నారా రోహిత్ 'సావిత్రి' రెండవ షెడ్యూల్ ప్రారంభం

  • IndiaGlitz, [Tuesday,November 17 2015]

యంగ్ జనరేషన్ హీరో లలో మంచి పేరు సంపాదించుకుంటున్న నారా రోహిత్ హీరో గా , నందిత హీరోయిన్ గా రూపొందుతోన్న చిత్రం 'సావిత్రి'. ఈ చిత్రాన్ని పవన్ సాదినేని దర్శకత్వం లో, విజన్ ఫిలింమేకర్స్ పతాకం పై డా. వి .బి. రాజేంద్ర ప్రసాద్ నిర్మిస్తున్నారు.

మొదటి షెడ్యుల్ ను విజయవంతం గా పూర్తి చేసుకున్న ఈ చిత్రం గురించి మాట్లాడుతూ, " ఇది ఒక పూర్తి ఫామిలీ ఎంటర్టైనర్. మొదటి షెడ్యూల్ ని విజయవంతం గా పూర్తి చేసి, ఇప్పుడు రెండవ షెడ్యూల్ ని ఏలూరు పరిశర ప్రాంతాలలో నవంబరు 18 నుండి ప్రారంభిస్తున్నాం. రోహిత్, నందిత ల కాంబినేషన్ ఈ చిత్రానికి ఎంతో ప్లస్ అవుతుంది. ఉన్నతమైన సాంకేతిక విలువలతో ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాం" అని నిర్మాత డా. వి .బి. రాజేంద్ర ప్రసాద్ అన్నారు.

దర్శకుడు పవన్ సాదినేని మాట్లాడుతూ, " ప్రేమా ఇష్క్ కాదల్ చిత్రం తో మంచి గుర్తింపు లభించింది. ఇప్పుడు నారా రోహిత్ తో 'సావిత్రి' చిత్రాన్ని ఒక పూర్తి కమర్షియల్ ఫామిలీ ఎంటర్టైనర్ గా రూపొందిస్తున్నాం. రోహిత్ పెర్ఫార్మన్స్ లో, బాడీ లాంగ్వేజ్ లో ఎంతో ఫ్రెష్నెస్ ఈ చిత్రం లో ఉంటుంది. నందిత వంటి అభినయం తెలిసిన హీరోయిన్ తో పని చేయటం ఆనందం గా ఉంది" అని అన్నారు.

నటీనటులు : నారా రోహిత్, నందిత, పోసాని కృష్ణ మురళి, మురళి శర్మ, అజయ్, రవి బాబు, జీవ, వెన్నెల కిషోర్, శ్రీముఖి , ధన్య బాలకృష్ణన్, మధు నందన్, సత్యం రాజేష్, ప్రభాస్ శ్రీను షకలక శంకర్ తదితరులు

సాంకేతిక విభాగం : సినిమాటోగ్రఫీ - వస్సంత్ , డైలాగ్స్ - కృష్ణ చైతన్య, సంగీతం - శ్రవణ్ , ఎడిటర్ - గౌతం నెరుసు , ఫైట్స్ - డ్రాగన్ ప్రకాష్, కథ - స్క్రీన్ ప్లే - దర్శకత్వం - పవన్ సాదినేని, ఎగ్జిక్యుటివ్ ప్రొడ్యూసర్ - జాబిల్లి నాగేశ్వర రావు, నిర్మాత - డా. వి .బి. రాజేంద్ర ప్రసాద్

More News

స్వాతికి మ‌రో ఆఫ‌ర్..

అష్టా చ‌మ్మా, డేంజ‌ర్, గోల్కండ హైస్కూల్, ఆడ‌వారి మాట‌ల‌కు అర్ధాలే వేరులే..ఇలా డిఫ‌రెంట్ మూవీస్ లో న‌టించి మెప్పించిన హీరోయిన్ క‌ల‌ర్స్ స్వాతి.

అర‌వింద్ అంత డిమాండ్ చేస్తున్నాడా..

మెగా ప‌వ‌ర్ స్టార్ రామ్ చ‌ర‌ణ్ త‌ని ఓరువ‌న్ రీమేక్ లో న‌టిస్తున్న విష‌యం తెలిసిందే. ఈ చిత్రాన్ని సురేంద‌ర్ రెడ్డి తెర‌కెక్కిస్తున్నారు.

సూర్య 24 మూవీ రిలీజ్ వాయిదా..

హీరో సూర్య‌, మ‌నం ఫేం విక్ర‌మ్ కుమార్ కాంబినేష‌న్ లో రూపొందుతున్నక్రేజీ మూవీ 24. ఈ చిత్రంలో సూర్య స‌ర‌స‌న స‌మంత‌, నిత్యా మీన‌న్ న‌టిస్తున్నారు.

బాల‌య్య వెర్షెస్ నాగ్

నంద‌మూరి న‌ట సింహాం బాల‌క్రిష్ణ న‌టిస్తున్న తాజా చిత్రం డిక్టేట‌ర్. ఈ చిత్రాన్ని శ్రీవాస్ తెర‌కెక్కిస్తున్నారు.

ఆ ముగ్గురు నిర్మాత‌లు క‌లిసారు

ఇటీవ‌ల అగ్ర‌హీరోల సినిమా రిలీజ్ డేట్ విష‌యంలో చాలా గంద‌ర‌గోళ ప‌రిస్థ‌తి ఏర్ప‌డింది. ఒక పెద్ద సినిమా రిలీజ్ డేట్ మారితే..మొత్తం సినిమాల రిలీజ్ డేట్స్ మారిపోతున్నాయి.