KCR, Revanth Reddy:కామారెడ్డిలో సంచలనం.. కేసీఆర్, రేవంత్‌ రెడ్డి ఓటమి..

  • IndiaGlitz, [Sunday,December 03 2023]

కామారెడ్డి నియోజకవర్గంలో సంచలనం నమోదైంది. ఈ నియోజకవర్గం నుంచి పోటీ చేసిన సీఎం కేసీఆర్, టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డిలపై బీజేపీ అభ్యర్థి వెంటక నారాయణ రెడ్డి ఘన విజయం సాధించారు. 6వేల ఓట్లతో గెలిచిన ఆయన చరిత్ర సృష్టించారు. హేమాహేమీ నాయకలైన కేసీఆర్, రేవంత్ రెడ్డిని కాదని ఓటర్లు కాషాయం అభ్యర్థికి ఓట్లు వేయడం చర్చనీయాంశమైంది. కేసీఆర్, రేవంత్ ఇద్దరు తమ సొంత నియోజకవర్గాలతో పాటు ఇక్కడ కూడా పోటీ చేశారు. అయితే వెంకటనారాయణ రెడ్డి స్థానికుడు కావడంతో ఓటర్లు ఆయన వైపు మొగ్గుచూపారు.

కౌంటింగ్ మొదలైన దగ్గరి నుంచి కేసీఆర్ వెనుకంజలోనే కొనసాగుతున్నారు. ఇక రేవంత్ రెడ్డి మాత్రం 13 రౌండ్ల వరకు ఆధిక్యంలో కొనసాగారు. 14వ రౌండ్ నుంచి బీజేపీ అభ్యర్థి ముందంజలోకి వచ్చారు. అప్పటి నుంచి ఆయనే ఆధిక్యం కొనసాగిస్తూ చివరకు 6వేల ఓట్ల తేడాతో గెలుపొందారు. ఇక రేవంత్ రెడ్డి కొడంగల్ నుంచి గెలుపొందగా.. కేసీఆర్ గజ్వేల్ నుంచి విజయం సాధించారు. వీరిద్దరిలో ఎవరు గెలిచినా ఇక్కడ ఉప ఎన్నికల వచ్చేది. కానీ కమలం పార్టీ గెలవడంతో బై ఎలక్షన్‌కు అవకాశం లేకుండా పోయింది. ఈ విజయంతో కలిపి బీజేపీ అభ్యర్థులు మొత్తం 8 స్థానాల్లో గెలుపొందారు. గతంలో కంటే 7 స్థానాలు గెలిచి ఓటు బ్యాంక్ పెంచుకున్నారు.

అయితే బీజేపీ ముఖ్య నేతలైన బండి సంజయ్ కరీంనగర్ నుంచి, ధర్మపురి అరవింద్ కోరుట్ల నుంచి, సోయం బాపూరావు బోథ్ నుంచి, రఘునందన్ రావు దుబ్బాక నుంచి, ఈటల రాజేందర్ హుజురాబాద్, గజ్వేల్ నియోజకవర్గాల నుంచి ఓడిపోవడం కాషాయం కార్యకర్తల్లో నిరుత్సాహం నింపింది.

More News

KTR:ప్రతిపక్ష పాత్ర సమర్థవంతంగా పోషిస్తాం: కేటీఆర్

తెలంగాణ ప్రజలు ఇచ్చిన తీర్పును గౌరవిస్తున్నామని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తెలిపారు.

Telangana DGP:తెలంగాణ డీజీపీపై వేటు.. ఈసీ సంచలన నిర్ణయం..

తెలంగాణ ఫలితాల అనంతరం కేంద్ర ఎన్నికల సంఘం సంచలన నిర్ణయం తీసుకుంది. రాష్ట్ర డీజీపీ అంజనీకుమార్ పై సస్పెన్షన్ వేటు వేసింది.

KTR:ఎన్నికల ఫలితాలపై స్పందించిన కేటీఆర్.. తమ గురి తప్పిందని ట్వీట్..

తెలంగాణ ఎన్నికల ఫలితాలపై మంత్రి కేటీఆర్ స్పందించారు. తాజా ఫలితాలు నిరాశ కలిగించాయని..

BJP Candidates:గెలుపొందిన బీజేపీ అభ్యర్థులు వీరే..

గత ఎన్నికల్లో కంటే ఈసారి బీజేపీ అభ్యర్థులు ఎక్కువ స్థానాల్లో విజయం సాధించారు. ఇప్పటివరకు 5 స్థానాల్లో ఆ పార్టీ అభ్యర్థులు గెలుపొందగా..

Revanth Reddy, Komati Reddy:కొడంగల్‌లో రేవంత్ రెడ్డి.. నల్గొండలో కోమటిరెడ్డి ఘన విజయం

టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి కొడంగల్‌లో భారీ మెజార్టీతో గెలిచారు. బీఆర్ఎస్ అభ్యర్థి పట్నం నరేందర్ రెడ్డిపై 32,800ఓట్ల తేడాతో ఘన విజయం సాధించారు.