేధింపుల్లాగా ఉన్నాయా కోటీ.. ఎందుకిలా చేస్తున్నావ్. లవ్యూ కోటీ! మిస్ యూ! ఇంట్లో రిలేటివ్స్ ఉండటం వల్ల నీతో మాట్లాడలేకపోతున్నాను. నాలుగు రోజుల నుంచి నీ గురించి ఆలోచించి.. ఆలోచించి.. నిద్ర లేక ఆరోగ్యం కూడా పాడైపోయింది. మీ ఫ్యామిలీపై చూపించే ప్రేమలో నాకు 20 శాతం చూపించవచ్చుగా కోటీ అని తనకు లక్ష్మీపార్వతి మెసేజ్ చేశారని కోటీ పక్కా సాక్ష్యాలను పోలీసులకు అందించారు.
పోలీసులు ఎలా ముందుకెళ్తారు..?
తాను నాలుగేళ్ల క్రితం లక్ష్మీ పార్వతి పరిచయమయ్యారని.. తనకు మీరు తల్లితో సమానం అని చెప్పినా వినకుండా ఇబ్బంది పెడుతున్నారని కోటీ ఫిర్యాదులో పేర్కొన్నాడు. తనకు ఆమె నుంచి రక్షణ కల్పించి, లక్ష్మీపార్వతిపై దర్యాప్తు జరిపించాలని ఆయన ఫిర్యాదులో పేర్కొన్నారు. అయితే ఈ వ్యవహారంపై పోలీసులు ఎలా ముందుకెళ్తారో..? అనేది తెలియాల్సి ఉంది. అయితే ఇందులో నిజానిజాలెంత..? నిజంగానే లక్ష్మీపార్వతే వాట్సాప్లో కోటీతో చాటింగ్ చేశారా..? లేకుంటే ఫేక్కా..? ఎన్నికల టైమ్లో ఇదొక స్టంటా..?అనే కోణంలో పోలీసులు దర్యాప్తు మొదలుపెట్టినట్లుగా తెలుస్తోంది. మొత్తానికి చూస్తే 24గంటల్లో ఆమెను విచారించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.