పవర్ స్టార్ కోసం అల్యూమినియం ఫ్యాక్టరీలో సెట్..

  • IndiaGlitz, [Thursday,January 07 2021]

పవర్ స్టార్ పవన్‌ కల్యాణ్‌, రానా దగ్గుబాటి కాంబినేషన్‌లో సితార ఎంటర్‌టైన్‌మెంట్స్‌ ఓ సినిమా నిర్మించనున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా షూటింగ్‌కు ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఈ నెల 20 తర్వాత ఆ సినిమా రెగ్యులర్‌ చిత్రీకరణను ప్రారంభించనున్నారు. పవర్ స్టార్ షూటింగ్ కోసం హైదరాబాద్‌లోని అల్యూమినియం ఫ్యాక్టరీ సిద్ధమవుతోంది. ఈ ఫ్యాక్టరీలోనే చిత్ర యూనిట్ ఓ లాడ్జి సెట్‌ వేస్తున్నారు. శరవేగంగా పనులన్నీ పూర్తి చేసి సినిమాను సెట్స్‌పైకి తీసుకెళ్లేందుకు యత్నం జరుగుతోంది. ఈ సెట్‌లోనే పవన్, రానాలపై కీలక సన్నివేశాలను తెరకెక్కించనున్నారని టాక్ నడుస్తోంది.

పవన్ సినిమా తొలి షెడ్యూల్.. 25 రోజులు లాడ్జి సెట్‌లో కీలక సన్నివేశాలు తెరకెక్కించడానికి దర్శకుడు సాగర్‌ కె. చంద్ర సన్నాహాలు చేస్తున్నారు. ఈ సినిమాలో పవన్‌కి జోడీగా సాయి పల్లవి కనిపించనుంది. తొలి షెడ్యూల్‌లో సాయి పల్లవి సైతం పాల్గొంటుందని సమాచారం. మలయాళ చిత్రం ‘అయ్యప్పనుమ్‌ కోషియుమ్‌’కి రీమేక్‌గా ఈ సినిమా రూపొందనుంది‌. అయితే మన నేటివిటీకి తగ్గట్టుగా ఈ సినిమాలో పలు మార్పులు చేర్పులు చేస్తున్నట్టు టాక్ నడుస్తోంది.

పి.డి.వి. ప్రసాద్‌ సమర్పణలో సూర్యదేవర నాగవంశీ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ చిత్రానికి తమన్‌ సంగీతం అందించనున్నారు. ఈ సినిమా సెకండ్ షెడ్యూల్ పొలాచ్చిలో జరగనున్నట్టు తెలుస్తోంది. అక్కడ ముఖ్యమైన సన్నివేశాలను చిత్రీకరించనున్నట్టు సమాచారం. ఈ సినిమాతోపాటే పవర్ స్టార్.. క్రిష్ దర్శకత్వంలో సినిమాను కూడా ప్రారంభించాల్సి ఉంది. కానీ క్రిష్‌కు కరోనా పాజిటివ్ రావడంతో ఆ సినిమా షూటింగ్ కొద్ది రోజుల పాటు వాయిదా పడింది. క్రిష్‌కు కరోనా నుంచి కోలుకున్న వెంటనే.. ఈ సినిమా షూటింగ్ కూడా ప్రారంభమయ్యే అవకాశం ఉంది.

More News

మ‌హేశ్ అభిమానిగా మారిన అక్కినేని హీరో..!

ఇప్పుడున్న యువ హీరోలు అగ్ర క‌థానాయ‌కుల అభిమానులుగా కనిపించ‌డం స‌ర్వ సాధార‌ణ‌మైన విష‌యంగా మారింది.

కేంద్ర ప్రభుత్వానికే ఝలక్ ఇచ్చిన కేటుగాళ్లు..

కేంద్ర ప్రభుత్వానికి ఝలక్ ఇవ్వాలంటే ఎన్ని గట్స్ ఉండాలి? కానీ ఇచ్చేశారు కొందరు కేటుగాళ్లు.

విజయ్‌ ఫ్యాన్స్‌కు సెంట్రల్‌ షాక్‌.. నిరుత్సాహంలో కోలీవుడ్‌

కోలీవుడ్‌ అగ్ర హీరోల్లో విజయ్‌ ఒకడు. ఈయన సినిమాలకు ఉండే కలెక్షన్సే వేరు. ఆదరణే వేరు. ఈయన లేటెస్ట్‌ మూవీ 'మాస్టర్‌'.

సినిమా ఛాన్స్ కొట్టేసిన అఖిల్ సార్థక్‌!

బిగ్‌బాస్ తెలుగు ఇప్పటికి నాలుగు సీజన్లను కంప్లీట్ చేసుకుంది. అయితే గత మూడు సీజన్ల విషయానికి వస్తే కంటెస్టెంట్లకు బిగ్‌బాస్ కారణంగా పెద్దగా ఒరిగిందేమీ లేదు.

కేజీఎఫ్ 2: అధీర ఎలా బతికున్నాడు?

బాహుబలిని కట్టప్ప ఎందుకు చంపాడు? అనే ప్రశ్న ఎంత సెన్సేషన్‌ను క్రియేట్ చేసిందో... ప్రస్తుతం అధీర ఎలా బతికున్నాడు? అనే ప్రశ్న కూడా అంతే సెన్సేషన్‌ను క్రియేట్ చేస్తోంది.