సెన్సార్ పూర్తి చేసుకున్న 'సావిత్రి'

  • IndiaGlitz, [Thursday,March 24 2016]

యంగ్ జనరేషన్ హీరోస్ లో మంచి పేరు తెచ్చుకున్న వారిలో నారా రోహిత్ ఒకరు. తొలి చిత్రం బాణం నుండి విభిన్నమైన కథలు ఎంపికలో కొత్తవాళ్ళకి చాన్స్ ఇవ్వటం లో నారా రోహిత్ ఎప్పుడు ముందుంటున్నారు. ప్రేమ ఇష్క్ కాదల్ ఫేమ్ పవన్ సాదినేని దర్శకత్వంలో విజన్ ఫిలిం మేకర్స్ పతాకంపై డా.వి.బి.రాజేంద్రప్రసాద్ నిర్మాతగా నారారోహిత్ -నందిత కాంబినేషన్ లో వస్తున్నా సావిత్రి'. లవ్ అండ్ ఫ్యామిలీ ఎంటర్ టైనర్ గా రూపొందిన ఈ చిత్రాన్ని ఏప్రిల్ 1న గ్రాండ్ లెవల్ లో విడుదల చేస్తున్నారు. ఈ సినిమా సెన్సార్ కార్యక్రమాలను పూర్తి చేసుకుంది. ఈ సందర్భంగా.....

నిర్మాత వి.బి.రాజేంద్రప్రసాద్ మాట్లాడుతూ ' ఇది ఒక క్యూట్ లవ్ అండ్ ఫ్యామిలీ ఎంటర్ టైనర్. సినిమా ఫస్ట్ లుక్, టీజర్ విడుదలైన రోజు నుండి ఆడియెన్స్ లో పాజిటివ్ బజ్ ఏర్పడింది. సినిమా సెన్సార్ కార్యక్రమాలు పూర్తయ్యాయి. సింగిల్ కట్ లేకుండా సినిమా క్లీన్ యు సర్టిఫికేట్ ను పొందింది. నారా రోహిత్, నందిత ల కాంబినేషన్ ఈ చిత్రానికి ఎంతో ప్లస్ అవుతుంది. ప్రేమ ఇష్క్ కాదల్ వంటి డిఫరెంట్ లవ్ స్టోరీని తెరకెక్కించిన దర్శకుడు పవన్ సాధినేని ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. ఇటీవల శ్రవణ్ అందించిన పాటలు విడుదలయ్యాయి. పాటలకు ఆడియెన్స్ ను మంచి స్పందన వచ్చింది. రోహిత్ బాడీ లాంగ్వేజ్ చాలా కొత్తగా ఉంటుంది. లవ్ అండ్ ఫ్యామిలీ ఎంటర్ టైనర్ గా రూపొందిన ఈ చిత్రాన్ని వరల్డ్ వైడ్ గా ఏప్రిల్ 1న గ్రాండ్ లెవల్ లో విడుదల చేస్తున్నాం'' అన్నారు.

More News

బాలీవుడ్ లో ఊపిరి

నాగార్జున - కార్తీ - త‌మ‌న్నా కాంబినేష‌న్లో రూపొందిన క్రేజీ భారీ మ‌ల్టీస్టార‌ర్ ఊపిరి. ఈ చిత్రాన్ని వంశీ పైడిప‌ల్లి తెర‌కెక్కించారు. పి.వి.పి సంస్థ అత్యంత ప్ర‌తిష్టాత్మ‌కంగా ఊపిరి చిత్రాన్ని నిర్మించింది.

ముంబాయిలో స‌ర్ధార్ ఆడియో 

ప‌వ‌ర్ స్టార్ ప‌వ‌న్ క‌ళ్యాణ్ న‌టించిన స‌ర్ధార్ గ‌బ్బ‌ర్ సింగ్ టాలీవుడ్ లోనే కాకుండా బాలీవుడ్ లో కూడా రిలీజ్ అవుతుంది. బాలీవుడ్ లో 800 ధియేట‌ర్స్ లో స‌ర్ధార్ గ‌బ్బ‌ర్ సింగ్ రిలీజ్ అవుతుండ‌డం విశేషం.

బంధాలు - బంధుత్వాల ప్రాముఖ్య‌త తెలియ‌చెప్పే మ‌నంద‌రి క‌థ ఊపిరి - డైరెక్ట‌ర్ వంశీ పైడిప‌ల్లి

మున్నా, బృందావ‌నం, ఎవ‌డు..చిత్రాల‌ను తెర‌కెక్కించిన డైరెక్ట‌ర్ వంశీ పైడిప‌ల్లి తాజా చిత్రం ఊపిరి. టాలీవుడ్ కింగ్ నాగార్జున - కోలీవుడ్ హీరో కార్తీ - మిల్కీబ్యూటీ త‌మ‌న్నా కాంబినేష‌న్లో రూపొందిన ఊపిరి చిత్రాన్ని పి.వి.వి సంస్థ ప్ర‌తిష్టాత్మ‌కంగా నిర్మించింది.

సునీల్ హీరోగా క్రాంతి మాధవ్ దర్శకత్వంలో నూతన చిత్రం

స్టార్ కమెడియన్ గా తనకంటూ ప్రత్యేక స్థానం ఏర్పర్చుకొని... కథానాయకుడిగా వరుస విజయాలు అందుకుంటున్న సునీల్ మరో చిత్రానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు.

సుప్రీమ్ కోసం దిల్ రాజు భారీ ప్లాన్..

మెగాస్టార్ మేన‌ల్లుడు సాయిథ‌ర‌మ్ తేజ్ హీరోగా ప‌టాస్ ఫేం అనిల్ రావిపూడి ద‌ర్శ‌క‌త్వంలో రూపొందుతున్న చిత్రం సుప్రీమ్. ఈ చిత్రాన్ని శ్రీ వెంక‌టేశ్వ‌ర క్రియేష‌న్స్ బ్యాన‌ర్ పై దిల్ రాజు నిర్మిస్తున్నారు.