'సైరా నరసింహా రెడ్డి' కోసం రెండోసారి..

  • IndiaGlitz, [Sunday,April 15 2018]

మెగాస్టార్ చిరంజీవి క‌థానాయ‌కుడిగా సురేందర్ రెడ్డి దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమా ‘సైరా నరసింహా రెడ్డి’. నయనతార కథానాయికగా నటిస్తున్న ఈ చిత్రంలో అమితాబ్ బచ్చన్, జగపతి బాబు, విజయ్ సేతుపతి, కిచ్చా సుదీప్ ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. ఈ సినిమాని మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ నిర్మిస్తున్నారు. ప్రస్తుతం ఈ సినిమా శరవేగంగా చిత్రీకరణ జరుపుకుంటోంది. ఇదిలా ఉంటే.. ఈ సినిమాలో మిల్కీ బ్యూటీ త‌మన్నా కూడా నటిస్తోందని గ‌త కొద్ది రోజులుగా వార్తలు వస్తున్నాయి.

ఇందులో ఆమె చిరుకి జోడీగా సెకండ్ హీరోయిన్‌గా కనిపించనుందని అంతా అనుకున్నారు. అయితే.. చిరుకి జంట‌గా కాకుండా  తమిళ నటుడు విజయ్ సేతుపతికి జంట‌గా త‌మ‌న్నా నటిస్తోంద‌ని తెలిసింది. గతంలో తమిళ చిత్రం ‘ధర్మదురై’ (2016) కోసం తమన్నా, విజయ్ సేతుపతి జంటగా నటించారు. మళ్ళీ ఇప్పుడు ‘సైరా’ కోసం వీరిద్దరూ జంటగా నటించ‌నున్నార‌న్న‌మాట‌. ఈ సినిమాలో వీరిద్దరి పాత్ర తీరు తెన్నులేమిటనే విష‌యంపై త్వరలోనే క్లారిటీ రానుంది. కాగా.. ఈ చిత్రాన్ని వచ్చే ఏడాదిలో ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు.

More News

పూరి జగన్నాథ్‌ కెరీర్‌లో 'మెహబూబా' వన్‌ ఆఫ్‌ ది బెస్ట్‌ మూవీ అవుతుంది - నిర్మాత దిల్‌ రాజు

డాషింగ్‌ డైరెక్టర్‌ పూరి జగన్నాథ్‌ తన తనయుడు ఆకాష్‌ పూరిని హీరోగా పరిచయం చేస్తూ పూరి జగన్నాథ్‌

'మహానటి' టీజర్ మరియు కీర్తి సురేష్ ఫస్ట్ లుక్ విడుదల

తెలుగు చలన చిత్ర చరిత్రలో సావిత్రి గారి స్థానం అమరం.

కింగ్‌ నాగార్జున సరసన ఆకాంక్ష సింగ్‌

కింగ్‌ నాగార్జున, నేచురల్‌ స్టార్‌ నాని హీరోలుగా వైజయంతి మూవీస్‌ పతాకంపై టి.శ్రీరామ్‌ఆదిత్య దర్శకత్వంలో అగ్ర నిర్మాత సి.అశ్వనీదత్‌ భారీ మల్టీస్టారర్‌ నిర్మిస్తున్న విషయం తెలిసిందే.

'జంబ‌ల‌కిడి పంబ‌' ఫ‌స్ట్ లుక్ లాంచ్ చేసిన డా.వి.కె.న‌రేశ్‌!

'జంబ‌ల‌కిడి పంబ‌' అనే పేరు విన‌గానే న‌రేశ్ హీరోగా ఈవీవీ స‌త్య‌నారాయ‌ణ చేసిన న‌వ్వుల సంద‌డి గుర్తుకొస్తుంది.

ఏప్రిల్ 17న విజయ్ దేవరకొండ 'టాక్సీవాలా' టీజర్ విడుదల

పెళ్లి చూపులు చిత్రంతో నటుడిగా,  అర్జున్ రెడ్డి చిత్రంతో కమర్షియల్ స్టామినా ఉన్న హీరోగా పేరు తెచ్చుకొని, యువ హీరోల్లో సెన్సేషనల్ స్టార్ గా వెలుగొందుతున్న విజయ్ దేవరకొండ