హైదరాబాద్: కరోనా ఎఫెక్ట్‌తో స్కూల్స్‌కు సెలవు!

  • IndiaGlitz, [Wednesday,March 04 2020]

‘కరోనా వైరస్’ ప్రపంచాన్ని గడగడలాడిస్తోంది. ఇప్పుడీ తెలుగు రాష్ట్రాలకు పాకడంతో ఎప్పుడేం జరుగుతుందో అని జనాలు భయంతో వణికిపోతున్నారు. తెలంగాణలో ఓ కేసు నమోదు కాగానే సామాన్య ప్రజల్లో ఒక్కసారిగా భయాందోళనలు మొదలయ్యాయి. మరోవైపు.. కరోనా అనుమానితులు ఎక్కువవుతుండటంతో ఎప్పుడు ఏం జరుగుతుందో తెలియక జనం బిక్కుబిక్కుమంటున్నారు. హైదరాబాద్‌లో కరోనా సోకిన వ్యక్తి సికింద్రాబాద్‌ కంటోన్మెంట్‌లోని మహేంద్రాహిల్స్‌ ప్రాంతానికి చెందిన వ్యక్తి. దీంతో ఆ పరిసరాల్లోని పాఠశాలలకు అధికారులు సెలవులు ప్రకటించారు. దగ్గు, తుమ్ములు, జలుబు ఉంటే వెంటనే ఆస్పత్రికి వెళ్లాలని ప్రభుత్వం సూచిస్తోంది. ప్రస్తుతం బాధితుడి ఇంట్లో కూడా ఎవరూ లేరు. మహేంద్రహిల్స్ ప్రాంతం దాదాపుగా ఒక్కొక్కరుగా ఇళ్లు ఖాళీ చేసి బంధువులు, సొంతూళ్లకు వెళ్లిపోతున్నారు. మరోవైపు కంటోన్మెంట్‌ పారిశుద్ధ్య సిబ్బంది ఈ ప్రాంతంలో విస్తృతంగా తనిఖీలు నిర్వహించి.. ఆ ప్రాంత వాసులకు వైద్య సిబ్బంది తగు జాగ్రత్తలు చెబుతోంది. కొందరు ముందస్తు జాగ్రత్తగా వైద్య పరీక్షలు చేయించుకునేందుకు సిద్ధమవుతున్నారు.

ఎవరెవర్ని కలిశాడో ఏంటో..!
కాగా.. గత నెల 19వ తేదీన దుబాయి నుంచి బెంగళూరుకు ఓ సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగి వచ్చాడు. 22న మహేంద్రాహిల్స్‌ లోని సొంతింటికి వచ్చాక ఐదు రోజులపాటు వివిధ ప్రాంతాల్లో తిరిగాడు. అయితే ఇలా తిరిగిన ఐదు రోజుల తర్వాత కరోనా వైరస్‌ సోకినట్లు గుర్తించడంతో మొదట అపోలో ఆస్పత్రిలో చికిత్స తీసుకుని అనంతరం గాంధీ ఆసుపత్రిలో ప్రస్తుతం వైద్యం తీసుకుంటున్నాడు. ఐదు రోజులపాటు ఆయన ఎక్కడికెళ్లాడు..? ఎవర్ని కలిశాడు..? ఆయన కలిసి ఎవరెవరు తిరిగారు..? ఎవరెవరు ఆయనతో పాటుగా జర్నీ చేశారనేది తెలియరాలేదు. అయితే ఏపీకి సంబంధించిన 17 మంది ఆయనతో కలిసి పయనించినట్లు తెలుస్తోంది. దీంతో అటు ఏపీలో కూడా ఆ 17 మంది కనుగొనే పనిలో అక్కడి ప్రభుత్వం నిమగ్నమైంది.

పడకలు సిద్ధం!
ఇదిలా ఉంటే.. గాంధీలో 40, ఫీవర్‌లో 40, చెస్ట్‌ ఆస్పత్రిలో 10 పడకలను ఏర్పాటు చేసినట్లు ప్రభుత్వం ఓ ప్రకటనలో పేర్కొంది. గాంధీ ఆస్పత్రిలో 7వ అంతస్తులో కరోనా వైరస్‌ ఐసోలేటెడ్‌ వార్డు, అత్యవసర విభాగంలో అక్యూట్‌ ఎమర్జెన్సీ కరోనా వైరస్‌ వార్డు పేరిట వార్డులు సిద్ధం చేశామని వైద్యులు చెబుతున్నారు. ప్రస్తుతం వైరస్‌ సోకిన వ్యక్తిని ఏడో అంతస్తులోని వార్డులో ఉంచి చికిత్స అందిస్తున్న విషయం తెలిసిందే. మరోవైపు సరోజనీదేవి కంటి ఆస్పత్రిలో 200 పడకలు, ఉస్మానియా ఆస్పత్రిలో మరో పది పడకలతో వార్డును ఏర్పాటు చేస్తున్నట్లు వైద్యులు మీడియాకు వెల్లడించారు.

More News

షాకింగ్: వ్యభిచారం గృహంలో పట్టుబడ్డ జబర్దస్త్ నటులు

తెలుగు పేరుగాంచిన ప్రముఖ జబర్దస్త్‌ షోకు చెందిన ఇద్దరు నటులు వ్యభిచార గృహంలో పట్టుబడటం షాక్‌కు గురి చేస్తోంది.

మహేశ్ గ్రీన్ సిగ్న‌ల్‌.. చైతు సినిమా వాయిదా!

సూప‌ర్‌స్టార్ మ‌హేశ్ 27వ సినిమా స్టార్ట్ కానే లేదు కానీ..చాలా మ‌లుపుల‌ను తీసుకుంటోంది. ఎందుక‌నో ప్ర‌త్యేకంగా చెప్ప‌న‌క్క‌ర్లేదు.

అనుష్క పెళ్లిపై మ‌రో వార్త‌..నిజ‌మెంత‌?

టాలీవుడ్ స్టార్ హీరోయిన్‌గా పేరున్న అనుష్క శెట్టి పెళ్లిపై రొజుకొక వార్త విన‌ప‌డుతుంది. కొన్ని రోజుల క్రితం అనుష్క ఓ ప్ర‌ముఖ క్రికెట‌ర్‌ను పెళ్లి చేసుకోనుంద‌ని వార్త‌లు వినిపించాయి.

మార్చి13న ‘ప్రేమపిపాసి’ రిలీజ్‌

ఎస్‌.ఎస్‌.ఆర్ట్‌ ప్రొడక్షన్స్‌, యుగ క్రియేషన్స్‌  బ్యానర్స్‌ పై రాహుల్‌ భాయ్‌ మీడియా మరియు దుర్గశ్రీ ఫిల్మ్స్‌ సంయుక్తంగా నిర్మిస్తున్న చిత్రం ‘ప్రేమ పిపాసి’

నాగీ సినిమాకు ప్రభాస్ 70 కోట్ల పారితోషికం!?

‘బాహుబలి’లాంటి భారీ సినిమాతో వరల్డ్ ఫేమస్ అయిన ప్రభాస్.. ‘మహానటి’ సినిమా తనకంటూ ఓ క్రేజ్ దక్కించుకున్న నాగ్ అశ్విన్ కాంబోలో సినిమా వస్తున్న సంగతి తెలిసిందే.