మహేష్ కి స్టోరీ లైన్ చెప్పిన సంచలన దర్శకుడు

  • IndiaGlitz, [Saturday,January 20 2018]

అర్జున్ రెడ్డి' సినిమాతో తెలుగు ఇండస్ట్రీతో పాటు.. ఇత‌ర ప‌రిశ్ర‌మ‌ల దృష్టిని కూడా తన వైపు తిప్పుకున్న డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగ. ఈ సినిమా సంచలన విజయం సాధించడంతో.. ఈ దర్శకుడితో సినిమాలు చేయడానికి ప్ర‌ముఖ‌ నిర్మాతలు, హీరోలు కూడా ఆస‌క్తిగా ఎదురుచూస్తున్నారు. కాగా... అర్జున్ రెడ్డి' సినిమాని హిందీలో రీమేక్ చేయడానికి సందీప్ సిద్ధపడిపోయారు.

బాలీవుడ్ హీరో అర్జున్ కపూర్ కథానాయకుడిగా ఈ సినిమాని తెరకెక్కిస్తున్నార‌ని హిందీ చిత్ర వ‌ర్గాలు పేర్కొంటున్నాయి. వచ్చే నెల నుంచి రెగ్యులర్ షూటింగ్ కూడా జరుపుకోనుంది ఈ చిత్రం. ఇదిలా ఉంటే....తాజాగా మహేష్ బాబుకి సందీప్ ఒక స్టోరీ లైన్ వినిపించారని సమాచారం. అది నచ్చి పూర్తి స్థాయిలో కథను సిద్ధం చేసుకోమని మహేష్ కూడా చెప్పారంట. వంశీ పైడిపల్లి సినిమా తర్వాత ఈ చిత్రాన్ని పట్టాలెక్కించే అవకాశాలున్నట్లు తెలుస్తోంది. ఈ లోగా అర్జున్ రెడ్డి' హిందీ రీమేక్ కూడా పూర్తి చేసుకుని...మహేష్ కోసం సిద్ధంచేసిన కథపై సందీప్ పూర్తిగా దృష్టి పెట్టనున్నట్లు సన్నిహిత వర్గాలు వెల్లడిస్తున్నాయి.

More News

అంతరిక్ష నేపథ్యం..రూ.25 కోట్లు

‘ఘాజీ’సినిమాతో ఇండస్ట్రీ దృష్టిని తన వైపు తిప్పుకున్న నవతరం దర్శకుడు సంకల్ప్ రెడ్డి.

ఆ వార్త‌ల‌ను ఖండించిన నాని

ఎవ‌డే సుబ్ర‌మ‌ణ్యంతో మొద‌లైన నాని విజ‌య‌యాత్ర ఎంసీఏ వ‌ర‌కు స‌క్సెస్‌ఫుల్‌గా ర‌న్ అయిన సంగ‌తి తెలిసిందే. ప్ర‌స్తుతం ఆయ‌న కృష్ణార్జున యుద్ధం అనే సినిమా చేస్తున్నారు. ఇందులో నాని రెండు పాత్ర‌ల్లో సంద‌డి చేస్తున్నారు. ఒక పాత్ర కృష్ణ కాగా.. మ‌రో పాత్ర అర్జున‌. ఈ రెండు పాత్ర‌ల ఫ‌స్ట్ లుక్స్‌ని సంక్రాంతి సంద‌ర్భంగా విడుద‌ల చేశారు. వ

విజయకృష్ణ పేరుతో ట్రస్ట్ ఆరంభించి అవసరార్ధులను ఆదుకొంటాను - సీనియర్ నరేష్

సీనియర్ నరేష్ పుట్టిన రోజు వేడుకలు శనివారం హైదరాబాద్ లోని నానాక్ రామ గూడలోని కృష్ణ నివాసంలో అభిమానులు మరియు 'మా' సభ్యుల నడుమ ఘనంగా జరిగాయి.

'ఆచారి అమెరికా యాత్ర' ఆడియో మరియు ట్రైలర్ విడుదల

విష్ణు మంచు హీరోగా నటించిన 'ఆచారి అమెరికా యాత్ర' చిత్రం రిపబ్లిక్ డే సందర్భంగా జనవరి 26న విడుదల కానున్నది.

సాయిధరమ్ తేజ్ - వినాయక్ 'ఇంటెలిజెంట్' రిలీజ్ డేట్

సుప్రీమ్ హీరో సాయిధరమ్ తేజ్ కథానాయకుడిగా సి.కె.ఎంటర్ టైన్ మెంట్స్ ప్రై.లిమిటెడ్ పతాకంపై సెన్సేషనల్ డైరెక్టర్ వి.వి.వినాయక్ దర్శకత్వంలో ప్రముఖ నిర్మాత సి.కళ్యాణ్ నిర్మిస్తున్న భారీ చిత్రం 'ఇంటెలిజెంట్'. ఈ చిత్రాన్ని ఫిబ్రవరి 9న విడుదల చేయడానికి సన్నాహాలు జరుగుతున్నాయి.