రోజాకు రెండు మేజర్ సర్జరీలు : వెల్లడించిన సెల్వమణి

  • IndiaGlitz, [Monday,March 29 2021]

నగరి ఎమ్మెల్యే రోజాకు సడెన్‌గా ఏమైందో తెలియదు కానీ ఆమె ఒకటి కాదు రెండు అది కూడా మేజర్ సర్జరీలు చేయించుకున్నారని ఆమె భర్త సెల్వమణి ఓ ఆడియో వాయిస్‌ను విడుదల చేశారు. చెన్నైలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో రోజాకు ఈ ఆపరేషన్లు జరిగాయని ఆయన వెల్లడించారు. ప్రస్తుతం రోజా కోలుకుంటున్నారని.. ఐసీయూ నుంచి సోమవారం వార్డుకు తరలించారని చెప్పారు. మరో రెండు వారాల పాటు రోజాకు పూర్తి విశ్రాంతి తీసుకుంటారని వెల్లడిస్తూ సెల్వమణి ఆమె ఆరోగ్యంపై ఆడియో టేప్ విడుదల చేశారు.

నిజానికి రోజాకు ఇది వరకే ఈ ఆపరేషన్లు నిర్వహించాల్సి ఉందట. కానీ గతేడాది కరోనా, జనవరిలో ఎన్నికల కారణంగా వాయిదా వేశారని సెల్వమణి వెల్లడించారు. ప్రస్తుతం ఆమె ఆరోగ్యం కుదుటపడుతోందని.. క్రమంగా కోలుకుంటున్నారని సందర్శకులు ఎవ్వరూ ఆసుపత్రికి రావొద్దని విజ్ఞప్తి చేశారు. రోజా ఆరోగ్య పరిస్థితిపై నియోజకవర్గ ప్రజానీకం ఆందోళన చెందవద్దని పేర్కొన్నారు. అయితే అసలు రోజాకు ఏమైంది? ఏ సర్జరీలు చేయించుకున్నారన్నది మాత్రం సెల్వమణి వెల్లడించలేదు.

More News

లగ్జరీ కారు కొన్న ప్రభాస్.. దాని ధర ఎంతో తెలిస్తే...

‘బాహుబలి’ సినిమాతో యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ రేంజే మారిపోయింది. ఆ తరువాత చేసిన ‘సాహో’ తెలుగు ప్రేక్షకులను అంతగా ఆకట్టుకోలేకపోయినా కూడా ఉత్తరాది ప్రేక్షకులకు మాత్రం బాగా దగ్గరయ్యారు.

తెలంగాణ మంత్రి మిస్సింగ్.. ఎక్కడికి వెళుతున్నారనేది సస్పెన్స్!

సీఎం కేసీఆర్‌ కేబినెట్‌లోని సీనియర్‌ మంత్రి ఒకరు తప్పిపోయారు. ఎక్కడికి వెళ్లారు? ఏంటనేది మాత్రం సస్పెన్స్.

విజయనగరంలో రెండు బస్సులు, లారీ ఢీ.. ఐదుగురి మృతి

అతివేగంతో పాటు.. డంపింగ్ యార్డులో చెత్త తగులబెట్టడం వెరసి పెను ప్రమాదానికి కారణమయ్యాయి.

పవన్ ఫ్యాన్స్‌కి బంపరాఫర్.. ట్రైలర్ రిలీజ్ వారి చేతుల మీదుగానే..

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కొత్త సినిమా ‘వకీల్ సాబ్’ ట్రైలర్ రిలీజ్‌కు కౌంట్ డౌన్ మొదలైంది. ఈసారి పవన్ తన అభిమానులకు బంపర్ ఆఫర్ ఇచ్చారు.

`హిట్ 2` వ‌దులుకోడానికి కార‌ణం చెప్పిన విష్వ‌క్ సేన్‌

యువ క‌థానాయ‌కుల్లో విష్వ‌క్ సేన్ త‌న‌దైన గుర్తింపును సంపాదించుకుని అంద‌రి దృష్టిని ఆక‌ర్షించాడు.