'సరైనోడు' తో మళ్లీ అలాగే..

  • IndiaGlitz, [Wednesday,March 30 2016]

మాస్ మెచ్చే సినిమాల‌ను తీయ‌డంలో బోయ‌పాటి శ్రీ‌ను స్టైలే వేరు. తొలి చిత్రం 'భ‌ద్ర' నుంచి గ‌త చిత్రం 'లెజెండ్' వ‌ర‌కు ఆయ‌న మాస్ ముద్ర స్ప‌ష్టంగా క‌నిపిస్తుంది. రాబోయే కొత్త చిత్రం 'స‌రైనోడు'లోనూ త‌న శైలిని అలాగే కొన‌సాగిస్తున్నారాయ‌న‌. అయితే మాస్ ముద్ర‌నే కాకుండా.. మ‌రో విష‌యంలోనూ ఆయ‌న మార్క్ ఉంటుంది

అదేమిటంటే.. త‌న సినిమాల్లో కేర‌ళ కి చెందిన క‌థానాయిక‌లే వీలైనంత వ‌ర‌కు అవ‌కాశాలివ్వ‌డం. 'లెజెండ్' సినిమా మిన‌హాయిస్తే.. ఈ అంశం ప్ర‌తి సినిమాలోనూ చోటు చేసుకుంది. భ‌ద్ర‌లో న‌టించిన మీరా జాస్మిన్ మొద‌లుకొని.. తుల‌సి, సింహా (న‌య‌న‌తార‌), ద‌మ్ము (కార్తీక‌) వ‌ర‌కు ఇది కొన‌సాగించారు. మ‌ళ్లీ ఇప్పుడు 'స‌రైనోడు'లో ఈ అంశానికి మ‌రోసారి చోటిస్తూ.. మ‌ల‌యాళ ముద్దుగుమ్మ కేథ‌రిన్ ట్రెసా కి ఇద్ద‌రు క‌థానాయిక‌ల‌లో ఒక‌రిగా చోటిచ్చారు. ఏదేమైనా.. కేర‌ళ కుట్టిల‌ను ప్రోత్స‌హించ‌డంలో ముందుండే ద‌ర్శ‌కుల‌లో బోయ‌పాటి స్థానం ప్ర‌త్యేకం.