బీజేపీలో చేరిన సింధియా.. కాంగ్రెస్‌పై తీవ్ర విమర్శలు

  • IndiaGlitz, [Wednesday,March 11 2020]

కేంద్ర మాజీ మంత్రి, మధ్యప్రదేశ్ నేత జ్యోతిరాదిత్య సింధియా మంగళవారం నాడు కాంగ్రెస్‌కు గుడ్ బై చెప్పిన సంగతి తెలిసిందే. అయితే.. నిన్న పార్టీకి రాజీనామా చేసిన ఆయన.. ఇవాళ బీజేపీ తీర్థం పుచ్చుకున్నారు. బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా సమక్షంలో సింధియా కాషాయ కండువా కప్పుకున్నారు. ఈ సందర్భంగా పార్టీ కండువా కప్పిన నడ్డా.. సింధియాను బీజేపీలోకి సాదరంగా ఆహ్వానించారు. ఈ చేరిక కార్యక్రమం ఢిల్లీలోని బీజేపీ ప్రధాన కార్యాయలయం జరిగింది. ఈ సందర్భంగా నడ్డా మాట్లాడుతూ.. బీజేపీ రాజమాత విజయరాజే సింధియా కుటుంబానికి చెందిన జ్యోతిరాదిత్య సింధియా సొంతగూటికి రావడం చాలా సంతోషంగా ఉందన్నారు.

కాంగ్రెస్‌పై విమర్శలు

‘బీజేపీలోకి నన్ను తీసుకున్నందుకు ప్రధాని మోదీ, హోం మంత్రి అమిత్‌షా, పార్టీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డాకు కృతజ్ఞతలు. నా జీవితాన్ని రెండు ఘటనలు మలుపు తిప్పాయి. తండ్రి మరణం జీవితాన్ని మలుపు తిప్పింది. ఆయన 75వ జయంతి మరోసారి నాకు కొత్త జీవితాన్ని ప్రసాదించింది. యువతను కాంగ్రెస్ పార్టీ విస్మరించింది. ఆ పార్టీలో యువత నిర్లక్ష్యానికి గురవుతోంది. దేశానికి యువత సేవలు అందించలేక పోతోంది. కమల్‌నాథ్ ప్రభుత్వం అవినీతికి కొమ్ము కాస్తోంది. 2019లో ఎవరూ ఊహించని అద్భుతమైన తీర్పు ప్రజలు బీజేపికి ఇచ్చారు. ప్రధాని మోదీ చేతుల్లో దేశం సురక్షితంగా ఉంది’ అని కాంగ్రెస్‌పై సింధియా విమర్శలు గుప్పించారు.

More News

ఇద్ద‌రిలో ప‌వ‌న్‌తో చేసెదెవ‌రు?

ప‌వ‌ర్‌స్టార్ ప‌వ‌న్‌క‌ల్యాణ్ టైటిల్ పాత్ర‌లో శ్రీరామ్ వేణు ద‌ర్శ‌కుడిగా రూపొందుతోన్న చిత్రం ‘వ‌కీల్ సాబ్‌’. బోనీకపూర్ సమర్పణలో

సినిమా కోసం హ‌నీమూన్ వాయిదా!!

యువ క‌థానాయ‌కుడు నిఖిల్ ప్ర‌స్తుతం పెళ్లి కంటే సినిమా మూడ్‌లోనే ఉన్న‌ట్లున్నాడు. `అర్జున్ సుర‌వరం` స‌క్సెస్ త‌ర్వాత నిఖిల్ `కార్తికేయ2`

ప్ర‌భాస్ 20 ఫ‌స్ట్‌లుక్ ముహూర్తం కుదిరింది

బాహుబ‌లి త‌ర్వాత యంగ్ రెబ‌ల్‌స్టార్ ప్ర‌భాస్ నేష‌న‌ల్ రేంజ్ ఇమేజ్‌ను సొంతం చేసుకున్నారు. ఆ త‌ర్వాత వ‌చ్చిన సాహో బాలీవుడ్‌, టాలీవుడ్‌లో

‘మ‌ధ’ ప్రీ రిలీజ్ ఫంక్ష‌న్‌

26 ఇంట‌ర్నేష‌న‌ల్‌ ఫిలిం ఫెస్టివ‌ల్ అవార్డ్స్ సొంతం చేసుకున్న సైక‌లాజిక‌ల్ థ్రిల్ల‌ర్‌ ‘మ‌ధ‌’. థర్డ్ ఐ ప్రొడక్షన్స్ బ్యానర్‌పై రాహుల్, త్రిష్ణా ముఖర్జీ హీరో హీరోయిన్లుగా

బాలయ్యను కూడా బాబు మోసం చేస్తాడేమో.. : ప్రాణ స్నేహితుడు

టాలీవుడ్ సీనియర్ నటుడు, హిందూపురం టీడీపీ ఎమ్మెల్యే బాలకృష్ణ ప్రాణ స్నేహితుడు, మాజీ ఎమ్మెల్యే కదిరి బాబూరావు ఆ పార్టీకి టాటా చెప్పేసి వైసీపీ తీర్థం పుచ్చుకున్నారు.