Venu Father: సీనియర్ నటుడు వేణు ఇంట్లో విషాదం.. ఆయన తండ్రి కన్నుమూత

  • IndiaGlitz, [Monday,January 29 2024]

సీనియర్ నటుడు వేణు తొట్టెంపూడి(Venu Thottempudi) కుటుంబలో విషాదం నెలకొంది. ఆయన తండ్రి ప్రొఫెసర్ తొట్టెంపూడి వెంకటసుబ్బారావు ఇవాళ ఉదయం కన్నుమూశారు. ప్రస్తుతం ఆయనకు 92 సంవత్సరాలు. వయోభారం నేపథ్యంలో అనారోగ్య సమస్యలతో తుదిశ్వాస విడిచారు. పలువురు సినీ ప్రముఖులు ఆయనకు నివాళులు అర్పించారు. వెంకట సుబ్బారావు భౌతికకాయాన్ని ప్రముఖుల సందర్శనార్ధం ఉదయం 9 గంటల నుండి మధ్యాహ్నం 12 గంటల వరకు హైదరాబాద్ శ్రీనగర్ కాలనీ, స్టీల్ & మైన్స్ కాంప్లెక్స్ వద్ద ఉంచారు. జూబ్లీహిల్స్ మహాప్రస్థానంలో అంత్యక్రియలు నిర్వహించనున్నారు.

ప్రకాశం జిల్లాకు చెందిన వేణు ‘స్వయంవరం’ సినిమాతో టాలీవుడ్‌లో హీరోగా అడుగుపెట్టారు. తొలి చిత్రంతోనే సూపర్ హిట్ అందుకుని హీరోగా గ్రాండ్‌గా అడుగుపెట్టారు. ఆ తర్వాత చిరునవ్వుతో, పెళ్లాం ఊరెళితే, హనుమాన్ జంక్షన్, కల్యాణరాముడు, చెప్పవే చిరుగాలి, శ్రీకృష్ణ 2006, అల్లరే అల్లరి, గోపి గోపిక గోదావరి వంటి హిట్ సినిమాల్లో నటించి ప్రత్యేక స్థానం దక్కించుకున్నాడు.

తర్వాత బోయపాటి శ్రీను దర్శకత్వంలో జూనియర్ ఎన్టీఆర్ హీరోగా నటించిన 'దమ్ము' సినిమాలో ఓ కీలక పాత్ర పోషించారు. అయితే ఆ సినిమా కూడా ఆశించిన స్థాయిలో విజయం సాధించకపోవడంతో మళ్లీ మూవీలకు దూరం అయ్యాడు. ఇక ఇటీవల రవితేజ నటించిన 'రామారావు ఆన్ డ్యూటీ' చిత్రం ద్వారా మళ్లీ ఎంట్రీ ఇచ్చాడు. తాజాగా ఓటీటీలో 'అతిథి' అనే వెబ్ సిరీస్‌తో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు.

More News

Galla Jayadev: రాజకీయాలకు టీడీపీ ఎంపీ గల్లా జయదేవ్ గుడ్ బై.. ఎందుకంటే..?

రాజకీయాల నుంచి తప్పుకుంటున్నట్లు గుంటూరు టీడీపీ ఎంపీ గల్లా జయదేవ్ సంచలన ప్రకటన చేశారు. ప్రస్తుత రాజకీయాల్లో ఇమడలేకపోతున్నానని ప్రకటించారు.

బీహార్ సీఎం పదవికి నితీశ్ కుమార్ రాజీనామా.. NDAలో చేరేందుకు సిద్ధం..

ఊహించిందే జరిగింది. లోక్‌సభ ఎన్నికల వేళ కీలక పరిణామం చోటుచేసుకుంది. అందరూ అనుకున్నట్లుగానే బీహార్ సీఎం పదవికి నితీశ్ కుమార్ రాజీనామా చేశారు. రాజ్‌భవన్‌లో గవర్నర్ రాజేంద్ర విశ్వనాథ్‌కు తన రాజీనామా

Telangana Good News:తెలంగాణ ఆడబిడ్డలకు శుభవార్త.. త్వరలోనే నగదుతో పాటు తులం బంగారం..

ఎన్నికల ప్రచారంలో భాగంగా ఇచ్చిన హామీలను ఒక్కోక్కటిగా అమలుచేసే దిశగా సీఎం రేవంత్ రెడ్డి(Revanth Reddy)అడుగులు వేస్తున్నారు.

CM Jagan:అభిమన్యుడిని కాదు అర్జునుడిని.. ఎన్నికల శంఖారావం పూరించిన జగన్..

ఉత్తరాంధ్ర వేదికగా సీఎం జగన్ ఎన్నికల శంఖారావం పూరించారు. విశాఖ జిల్లా భీమిలి నియోజకవర్గంలోని

Chandrababu:జగన్‌ని ఓడించేందుకు జనం కూడా సిద్ధంగా ఉన్నారు: చంద్రబాబు

వచ్చే ఎన్నికల్లో జగన్‌ని ఓడించేందుకు జనం సిద్దంగా ఉన్నారని టీడీపీ అధినేత చంద్రబాబు తెలిపారు.