'సవ్యసాచి' వాయిదా పడుతోందా?

  • IndiaGlitz, [Sunday,May 06 2018]

నాగ చైతన్య, నిధి అగర్వాల్ హీరోహీరోయిన్లుగా నటిస్తున్న చిత్రం ‘సవ్యసాచి’. చందు మొండేటి దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని మైత్రీ మూవీ మేకర్స్ సంస్థ నిర్మిస్తోంది. సిస్టర్ సెంటిమెంట్‌తో తెరకెక్కుతున్న ఈ సినిమాలో సీనియ‌ర్ క‌థానాయిక భూమిక, తమిళ నటుడు మాధవన్ కీలక పాత్రల్లో నటిస్తున్నారు. యు.ఎస్.లో చిత్రీకరించనున్న తుది షెడ్యూల్ మినహా.. మిగిలిన చిత్రీకరణను పూర్తిచేసుకుందీ చిత్రం.

ఇదిలా ఉంటే.. జూన్‌లో విడుదల కావలసిన ఈ చిత్రం.. కొన్ని కార‌ణాల వ‌ల్ల‌ జూలైలో రిలీజ్ అయ్యే అవకాశాలున్నట్టు వార్తలు వినిపిస్తున్నాయి. అయితే దీనిపై చిత్ర బృందం నుంచి ఎటువంటి అధికారిక ప్రకటన వెలువడలేదు. త్వరలోనే దీనిపై చిత్ర యూనిట్ స్పందించే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. కాగా.. స్వ‌ర‌వాణి ఎం.ఎం.కీర‌వాణి సంగీత‌మందిస్తున్న ఈ చిత్రం కోసం.. నాగార్జున న‌టించిన అల్లరి అల్లుడు చిత్రంలోని నిన్ను రోడ్డు మీద చూసినాది అనే పాట‌ను రీమిక్స్ చేస్తున్నారు. 

More News

హార్రర్ కామెడీ గా 'వస్తా'

భానుచంద‌ర్‌, జీవా, అదిరే అభి, ఫ‌ణి ప్ర‌ధాన తారాగ‌ణంగా మెట్రో క్రియేష‌న్స్ బేన‌ర్‌పై రూపొందుతోన్న సినిమా `వ‌స్తా`.

డ‌బ్బింగ్ చెప్పుకుంటున్న అదితిరావ్ హైద‌రి

‘చెలియా’ సినిమాలో నటించి మంచి మార్కులనే సంపాదించుకుంది హైదరాబాదీ అమ్మాయి అదితిరావు హైదరి.

జూన్ 1న 'రాజు గాడు' విడుదల

యంగ్ హీరో రాజ్ తరుణ్ కథానాయకుడిగా ఎ.కె.ఎంటర్ టైన్మెంట్స్ పతాకంపై రామబ్రహ్మం సుంకర నిర్మిస్తున్న "రాజుగాడు"

ప్ర‌భాస్..దేశానికే డార్లింగ్‌

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్, బాలీవుడ్ బ్యూటీ శ్రద్ధా కపూర్ జంటగా నటిస్తున్న చిత్రం ‘సాహో’. యంగ్ అండ్ టాలెంటెడ్ డైరెక్టర్ సుజిత్ దర్శకత్వం వహిస్తున్నారు.

'మహానటి' రిలీజ్ కోసం ఎదురుచూస్తున్న హీరో

మాలీవుడ్ మెగాస్టార్ మమ్మూట్టి న‌ట‌వారసుడిగా మ‌ల‌యాళ ఫిల్మ్ ఇండస్ట్రీలో అడుగుపెట్టి తనకంటూ ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకున్నారు యంగ్ హీరో దుల్కర్ సల్మాన్.