శేఖ‌ర్ క‌మ్ముల హీరోల మ‌ధ్య పోటీ

  • IndiaGlitz, [Sunday,December 10 2017]

ఫీల్ గుడ్ ఎంట‌ర్‌టైన‌ర్‌ల‌కి పెట్టింది పేరు.. ద‌ర్శ‌కుడు శేఖ‌ర్ క‌మ్ముల‌. ఈ జోన‌ర్‌లో ఆయ‌న రూపొందించిన ఆనంద్‌, గోదావ‌రి, హ్యాపీడేస్‌, ఫిదా మంచి విజ‌యం సాధించాయి. అంతేకాకుండా.. ఆయా చిత్రాల్లో న‌టించిన హీరోల‌కు కూడా మంచి పేరు వ‌చ్చింది. ఆ హీరోల‌లో నిఖిల్‌, వ‌రుణ్ తేజ్ కూడా ఉంటారు.

హ్యాపీ డేస్‌తో నిఖిల్‌కి మంచి పేరు వ‌స్తే.. ఫిదాతో వ‌రుణ్‌కి మంచి గుర్తింపు వ‌చ్చింది. వీరిద్ద‌రికి తొలి స‌క్సెస్ వ‌చ్చింది శేఖ‌ర్ క‌మ్ముల సినిమాల‌తోనే. అలాంటి ఈ హీరోల సినిమాలు ఒకే రోజు బాక్సాఫీస్ వ‌ద్ద బ‌రిలోకి దిగుతున్నాయి. కాస్త వివ‌రాల్లోకి వెళితే.. క‌న్న‌డంలో విజ‌యం సాధించిన కిర్రిక్ పార్టీ ఆధారంగా రూపొందిన‌ నిఖిల్ తాజా చిత్రం కిర్రక్ పార్టీ.

ఈ సినిమా ఫిబ్ర‌వ‌రి 9న ప్రేక్ష‌కుల ముందుకు రానుంది. స‌రిగ్గా అదే రోజున వ‌రుణ్ తేజ్ న‌టించిన కొత్త చిత్రం తొలి ప్రేమ రానుంది. విశేష‌మేమిటంటే.. ఈ రెండు చిత్రాలు కూడా కొత్త ద‌ర్శ‌కులు తెర‌కెక్కిస్తున్న సినిమాలు కావ‌డం. కిర్ర‌క్ పార్టీని ష‌ర‌న్ కొప్పిశెట్టి తెర‌కెక్కిస్తుంటే.. తొలిప్రేమ‌ని వెంకీ అట్లూరి రూపొందిస్తున్నాడు. మ‌రి.. ఈ రెండు చిత్రాల్లో ఏ సినిమాకి విజ‌యం ద‌క్కుతుందో చూడాలి.

More News

రెండొ వారంలొకి అడుగుపెట్టిన 'ఇంద్రసేన'

పక్కా కమర్షియల్ సినిమాలకు, ప్యామిలీ సెంటిమెంట్ సినిమాలకు ఉండే ప్రధానమైన తేడా తొలివారం వసూళ్లె. టాక్ తో సంబంధం లేకుండా తొలివారం కమర్షియల్ సినిమాలు భారీ ఓపెనింగ్స్ ను సాధిస్తే.. మౌత్ టాక్ తో రొజురొజుకు పుంజుకునె ప్యామిలీ సినిమాలు లాంగ్ రన్ తో సక్సెస్ఫుల్ మూవీగా నిలుస్తున్నాయి.

కృష్ణ‌వంశీ మ‌ల్టీస్టార‌ర్‌

క్రియేటివ్ డైరెక్ట‌ర్‌గా పేరున్న కృష్ణ‌వంశీకి ఈ మ‌ధ్య కాలం క‌లిసి రావ‌డం లేదు. ఆయ‌న చేసిన సినిమాలేవీ బాక్సాఫీస్ వ‌ద్ద పెద్ద‌గా క‌లిసి రావ‌డం లేదు. ఆయ‌న ద‌ర్శ‌క‌త్వంలో వ‌చ్చిన రీసెంట్ మూవీ న‌క్ష‌త్రం బాక్సాఫీస్ వ‌ద్ద అట్ట‌ర్ ప్లాప్ టాక్‌ను తెచ్చుకుంది.

2.0 నిర్మాత‌ల కేసు..

దాదాపు 450 కోట్ల బ‌డ్డెట్‌తో రూపొందుతోన్న విజువ‌ల్ వండ‌ర్ '2.0'. ర‌జ‌నీకాంత్‌, అక్ష‌య్‌కుమార్‌, ఎమీజాక్స‌న్ ప్ర‌ధాన తారాగ‌ణంగా న‌టించారు. ప్ర‌స్తుతం ఈ సినిమా నిర్మాణానంత‌ర కార్య‌క్ర‌మాల‌ను జ‌రుపుకుంటుంది.

సాయిధరమ్, కరుణాకరన్ మూవీ అప్ డేట్స్

తాజాగా జవాన్చిత్రంతో పలకరించాడు యువ కథానాయకుడు సాయిధరమ్ తేజ్. ఈ చిత్రంలో సాయిధరమ్ నటనకి మంచి రెస్పాన్స్ వచ్చింది. ప్రస్తుతం వి.వి.వినాయక్ దర్శకత్వంలో ఇంటెలిజెంట్ సినిమా చేస్తున్నాడు సాయి.

నాగశౌర్య 'ఛలో' వాయిదా

నాగశౌర్య, రష్మిక మండన్నా హీరో హీరోయిన్లుగా నటించిన చిత్రం `ఛలో`. తమిళనాడు, ఆంధ్ర బోర్డర్లో రెండు గ్రామాల మధ్య జరిగే ఓ గొడవ నేపథ్యంలో సాగే సినిమా ఇది.