అదే హీరోయిన్‌తో క‌మ్ముల‌...

  • IndiaGlitz, [Tuesday,August 07 2018]

ఫీల్ గుడ్ మూవీలు చేసే ద‌ర్శ‌కుల్లో శేఖ‌ర్ క‌మ్ముల ఒక‌రు. గ‌త ఏడాది ఫిదాతో మంచి స‌క్సెస్‌ను త‌న ఖాతాలో వేసుకున్నారు శేఖ‌ర్ క‌మ్ముల‌. ఇప్పుడు మ‌రో సినిమాకి రంగం సిద్ధం చేస్తున్నారు. ఈ సినిమాలో హీరో విక్ర‌మ్ త‌న‌యుడు ధృవ్ హీరోగా న‌టిస్తున్నాడు.

కాగా సినిమాలో హీరోయిన్‌గా సాయిప‌ల్ల‌విని నటింప చేయ‌డానికి శేఖ‌ర్ క‌మ్ముల ప్ర‌య‌త్నిస్తున్నారు. రీసెంట్‌గా క‌థ విన్న సాయి ప‌ల్ల‌వి కూడా న‌టించ‌డానికి ఆస‌క్త‌గానే ఉంద‌ని స‌మాచారం. శేఖ‌ర్ క‌మ్మ‌ల స్వీయ నిర్మాణ ద‌ర్శ‌క‌త్వంలో రూపొంద‌బోయే ఈ సినిమా అక్టోబ‌ర్‌లో ప్రారంభం కానుంద‌ని వార్త‌లు విన‌ప‌డుతున్నాయి.